ఇప్పటి తరానికి దివ్యభారతి అంటే ఠక్కున గుర్తు రాకపోవచ్చు కానీ 90 దశకంలో పిల్లలు, యువకులుగా ఉన్న వాళ్ళు ఈ అమ్మడిని మర్చిపోవడం అంత సులభం కాదు. వెంకటేష్ బొబ్బిలిరాజాతో తెరకు పరిచయమై డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకుని చాలా తక్కువ టైంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, చిరంజీవి రౌడీ అల్లుడు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్లు కొట్టి విపరీతమైన డిమాండ్ తెచ్చి పెట్టాయి. తర్వాత నా ఇల్లే నా స్వర్గం, చిట్టెమ్మ మొగుడు లాంటి ఫెయిల్యూర్స్ మార్కెట్ ని ప్రభావితం చేశాక బాలీవుడ్ కే అంకితమైపోయింది.
ఆమె చివరి చిత్రం ప్రశాంత్ తో చేసిన తొలిముద్దు. అనూహ్య పరిస్థితుల్లో చనిపోయిన దివ్యభారతి మరణం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచిపోయింది.1993 ముంబై తన స్వంత అపార్ట్ మెంట్ లో పై అంతస్థు నుంచి పడిపోయి ప్రాణాలు తీసుకుంది. భర్త సాజిద్ నడియాడ్ వాలా ప్రమేయం గురించి పోలీస్ శాఖ ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ గానే బుక్స్ లో ఉండిపోయింది. ఈ సంఘటన ఆధారంగా మలయాళంలో దిలీప్ హీరోగా బాంద్రా అనే సినిమా రూపొందుతోందని మల్లువుడ్ టాక్. మిల్కీ బ్యూటీ తమన్నా దివ్యభారతిగా కనిపించనున్నట్టు వినికిడి.
నేరుగా పేర్లను వాడకపోయినా అప్పటి ఘటన ఆధారంగానే బాలీవుడ్ చీకటి కోణాలను స్పృశించడంతో పాటు దివ్యభారతి మరణం వెనుక జరిగిన బయటికి తెలియని వాస్తవాలను చూపించబోతున్నట్టు తెలిసింది. బాంద్రా అధికారికంగా ఆ ప్లాట్ మీద తీస్తున్నామని దర్శకుడు అరుణ్ గోపీ చెప్పనప్పటికీ అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం దీని గురించే గొణుక్కుంటున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి హిందీ తెలుగుతో సహా అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తారని సమాచారం. ఇది నిజమైతే లేట్ ఇన్నింగ్స్ లోనూ తమన్నాకు మరో ఛాలెంజింగ్ రోల్ దొరికినట్టే.
This post was last modified on September 6, 2023 10:17 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…