Movie News

మహేష్ అతిథి పాత్రలో నిజమెంత

సూపర్ స్టార్ మహేష్ బాబుని పవర్ ఫుల్ క్యామియో కోసం ఒక సినిమా బృందం సంప్రదించిందని, కథ నచ్చినా కూడా చేసేది లేనిది సమాధానం చెప్పలేదనే ప్రచారం హఠాత్తుగా ఊపందుకుంది. అలా అని ఏదో ఆషామాషీ మూవీ కోసమని అనుకునేరు. పవన్ కళ్యాణ్ ఓజి కోసమే ఈ ప్రతిపాదన వెళ్లినట్టుగా ఇన్ సైడ్ టాక్. గతంలో త్రివిక్రమ్ మాట మీద జల్సాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ కెరీర్ లో ఇప్పటిదాకా అతిథి పాత్రలు చేయలేదు. ఆ ఉద్దేశం కూడా లేదని పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. అయినా ఇప్పుడీ ప్రొపోజల్ వెళ్లిందంటే ఆసక్తి కలిగించే విషయమే.

ఈ మధ్య కాలంలో స్టార్ల క్యామియోలు ఓ రేంజ్ లో పేలుతున్నాయి. విక్రమ్ లో రోలెక్స్ గా సూర్య, జైలర్ లో నరసింహగా శివరాజ్ కుమార్ చేసిన కాంట్రిబ్యూషన్ చిన్నది కాదు. అందుకే ఇప్పుడు మన దర్శక నిర్మాతలు కూడా ఈ ట్రెండ్ మీద లుక్ వేస్తున్నారు. అయితే గతంలో ఇలాంటి ప్రయత్నాలు జరగలేదా అంటే బోలెడున్నాయి. కానీ కథలను సరిగా హ్యాండిల్ చేయలేక దెబ్బ తిన్న వాళ్లే ఎక్కువ. ఉదాహరణకు హ్యాండ్సప్ లో చిరంజీవి, ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో బాలకృష్ణ, అధిపతిలో నాగార్జున పాత్రలు ఇలా మంచి స్కోప్ ఉన్నప్పటికీ గెలవలేకపోయాయి.

సో మహేష్ బాబు దగ్గరకి ఓజి ప్రతిపాదన నిజంగా వచ్చి ఉంటే మాత్రం అది త్రివిక్రమ్ ప్రమేయం వల్లే అయ్యుంటుంది. అయితే తన సన్నిహిత వర్గాలు మాత్రం ఇదంతా పుకారేనని కొట్టి పారేస్తున్నాయి. గుంటూరు కారం తప్ప ఇంక దేని గురించి ఆలోచించే మూడ్ లో లేడని అంటున్నారు. రాజమౌళి స్క్రిప్ట్ పనులు ఇంకా ప్రాధమిక దశలోనే ఉన్నాయి కాబట్టి కొత్త ప్రాజెక్టులు ఎవరైనా సరే జనవరి తర్వాతే మాట్లాడుకుందామని నిర్మాతలతో చెప్పి పంపిస్తున్నారట. సో ప్రస్తుతానికి ఇది గాసిప్ గానే తీసుకోవాలి. రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంతో భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో మహేష్ బిజీ అవుతున్నాడు.

Satya

Recent Posts

‘కోట’ చేసిన సంతకం ఎప్పటికీ శాశ్వతం

కొందరు నటులకు మరణం ఉండదు. భౌతికంగా మన మధ్య లేకపోయినా వాళ్ళ పాత్రలు సజీవంగా ఉంటూ తరాలు గడిచినా నిత్య…

8 minutes ago

శ్రీశ్రీ… ఇది కదా కావాల్సింది

సినిమాని ఎంత బాగా తీశామో దానికి అంతే మంచి టైటిల్ పెట్టడం ఎంతో అవసరం. ఈ ప్రాధమిక సూత్రాన్ని మర్చిపోయిన…

54 minutes ago

గూఢచారి 2 మీద బరువు పెరిగింది

బాలీవుడ్ లో స్పై డ్రామాలకు గడ్డు కాలం వచ్చేసింది. దురంధర్ పుణ్యమాని ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టి…

4 hours ago

టీడీపీని చూసైనా నేర్చుకోవాలి క‌దా!

జ‌న‌సేన నాయ‌కుల‌కు ఆ పార్టీ అధినేత చెబితే చెవికి ఎక్క‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న…

6 hours ago

కేటీఆర్ పాద‌యాత్ర పోస్ట్ పోన్‌… ?

తెలంగాణ‌లో మూడోసారి బీఆర్ఎస్ ప్ర‌భుత్వ ఏర్పాటే ల‌క్ష్యంగా ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పాద‌యాత్ర చేస్తాన‌ని…

9 hours ago

ఎంజిఆర్ ఎన్టీఆర్ తర్వాత విజయ్ అందుకున్నాడు

ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కొత్త సినిమా రిలీజ్ కావడం అనేది చరిత్రలో చాలా అరుదుగా జరుగుతుంది. ఆ…

13 hours ago