హారర్ క్లాసిక్ గా నిలిచిపోయిన రజనీకాంత్ చంద్రముఖికి కొనసాగింపు లారెన్స్ తో వస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 విడుదలకు రంగం సిద్ధమయ్యింది. త్వరలోనే హైదరాబాద్ లో ఒక ఈవెంట్ కూడా చేయబోతున్నారు. ముందు నుంచి దీన్ని ప్యాన్ ఇండియా మూవీగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన లైకా ప్రొడక్షన్స్ హిందీలో మాత్రం రిలీజ్ చేయడం లేదు. ఇన్స్ టా గ్రామ్ లో హీరోయిన్ కంగనా రౌనత్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ తర్వాత ఓటిటి, శాటిలైట్ ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయమని, బాలీవుడ్ జనాలు మిస్ అవుతున్నందుకు బాధపడుతున్నానని పోస్ట్ చేసింది.
ఇలా ఎందుకు చేశారంటే చంద్రముఖి 2 సౌత్ లో వర్కౌట్ అయినంతగా నార్త్ ఆడియన్స్ దగ్గర అవ్వకపోవచ్చనే అనుమానం టీమ్ లో ఉందట. ఎందుకంటే మొదటి భాగాన్ని అక్షయ్ కుమార్ తో భూల్ భులాయ్యాగా రీమేక్ చేసి పెద్ద సక్సెస్ అందుకున్నారు. పూర్తిగా వేరే కథతో గత ఏడాది రెండో భాగం కూడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పాత టైటిల్ తీసుకుని అనువాదం చేస్తే జనానికి ఎక్కక పోవచ్చు. పైగా లారెన్స్ కి అక్కడి పబ్లిక్ లో పాపులారిటీ లేదు. అయితే కంగనా రౌనత్ ని పెట్టుకుని మరీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం అంతు చిక్కని విషయం.
ఇప్పటికే చంద్రముఖి 2 సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయింది. సీక్వెల్ తీస్తామని చెప్పి రీమేక్ చేశారేంటని దర్శకులు పి వాసుని నిలదీస్తున్నారు. చెన్నై వర్గాలు మాత్రం ఎలాంటి అంచనాలు రేపకుండా థియేటర్ లో సర్ ప్రైజ్ ఇచ్చేలా సెకండ్ హాఫ్ ని టెర్రిఫిక్ గా తీశారని, లారెన్స్ కంగనాల మధ్య సీన్లు మాస్ జనాలను ఊపేస్తాయని ఊరిస్తున్నారు. ఎంఎం కీరవాణి పాటలు తమిళంలో బాగానే ఉన్నాయనే ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. ప్రొడక్షన్, మ్యూజిక్ పరంగా చాలా రిచ్ గా కనిపిస్తున్న చంద్రముఖి 2 ఏపీ తెలంగాణలో పెద్ద ఎత్తున రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…