తమిళ నటుడు విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ చిత్రంలో నటించడంతో… ఆ చిత్రానికి నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ అతడినే పుష్పలో కూడా విలన్ గా ఖరారు చేసారు. విజయ్ సేతుపతికి తమిళంలో పాపులారిటీ ఉంది కనుక పాన్ ఇండియా అప్పీల్ కి బాగుంటుందని అనుకున్నారు. అయితే విజయ్ సేతుపతి విచిత్రమైన కండిషన్స్ పెట్టాడట.
తమిళంలో రిలీజ్ చేయకూడదని, ఒకవేళ చేస్తే తన పాత్ర వేరే నటుడితో తమిళ్ లో చేయించాలని, అలాగే ఇది పాన్ ఇండియా సినిమా కనుక, రేంజ్ పెద్దది కనుక పారితోషికం కూడా పది కోట్లు ఇవ్వాలని ఆటను పెద్ద లిస్ట్ చెప్పాడట. దాంతో అతనికి బదులుగా ఎవరైతే బాగుంటుందని అన్వేషిస్తున్నారు.
అయితే విజయ్ సేతుపతి వైపే అల్లు అర్జున్ మొగ్గుతున్నాడు కనుక అతనితోనే మంతనాలు జరిపి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. ఉప్పెన తమిళ్ లో రిలీజ్ చేయరని మాట ఇచ్చిన తర్వాతే విజయ్ సేతుపతి ఆ సినిమా ఒప్పుకున్నాడు. పుష్ప పాన్ ఇండియా అనేసరికి అతను తమిళంలో తన హీరో ఇమేజ్ కి దెబ్బ అని ససేమీరా అంటున్నాడు.
This post was last modified on April 25, 2020 4:27 am
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…