టాలీవుడ్లో మోస్ట్ సెలబ్రేటెడ్ కపుల్స్లో నాగచైతన్య-సమంతలది ఒకటి. వీరి ప్రేమాయణం మొదలైన దగ్గర్నుంచి మీడియాలో, సోషల్ మీడియాలో ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉన్నారు. పెళ్లి, ఆ తర్వాతి సమయంలోనూ అందరూ ఈ జంటను చూసి ముచ్చటపడ్డారు. అలాంటి జంట విడిపోవడం, విడాకులు తీసుకోవడం ఎవ్వరికీ నచ్చలేదు.
విడాకుల తర్వాత నాగ్ కుటుంబం.. సమంత గురించి మాట్లాడ్డం మానేసింది. సమంత కూడా అంతే. చైతూ, సామ్ ఇద్దరూ ఆ ఫేజ్ను దాటి వారి వారి జీవితాల్లో ముందుకు సాగిపోతున్నారు. ఇలాంటి సమయంలో చైతూ తండ్రి నాగార్జున సమంత గురించి మాట్లాడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. నాగ్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో కొత్త సీజన్ ఆదివారమే ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.
ఈ షో ప్రోమోలో నాగ్.. సమంత ప్రస్తావన తేవడం చర్చనీయాంశం అయింది. ఈ షో తొలి ఎపిసోడ్కు విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చాడు. తనతో పాటు నవీన్ పొలిశెట్టి కూడా షోలో సందడి చేశాడు. ఖుషి ప్రమోషన్లలో భాగంగా ఈ షోకు వచ్చిన విజయ్.. అందులోని పాటకు డ్యాన్స్ కూడా చేశాడు. ఐతే ఈ డ్యాన్స్ అయ్యాక విజయ్ని బిగ్ బాస్ షోలోకి ఆహ్వానిస్తూ.. మీ హీరోయిన్ సమంత ఎక్కడ అని అడిగాడు నాగ్. దీంతో ఆడిటోరియం హోరెత్తింది.
షో కోసం ఎంత ప్రొఫెషనల్గా వ్యవహరించినప్పటికీ.. తన మాజీ కోడలి గురించి నాగ్ ఇలా మాట్లాడతాడని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఈ వీడియో బిట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత కొన్ని నెలల నుంచి అమెరికాలో ఉంటూ అనారోగ్యానికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే ఖుషి ప్రమోషన్లలో కూడా ఆమె పెద్దగా కనిపించలేదు. విజయే పూర్తి బాధ్యత తీసుకుని సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
This post was last modified on September 4, 2023 10:22 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…