Movie News

బాలు కోసం విదేశీ వైద్య బృందం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నాలుగు రోజుల కిందట ఆయన కాస్త కోలుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి పురోగతి లేదు.

వెంటిలేటర్ మీదే కొనసాగుతూ.. పరిస్థితి పెద్దగా మెరుగుపడకపోవడంతో ఆయనకు ఏమవుతుందో అన్న కంగారు అంతకంతకూ పెరిగిపోతోంది. నిన్న తన తండ్రి ఆరోగ్య పరిస్థితి అప్ డేట్ ఇస్తూ ఎస్పీ చరణ్ చాలా ఎమోషనల్ అవడం చూసి బాలు అభిమానుల కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.

బాలును రక్షించేందుకు ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్లు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. 12 మంది వైద్యుల బృందం ఆయనకు సేవలందిస్తోంది. ఆయన్ని కామన్ ఐసీయూ నుంచి తీసుకెళ్లిపోయి.. ఒక ఫ్లోర్లో ప్రత్యేకంగా ఐసీయూను ఏర్పాటు చేశారు. క్షణక్షణం ఆయన్ని వైద్యులు కనిపెట్టుకుని ఉంటూ సేవలందిస్తున్నారు.

అయినా పరిస్థితి విషమంగానే ఉంది. దీంతో ఆయనకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు విదేశాల నుంచి వైద్య బృందాన్ని రప్పిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆ బృందం ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుంటుందట. వాళ్లయినా బాలు పరిస్థితిని మెరుగుపరిచి కోట్లాది మంది ఆయన అభిమానులకు ఉపశమనాన్ని అందిస్తారేమో చూడాలి.

ఇదిలా ఉండగా.. బాలు వైద్య చికిత్సకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వమే భరిస్తుండటం విశేషం. విదేశీ వైద్యుల్ని రప్పించే విషయంలో కూడా ప్రభుత్వమే చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలు తెలుగువాడైనప్పటికీ.. తమిళంలో వేల పాటలు పాడి అక్కడి సంగీత ప్రియులకు అపరిమిత ఆనందాన్నిచ్చిన ఆయన్ని పరాయివాడిగా చూడట్లేదు అక్కడి జనం, ప్రభుత్వం. బాలు పరిస్థితి విషమించినప్పటి నుంచి తమిళ సినీ జనాలతో పాటు సామాన్యులు సైతం తీవ్ర వేదనకు గురవుతున్నారు.

This post was last modified on August 21, 2020 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

40 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago