ఈ మధ్య కాలంలో బాలీవుడ్కు గొప్ప ఉపశమనాన్ని అందించిన సినిమా అంటే ‘గదర్-2’నే. రెండు దశాబ్దాల కిందటి బ్లాక్బస్టర్ మూవీ ‘గదర్’కు కొనసాగింపుగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని విజయాన్నందుకుంది. ఏకంగా ఐదొందల కోట్ల క్లబ్బులో ఈ సినిమా అడుగు పెట్టింది. పూర్తిగా లైమ్ లైట్ నుంచి వెళ్లిపోయిన సన్నీ డియోల్.. కెరీర్లో ఈ దశలో ఇలాంటి విజయం అందుకుంటాడని ఎవ్వరూ ఊహించి ఉండరు.
‘గదర్-2’కు ముందు చాలా ఏళ్లుగా ఆయన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఏం సినిమాలు చేస్తున్నాడనే చర్చ కూడా లేదు. ‘గదర్-2’తో ఇంత భారీ విజయాన్ని అందుకున్న సన్నీకి ఆర్థిక సమస్యలు చాలానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే ఆయన ఆస్తి ఒకటి వేలానికి కూడా వెళ్లిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కోర్టు జోక్యంతో దాన్నుంచి ఉపశమనం పొందాడు సన్నీ.
కాగా ఒక దర్శకుడు తాజాగా సన్నీ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. 26 ఏళ్ల కిందట తనకు ఇవ్వాల్సిన డబ్బును.. ఇప్పటికీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ సన్నీ మీద ఆరోపణలు గుప్పించాడు సునీల్ దర్శన్. సన్నీతో ఈ దర్శకుడు అజయ్, ఇంతెకామ్, లూటెరె సినిమాలు తీశాడు. ఐతే 1996లో ‘అజయ్’ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ హక్కులను సన్నీ అడిగాడట.
సొంతంగా డిస్ట్రిబ్యూషన్ సంస్థ మొదలుపెడున్నానని.. దాని ద్వారా ‘అజయ్’ను రిలీజ్ చేసే అవకాశం ఇవ్వాలని సునీల్ను సన్నీ కోరాడట. ఐతే హక్కులు తీసుకున్నాడు కానీ.. అందుకు గానుతనకు ఇస్తానన్న రూ.77.25 లక్షలు ఇవ్వలేదని సునీల్ ఆరోపించాడు. ఇన్నేళ్లుగా ఎన్నోసార్లు అడిగి అడిగి విసుగెత్తిపోయానని.. డబ్బులు ఇవ్వలేని స్థితిలో తనకు ఒక సినిమా చేస్తానని సన్నీ మాట ఇచ్చాడని.. కానీ ఆ మాటను కూడా నిలబెట్టుకోలేదని.. ఇప్పటికైనా తనకు న్యాయం చేస్తాడని ఆశిస్తున్నానని సునీల్ తెలిపాడు. మరి ఈ ఆరోపణలపై సన్నీ ఏమంటాడో చూడాలి.
This post was last modified on September 1, 2023 10:28 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్…
మంచు విష్ణు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. కన్నప్ప. ఈ చిత్రాన్ని విష్ణు అనే కాదు.. మంచు ఫ్యామిలీనే…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…