మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసిన దుల్కర్ సల్మాన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. మలయాళంతోపాటు తమిళ, కన్నడ, తెలుగు భాషలలోకి దుల్కర్ సల్మాన్ సినిమాలు డబ్ అవుతున్నాయి. ఇక తెలుగులో డైరెక్ట్ గా ‘సీతారామం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ మరింత చేరువయ్యాడు. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న దుల్కర్ సల్మాన్…మోడ్రన్ క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీతారామం’ లో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. సీతారామం చిత్రం తర్వాత దుల్కర్ సల్మాన్ కు తెలుగులో మార్కెట్ కూడా పెరిగింది.
ఆ చిత్రం తర్వాత దుల్కర్ నటించిన మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కోతా’ను తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. ఇప్పటివరకు లవర్ బాయ్ పాత్రలో, పోలీస్ ఆఫీసర్ వంటి సాఫ్ట్ పాత్రలలో నటించిన దుల్కర్ సల్మాన్ తొలిసారి ఫుల్ ఫ్లెడ్జెడ్ మాస్ పాత్రలో నటించారు. అయితే, మలయాళంలో మాస్ దుల్కర్ సల్మాన్ ను అక్కడి ప్రేక్షకులు ఆదరించినా తెలుగు ప్రేక్షకులను మాత్రం కింగ్ ఆఫ్ కోతా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే సీతారామం తర్వాత నేరుగా తెలుగులో మరో చిత్రంలో నటించేందుకు దుల్కర్ సల్మాన్ రెడీ అవుతున్నాడు.
టాలీవుడ్ దర్శకుడు పరుశురాం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రవి తన తొలి చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్ ఎల్ వి సినిమా పతాకంపై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో దుల్కర్ సరసన నటించబోతున్న హీరోయిన్ ఎవరు అన్నది అన్నది వెల్లడి కావాల్సి ఉంది. దుల్కర్ నటించబోతున్న ఈ ప్రేమ కథ చిత్రంలో సగభాగం అమెరికాలోనే చిత్రీకరణ జరుపుకోనుందని తెలుస్తోంది. మరి, సీతారామం తరహాలోనే ఈ లవ్ స్టోరీ కూడా దుల్కర్ కు భారీ హిట్ తెచ్చి పెడుతుందో లేదో వేచి చూడాలి.
This post was last modified on September 7, 2023 5:54 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…