ఇప్పటి తరానికి దివ్యభారతి అంటే ఠక్కున గుర్తు రాకపోవచ్చు కానీ 90 దశకంలో పిల్లలు, యువకులుగా ఉన్న వాళ్ళు ఈ అమ్మడిని మర్చిపోవడం అంత సులభం కాదు. వెంకటేష్ బొబ్బిలిరాజాతో తెరకు పరిచయమై డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ అందుకుని చాలా తక్కువ టైంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ, చిరంజీవి రౌడీ అల్లుడు ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్లు కొట్టి విపరీతమైన డిమాండ్ తెచ్చి పెట్టాయి. తర్వాత నా ఇల్లే నా స్వర్గం, చిట్టెమ్మ మొగుడు లాంటి ఫెయిల్యూర్స్ మార్కెట్ ని ప్రభావితం చేశాక బాలీవుడ్ కే అంకితమైపోయింది.
ఆమె చివరి చిత్రం ప్రశాంత్ తో చేసిన తొలిముద్దు. అనూహ్య పరిస్థితుల్లో చనిపోయిన దివ్యభారతి మరణం ఇప్పటికీ మిస్టరీగానే నిలిచిపోయింది.1993 ముంబై తన స్వంత అపార్ట్ మెంట్ లో పై అంతస్థు నుంచి పడిపోయి ప్రాణాలు తీసుకుంది. భర్త సాజిద్ నడియాడ్ వాలా ప్రమేయం గురించి పోలీస్ శాఖ ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ గానే బుక్స్ లో ఉండిపోయింది. ఈ సంఘటన ఆధారంగా మలయాళంలో దిలీప్ హీరోగా బాంద్రా అనే సినిమా రూపొందుతోందని మల్లువుడ్ టాక్. మిల్కీ బ్యూటీ తమన్నా దివ్యభారతిగా కనిపించనున్నట్టు వినికిడి.
నేరుగా పేర్లను వాడకపోయినా అప్పటి ఘటన ఆధారంగానే బాలీవుడ్ చీకటి కోణాలను స్పృశించడంతో పాటు దివ్యభారతి మరణం వెనుక జరిగిన బయటికి తెలియని వాస్తవాలను చూపించబోతున్నట్టు తెలిసింది. బాంద్రా అధికారికంగా ఆ ప్లాట్ మీద తీస్తున్నామని దర్శకుడు అరుణ్ గోపీ చెప్పనప్పటికీ అక్కడి ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం దీని గురించే గొణుక్కుంటున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి హిందీ తెలుగుతో సహా అన్ని భాషల్లో ప్యాన్ ఇండియా రిలీజ్ చేస్తారని సమాచారం. ఇది నిజమైతే లేట్ ఇన్నింగ్స్ లోనూ తమన్నాకు మరో ఛాలెంజింగ్ రోల్ దొరికినట్టే.
This post was last modified on September 6, 2023 10:17 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…