గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట. అలా ఉంది కొందరు నెటిజెన్ల అత్యుత్సాహం. గత ఏడాది కాలంలో తమిళ దర్శకులు మూడు మాస్ బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అవి విక్రమ్, జైలర్, జవాన్. ఇది సత్యం. అలా అని ఇంకే భాషలోనూ వేరెవరూ ఇలా హ్యాండిల్ చేయలేరనే రీతిలో జబ్బలు చరుచుకోవడం మాత్రం కామెడీనే. ఎందుకంటే మాస్ బాక్సాఫీస్ కి కొత్త గ్రామర్ తీసుకొచ్చిందే టాలీవుడ్. గుండమ్మ కథలో ఎన్టీఆర్ పాత్రతో మొదలుపెడితే అఖండలో బాలకృష్ణ దాకా ఎన్నో ఉదాహరణలు కళ్ళముందు కనిపిస్తాయి. ఇదంతా చరిత్రలో ఉన్న వాస్తవమే. మసిపూసి మారేడుకాయ చేయాల్సిన అవసరమే లేదు.
టికెట్ రేట్లు కేవలం రెండు మూడు రూపాయలు ఉన్న కాలంలోనే అడవిరాముడు ప్రభంజనం కోట్ల రూపాయలను రుచి చూపించింది. ఒరిజినల్ వెర్షన్ల కన్నా మంగమ్మ గారి మనవడు, ఘరానా మొగుడు, ముద్దుల మావయ్య, పెదరాయుడు, చంటి లాంటి సినిమాలు ఇండస్ట్రీ హిట్లు సాధించాయంటే మాస్ పల్స్ మీద మన దర్శకులకున్న పట్టే. రాఘవేంద్రరావు నుంచి అనిల్ రావిపూడి ఎవరికి వాళ్ళు తమదైన శైలిలో కమర్షియల్ జానర్ ని కొత్త పుంతలు తొక్కించారు. జవాన్ ని చూసి మురిసిపోతున్నాం కానీ ఇలాంటి హీరోయిజం బోయపాటి శీను తులసి, లెజెండ్ లాంటి వాటిలో ఎన్ని చూపించలేదు.
రాజమౌళి సింహాద్రి, విక్రమార్కుడులో ఎలివేషన్లను లెక్కబెట్టుకుంటూ వెళ్తే గంటలు చాలవు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఉత్తరాది ప్రేక్షకులను ఎలా కట్టిపడేశాయి. అవి చూసే మేమెంతో స్ఫూర్తి చెందానని సాక్ష్యాత్తు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ లే ఒప్పుకున్నారు. ఈ ఏడాదిలోనే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డికి కురిసిన కనక వర్షం మర్చిపోతే ఎలా. కాబట్టి ఇప్పుడేదో మనం వెనుకబడి కోలీవుడ్ దూసుకుపోతోంది అనుకుంటే అమాయకత్వమే. సలార్ వాయిదా అనే మాటే ప్రకంపనలు సృష్టించింది. ప్రాజెక్ట్ కె గురించి దేశమంతా ఎదురు చూస్తోంది. అడగ్గానే బాలీవుడ్ లెజెండ్స్ నటించారు.
ఎలా చూసుకున్నా దక్షిణాది నుంచి మాస్ డామినేషన్ మొదలయ్యింది తెలుగు నుంచే. నరసింహ, అరుణాచలంలు మనవి కాకపోవచ్చు. కానీ సమరసింహారెడ్డి, ఇంద్ర సునామి ఎవరివి. బాషా మాదని అరవ మిత్రులు చెప్పుకోవచ్చు. కానీ అసలదే అమితాబ్ బచ్చన్ హమ్ నుంచి స్ఫూర్తి పొందింది. కాబట్టి ప్రతి సింహానికి ఒక రోజు వస్తుందని సామెత చెప్పినట్టు ఇప్పుడేదో మనోళ్లు కొంత నెమ్మదించి ఉండవచ్చు. అంతమాత్రాన తక్కువంచనా వేస్తే ఎలా. రేపు భగవంత్ కేసరి కావొచ్చు లేదా గుంటూరు కారం అవ్వొచ్చు. సరైన టాక్ వస్తే దిమ్మదిరిగే స్థాయిలో మళ్ళీ రికార్డుల వేట మొదలుపెడతాయి. ఎటొచ్చి ఇవన్నీ మనకు కొత్త కాదు.
This post was last modified on September 9, 2023 12:38 am
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…