ఓ పేరున్న దర్శకుడు వెళ్లి స్టోరీ అవుట్లైన్ చెప్పేస్తే సినిమా చేసేద్దామని చెప్పేస్తుంటారు అగ్ర హీరోలు. అయితే ప్రభాస్ ఇప్పుడా స్టేజ్ దాటిపోయాడు. తనపై అయిదు వందల కోట్ల బిజినెస్ ఆధారపడి వుండడంతో కేవలం ఐడియాలు చెబుతోన్న దర్శకులకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఎంత పేరున్న దర్శకుడయినా కానీ తనకు ‘సినిమా’ చూపిస్తేనే ఓకే అంటున్నాడు. స్టార్ డైరెక్టర్లు అవుట్లైన్స్ చెబుతుంటారే తప్ప ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇవ్వరు.
అందుకే ప్రభాస్ని ఇటీవలి కాలంలో కలిసిన ఏ పెద్ద దర్శకుడికీ గ్రీన్ సిగ్నల్ దక్కలేదు. నాగ్ అశ్విన్, ఓం రౌత్ ఇద్దరూ తాము ఏం తీయబోతున్నదీ, ఎలా చేయబోతున్నదీ కూడా ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చి దాదాపుగా సినిమానే చూపించారట. వారి హోమ్వర్క్, క్లారిటీ నచ్చడంతో ఇక ఆ ప్రాజెక్టులు కాదనడానికి ప్రభాస్కి కారణం కనిపించలేదు. అగ్ర దర్శకులతో మాత్రమే పని చేయాలని కూర్చుంటే కుదరదని ప్రభాస్ గ్రహించాడు. అందుకే చేయగలడని నమ్మకం వున్న ఏ దర్శకుడికి అయినా తన డేట్స్ ఇచ్చేస్తున్నాడు. ప్రభాస్తో సినిమా చేయాలని వున్న ఏ దర్శకుడు అయినా ఇకపై పూర్తిగా అన్నీ సిద్ధం చేసుకుని వెళ్లక తప్పదు.
This post was last modified on August 22, 2020 2:57 pm
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…