‘జీరో’ సినిమా 50 కోట్ల షేర్ కూడా రాబట్టలేక బాక్సాఫీస్ దగ్గర చతికిల పడ్డపుడు షారుఖ్ ఖాన్ పనైపోయిందని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు. దాని కంటే ముందు షారుఖ్ నుంచి వచ్చిన సినిమాలు వరుసగా డిజాస్టర్లయ్యాయి. ‘జీరో’తో ఆయన జీరో అయిపోయినట్లే కనిపించాడు. ఈ దెబ్బతో మూడేళ్ల పాటు కొత్త సినిమా ఏదీ చేయలేదు షారుఖ్. చాలా గ్యాప్ తీసుకుని, కొత్త సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాడు.
తెలివిగా కొత్త చిత్రాలను ఎంచుకున్నాడు. అందులో ముందుగా వచ్చిన ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర విధ్వంసమే సృష్టించింది. ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని రిలీజ్కు ముందే తేలిపోయింది. ప్రి రిలీజ్ హైప్ ఆ స్థాయికి చేరుకుంది. విడుదల కంటే ముందు ఇండియాలో ఏకంగా 10 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఐతే విడుదల కంటే ముందు పది లక్షల టికెట్లు అమ్ముడైన సినిమాలు లేకపోలేదు. బాహుబలి, కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఐతే ఇప్పుడు షారుఖ్ యునీక్ రికార్డు సాధించే దిశగా అడుగులు వేస్తున్నాడు.. ఒకే ఏడాది ఒక హీరో నటించిన రెండు చిత్రాలకు విడుదల కంటే ముందే పది లక్షల టికెట్లు అమ్ముడైన రికార్డు షారుఖ్ ఖాతాలో చేరబోతోంది. ‘జవాన్’ చిత్రం విడుదలకు మూడు రోజుల ముందే 7 లక్షల టికెట్ల మార్కును అందుకుంది. మంగళ, బుధ వారాల్లో ఇంకా పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడయ్యే అవకాశాలుండటంతో పది లక్షల మార్కును అందుకోవడం లాంఛనమే. పఠాన్, జవాన్ మూవీస్తో పఠాన్ అందుకున్న రికార్డును టచ్ చేయడం వేరే హీరోల వల్ల కాకపోవచ్చు.
This post was last modified on September 5, 2023 7:29 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…