సూపర్ స్టార్ మహేష్ బాబుని పవర్ ఫుల్ క్యామియో కోసం ఒక సినిమా బృందం సంప్రదించిందని, కథ నచ్చినా కూడా చేసేది లేనిది సమాధానం చెప్పలేదనే ప్రచారం హఠాత్తుగా ఊపందుకుంది. అలా అని ఏదో ఆషామాషీ మూవీ కోసమని అనుకునేరు. పవన్ కళ్యాణ్ ఓజి కోసమే ఈ ప్రతిపాదన వెళ్లినట్టుగా ఇన్ సైడ్ టాక్. గతంలో త్రివిక్రమ్ మాట మీద జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ కెరీర్ లో ఇప్పటిదాకా అతిథి పాత్రలు చేయలేదు. ఆ ఉద్దేశం కూడా లేదని పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. అయినా ఇప్పుడీ ప్రొపోజల్ వెళ్లిందంటే ఆసక్తి కలిగించే విషయమే.
ఈ మధ్య కాలంలో స్టార్ల క్యామియోలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. విక్రమ్ లో రోలెక్స్ గా సూర్య, జైలర్ లో నరసింహగా శివరాజ్ కుమార్ చేసిన కాంట్రిబ్యూషన్ చిన్నది కాదు. అందుకే ఇప్పుడు మన దర్శక నిర్మాతలు కూడా ఈ ట్రెండ్ మీద లుక్ వేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరగలేదా అంటే బోలెడున్నాయి. కానీ కథలను సరిగా హ్యాండిల్ చేయలేక దెబ్బ తిన్న వాళ్లే ఎక్కువ. ఉదాహరణకు హ్యాండ్సప్ లో చిరంజీవి, ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలకృష్ణ, అధిపతిలో నాగార్జున పాత్రలు ఇలా మంచి స్కోప్ ఉన్నప్పటికీ గెలవలేకపోయాయి.
సో మహేష్ బాబు దగ్గరకి ఓజి ప్రతిపాదన నిజంగా వచ్చి ఉంటే మాత్రం అది త్రివిక్రమ్ ప్రమేయం వల్లే అయ్యుంటుంది. అయితే తన సన్నిహిత వర్గాలు మాత్రం ఇదంతా పుకారేనని కొట్టి పారేస్తున్నాయి. గుంటూరు కారం తప్ప ఇంక దేని గురించి ఆలోచించే మూడ్ లో లేడని అంటున్నారు. రాజమౌళి స్క్రిప్ట్ పనులు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి కాబట్టి కొత్త ప్రాజెక్టులు ఎవరైనా సరే జనవరి తర్వాతే మాట్లాడుకుందామని నిర్మాతలతో చెప్పి పంపిస్తున్నారట. సో ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే తీసుకోవాలి. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంతో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో మహేష్ బిజీ అవుతున్నాడు.
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…
టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకడు. రాజమౌళి కాకుండా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్ లేని దర్శకుడు…
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య కాస్త స్క్రీన్ మీద తగ్గినట్టు కనిపించినా అవకాశాలకు ఏ లోటు లేదు.…
అసలు ఈ ఏడాది విడుదలవుతుందా లేదాని అనుమాన పడుతున్న టాక్సిక్ హఠాత్తుగా బాంబు వేసింది. ఆగస్ట్ 26 విడుదల చేయబోతున్నట్టు…
విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించి.. ఆయనను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే..…