‘కార్తికేయ 2’ తో యంగ్ హీరో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. నార్త్ లో ఆ సినిమా మంచి వసూళ్లు రాబట్టడంతో నిఖిల్ లైనప్ మారిపోయింది. అప్ కమింగ్ మూవీస్ అన్నీ భారీ స్కేల్ తో చేస్తున్నాడు. అయితే కార్తికేయ షూటింగ్ టైమ్ లోనే తనకి ‘స్వామీ రారా’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధీర్ వర్మ తో ఓ సినిమా చేశాడు నిఖిల్. లండన్ బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా ఘాట్ చేశారు. మరో వారం షూటింగ్ బ్యాలెన్స్ ఉందని నిఖిల్ దర్శకుడు ఇద్దరూ మీడియాతో చెప్పుకున్నారు. కానీ నిఖిల్ ఆ సినిమాకి మళ్ళీ డేట్స్ ఇవ్వలేదు.
ప్రెజెంట్ తన భారీ లైనప్ మీదే ఫోకస్ పెట్టాడు. దీంతో నిఖిల్ సుధీర్ వర్మ సినిమా ఆగిపోయిందనే టాక్ వినిపిస్తుంది. నిజానికి ఈ సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ చేయమని నిర్మాతలను హీరో నిఖిల్ రిక్వెస్ట్ చేసినట్లు అప్పట్లో ఇన్సైడ్ టాక్ వచ్చింది. మరి రష్ చూసి ఏమైనా డిస్కషన్ జరిగిందా తెలియదు కానీ ఇంత వరకూ ఆ సినిమా అప్ డేట్ మాత్రం బయటికి రాలేదు.
స్వామి రారా తర్వాత సుధీర్ వర్మ కి సరైన హిట్ లేదు. రీసెంట్ గా రావణాసుర తో డిజాస్టర్ డెలివరీ చేశాడు. డానికి ముందు షాకినీ దాకినీ తీసి ఫ్లాప్ ఇచ్చాడు. మరి ఈ నేపథ్యం లో ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే తన బ్రాండ్ మీద ఎఫెక్ట్ అవుతుందని నిఖిల్ భావిస్తున్నాడా ? లేదా ఈ సినిమాను భారీ లైనప్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నాడా ? తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిఖిల్ తన పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ సినిమా ట్రైనింగ్ కోసం విదేశాలు వెళ్ళాడు. మూడు నెలల పాటు అక్కడే ట్రైన్ అవ్వబోతున్నాడు. మరి సుధీర్ , నిఖిల్ సినిమా బయటికి వచ్చేదెప్పుడో ?
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…