Movie News

ప్రభాస్‍ని పడగొట్టాలంటే ఆమాత్రం వుండాలి

ఓ పేరున్న దర్శకుడు వెళ్లి స్టోరీ అవుట్‍లైన్‍ చెప్పేస్తే సినిమా చేసేద్దామని చెప్పేస్తుంటారు అగ్ర హీరోలు. అయితే ప్రభాస్‍ ఇప్పుడా స్టేజ్‍ దాటిపోయాడు. తనపై అయిదు వందల కోట్ల బిజినెస్‍ ఆధారపడి వుండడంతో కేవలం ఐడియాలు చెబుతోన్న దర్శకులకు ప్రభాస్‍ గ్రీన్‍ సిగ్నల్‍ ఇవ్వడం లేదు. ఎంత పేరున్న దర్శకుడయినా కానీ తనకు ‘సినిమా’ చూపిస్తేనే ఓకే అంటున్నాడు. స్టార్‍ డైరెక్టర్లు అవుట్‍లైన్స్ చెబుతుంటారే తప్ప ముందే బౌండ్‍ స్క్రిప్ట్ ఇవ్వరు.

అందుకే ప్రభాస్‍ని ఇటీవలి కాలంలో కలిసిన ఏ పెద్ద దర్శకుడికీ గ్రీన్‍ సిగ్నల్‍ దక్కలేదు. నాగ్‍ అశ్విన్‍, ఓం రౌత్‍ ఇద్దరూ తాము ఏం తీయబోతున్నదీ, ఎలా చేయబోతున్నదీ కూడా ఫుల్‍ ప్రజెంటేషన్‍ ఇచ్చి దాదాపుగా సినిమానే చూపించారట. వారి హోమ్‍వర్క్, క్లారిటీ నచ్చడంతో ఇక ఆ ప్రాజెక్టులు కాదనడానికి ప్రభాస్‍కి కారణం కనిపించలేదు. అగ్ర దర్శకులతో మాత్రమే పని చేయాలని కూర్చుంటే కుదరదని ప్రభాస్‍ గ్రహించాడు. అందుకే చేయగలడని నమ్మకం వున్న ఏ దర్శకుడికి అయినా తన డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ప్రభాస్‍తో సినిమా చేయాలని వున్న ఏ దర్శకుడు అయినా ఇకపై పూర్తిగా అన్నీ సిద్ధం చేసుకుని వెళ్లక తప్పదు.

This post was last modified on August 22, 2020 2:57 pm

Share

Recent Posts

సెంచరీ దాటేసినా ఇరుముడి తగ్గట్లేదు

టాక్సిక్ విడుదల వల్ల చాలా చోట్ల ఇరుముడి థియేటర్లు ఉన్నట్టుండి తగ్గిపోయాయి. ఇది ముందస్తుగా జరిగిన ఒప్పందంలో భాగమే అయినా…

1 hour ago

యష్ ఇమేజ్ వల్లే ఇంత ఓపెనింగ్

టాక్సిక్ టాక్స్, రివ్యూస్ పక్కనపెడితే ఇవాళ ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి.…

4 hours ago

చిరు అతడితో సినిమా చేసి ఉంటే..

మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు లెక్కలేసుకుని సినిమాలు చేసేవారు. కానీ ఈ మధ్య ఆయన తీరు మారిపోయింది. ఇమేజ్ ఛట్రం నుంచి…

5 hours ago

స్పిరిట్ కంటే వారణాసి పెద్ద సినిమా: సందీప్ వంగా

సందీప్ రెడ్డి వంగా.. ఏదైనా మాట్లాడితే ఆ మాటను చుట్టూ తిప్పే రకం కాదు. రోమాంచకం ట్రైలర్ ఈవెంట్‌లో స్పిరిట్,…

6 hours ago

బ్రేకింగ్… అమెరికా వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత

అమెరికా వెళ్లాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలు, కాన్సులేట్లలో వీసా అపాయింట్‌మెంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా…

6 hours ago

హైదరాబాద్ – విజయవాడ ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోదాడ మండలం ద్వారకుంట వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్…

7 hours ago