‘కార్తికేయ 2’ తో యంగ్ హీరో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. నార్త్ లో ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో నిఖిల్ లైనప్ మారిపోయింది. అప్ కమింగ్ మూవీస్ అన్నీ భారీ స్కేల్ తో చేస్తున్నాడు. అయితే కార్తికేయ షూటింగ్ టైమ్ లోనే తనకి ‘స్వామీ రారా’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ తో ఓ సినిమా చేశాడు నిఖిల్. లండన్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా ఘాట్ చేశారు. మరో వారం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని నిఖిల్ దర్శకుడు ఇద్దరూ మీడియాతో చెప్పుకున్నారు. కానీ నిఖిల్ ఆ సినిమాకి మళ్ళీ డేట్స్ ఇవ్వలేదు.
ప్రెజెంట్ తన భారీ లైనప్ మీదే ఫోకస్ పెట్టాడు. దీంతో నిఖిల్ సుధీర్ వర్మ సినిమా ఆగిపోయిందనే టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయమని నిర్మాతలను హీరో నిఖిల్ రిక్వెస్ట్ చేసినట్లు అప్పట్లో ఇన్సైడ్ టాక్ వచ్చింది. మరి రష్ చూసి ఏమైనా డిస్కషన్ జరిగిందా తెలియదు కానీ ఇంత వరకూ ఆ సినిమా అప్ డేట్ మాత్రం బయటికి రాలేదు.
స్వామి రారా తర్వాత సుధీర్ వర్మ కి సరైన హిట్ లేదు. రీసెంట్ గా రావణాసుర తో డిజాస్టర్ డెలివరీ చేశాడు. డానికి ముందు షాకినీ దాకినీ తీసి ఫ్లాప్ ఇచ్చాడు. మరి ఈ నేపథ్యం లో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే తన బ్రాండ్ మీద ఎఫెక్ట్ అవుతుందని నిఖిల్ భావిస్తున్నాడా ? లేదా ఈ సినిమాను భారీ లైనప్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాడా ? తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిఖిల్ తన పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ సినిమా ట్రైనింగ్ కోసం విదేశాలు వెళ్ళాడు. మూడు నెలల పాటు అక్కడే ట్రైన్ అవ్వబోతున్నాడు. మరి సుధీర్ , నిఖిల్ సినిమా బయటికి వచ్చేదెప్పుడో ?
This post was last modified on September 8, 2023 4:35 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…