విడుదల తేదీల ప్రహసనాల్లో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సలార్ రగిలించిన వాయిదా చిచ్చు చాలా దూరం వెళ్తోంది. సెప్టెంబర్ 28 నుంచి అది తప్పుకోవడం ఆలస్యం మేమంటే మేమంటూ మీడియం సినిమాలు డేట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు రోజులు గడవనే లేదు అప్పుడే మార్పుల పర్వం మొదలయ్యింది. ముందుగా అనౌన్స్ చేసిన సితార ఎంటర్ టైన్మెంట్ మ్యాడ్ ఇప్పుడు తప్పుకునే ఆలోచనలో ఉన్నట్టు లేటెస్ట్ అప్ డేట్. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నె పరిచయమవుతున్న ఈ యూత్ ఫుల్ టీజర్ ఇటీవలే రిలీజ్ చేశారు.
ఇప్పుడీ నిర్ణయం వెనుక కారణాలు స్పష్టం. 15 నుంచి స్కంద హఠాత్తుగా 28 కి షిఫ్ట్ కావడం మాస్ సెంటర్స్ లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పైగా రామ్ కున్న ఫాలోయింగ్ దృష్ట్యా యూత్ మొదటి ప్రాధాన్యం స్కంద అవుతుందే తప్ప మ్యాడ్ కాదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే బోయపాటి శీను ర్యాంపేజ్ మాములుగా ఉండదు. అప్పుడు ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. కిరణ్ అబ్బవరం ఎంత ఫ్లాపుల్లో ఉన్నా సరే రూల్స్ రంజన్ కి 5 కోట్ల దాకా బిజినెస్ చేసారు. సో థియేటర్ కౌంట్ గట్టిగానే ఉంది. సితార నెట్వర్క్ తో మ్యాడ్ కి స్క్రీన్లు వస్తాయి కానీ అసలైతే ఆడియన్స్ ఓపెనింగ్స్ ఇవ్వాలిగా.
ఇవి కాకుండా శ్రీకాంత్ అడ్డాల పెదకాపు పార్ట్ 1 ఒకరోజు ఆలస్యంగా 29 రానుంది. దీన్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు కానీ బర్నింగ్ ఇష్యూ మీద చాలా హై ప్రొఫైల్ యాక్షన్ డ్రామాగా తీసినట్టు ఇన్ సైడ్ టాక్. ఇదే నిజమైతే సహజంగానే బిసి జనాలు దీనికే మొగ్గు చూపుతారు. కొత్త హీరో అయినా సరే పలాస తరహాలో కంటెంట్ ఉంటే బాక్సాఫీస్ వద్ద నిలబడుతుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మ్యాడ్ ని అక్టోబర్ 6కి జరపాలని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది. ఆ రోజు సుధీర్ బాబు మామ మశ్చీంద్ర తప్ప పెద్దగా పోటీ లేదు. ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ ఇచ్చేస్తారు.
This post was last modified on September 7, 2023 10:21 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…