ఎప్పుడో మార్కెట్ పడిపోయింది, పేరుకి మొక్కుబడిగా సినిమాలు చేయడమే తప్ప ఇంకేం మిగల్లేదన్న రీతిలో ఉన్న 65 సంవత్సరాల సన్నీ డియోల్ కు గదర్ 2 ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్ ఒక్కసారిగా లెక్కలన్నీ మార్చేసింది. నెల తిరక్కుండానే ఏకంగా 500 కోట్ల క్లబ్బులో అడుగు పెట్టి ఈ ఏడాది పఠాన్ తర్వాత చోటు దక్కించుకోవడం ఎవరూ ఊహించనిది. దెబ్బకు పోటీలో ఉన్న అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 మంచి కంటెంట్ తోనూ బాక్సాఫీస్ వద్ద పోటీ ఇవ్వలేకపోయిందంటేనే గదర్ 2 తాలూకు ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎలా చూసుకున్నా ఇది మాములు విజయం కాదు.
మొత్తం బాలీవుడ్ కి ఈ ఫలితం సూపర్ కిక్ ఇచ్చింది. ఎంతగా అంటే మొత్తం స్టార్లందరూ కలిసి సక్సెస్ పార్టీకి వచ్చేంత. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి టాప్ స్టార్లతో మొదలుపెట్టి సిద్దార్థ్ మల్హోత్రా, విక్కీ కౌశల్, వరుణ్ ధావన్ లాంటి కుర్ర తరం దాకా ప్రతి ఒక్కరు హాజరయ్యాయి. ఇంత అపూర్వ సమ్మేళనం గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగలేదు. పైగా అందరూ జంటలుగా రావడం మరో విశేషం. గదర్ 2తో సంబంధం లేని టెక్నికల్ టీమ్ కూడా ఈ సంబరంలో పాలు పంచుకుంది. కాజోల్, కియారా అద్వానీ, అనుపమ్ ఖేర్, సునీల్ శెట్టి, అనిల్ కపూర్, జాకీ శ్రోఫ్ ఇలా చెప్పుకుంటూ పెద్ద లిస్ట్ ఉంది.
ఈ ఫోటోలు, వీడియోలు ఆన్ లైన్ లో వైరల్ గా మారాయి. ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం కలిసి నటించిన డర్ తర్వాత షారుఖ్, సన్నీల మధ్య అంతగా సత్సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం చాలా ఆత్మీయంగా పలకరించుకోవడం అభిమానులను కదిలించింది. ఆరు పదుల వయసులో ఉన్న హీరోకు మద్దతుగా ఇంత మంది రావడం విశేషమే. బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తున్న గదర్ 2 ఈ గురువారం జవాన్ వచ్చాక బ్రేకులు పడబోతున్నాయి. ఎలాగూ ఫైనల్ రన్ వచ్చేసింది కాబట్టి నెంబర్లలో పెద్దగా మార్పులు ఉండవు. ఇలాంటి అపూర్వ సంగమాలు టాలీవుడ్ లోనూ తరచు జరగాలి.
This post was last modified on September 4, 2023 12:34 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…