ఈ మధ్య కొత్త సినిమాల విడుదల తేదీల గురించి ఎన్ని వార్తలు వస్తున్నాయో.. వాయిదాల గురించి అంతకుమించిన న్యూస్లు చూస్తున్నాం. ముఖ్యంగా ‘సలార్’ సినిమా వాయిదా గురించి ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. ఆ సినిమా పోస్ట్ పోన్ కావడం వల్ల చాలా సినిమాల డేట్లు అట ఇటు ఇటు అయ్యాయి. తాజాగా ‘చంద్రముఖి-2’ సినిమా వాయిదా న్యూస్ బయటికి వచ్చింది. ఈ నెల 15న ఈ సినిమా రావట్లేదని తేలిపోయింది.
సెప్టెంబరు 28కి వాయిదా అంటున్నారు కానీ.. ఆ రోజు కూడా సినిమా రావడం సందేహమే అంటున్నారు. అసలే ట్రైలర్కు పూర్ రెస్పాన్స్ రాగా.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా అనుకున్న స్థాయిలో రాకపోవడంతో సినిమాను వాయిదా వేయక తప్పలేదు. కానీ ఇప్పటికే ‘స్కంద’ సినిమాను సెప్టెంబరు 14 నుంచి 28కి వాయిదా వేశారు. ఇప్పుడు ‘చంద్రముఖి-2’ కూడా వాయిదా పడటంతో మంచి వీకెండ్ వేస్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
సెప్టెంబరు చివర్లో వచ్చేది క్రేజీ వీకెండే కావచ్చు. కానీ అందులో ప్రతికూలతలు లేకపోలేదు. సరిగ్గా గణేష్ నిమజ్జనం రోజు చాలా సినిమాలు రిలీజవుతుండటం ప్రతికూలమే. వాటి డే-1 వసూళ్ల మాత్రం ప్రతికూ ప్రభావం పడుతుంది. పైగా పోటీ మరీ ఎక్కువ అయిపోవడంతో ఏ సినిమాకూ ఆశించిన వసూళ్లు రావు. ఇక సెప్టెంబరు 15 సంగతి చూస్తే ‘స్కంద’ ఆల్రెడీ వెనక్కి వెళ్లింది.
ఇప్పుడు ‘చంద్రముఖి-2’ కూడా రావట్లేదు. ఇక మిగిలింది ‘మార్క్ ఆంటోనీ’ మాత్రమే. ఈ వీకెండ్లో ఒక్క తమిళ డబ్బింగ్ మూవీతో ప్రేక్షకులు సర్దుకోవాలి. దీని బదులు ‘స్కంద’నే యధావిధిగా 15న వస్తే దానికి భారీ ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. అది వెనక్కి రాలేని పరిస్థి ఉన్నా రూల్స్ రంజన్, పెదకాపు, మ్యాడ్ లాంటి చిన్న సినిమాల్లో ఒకటో రెండో ప్రి పోన్ అయి 15న వస్తే వాటికి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తే మంచిది.
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…