రామ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా ‘స్కంద’. ‘అఖండ’ తర్వాత బోయపాటి తీసిన సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ చాలా ఏళ్లుగా నందమూరి బాలకృష్ణతో కాకుండా వేరే హీరోలతో తీసే చిత్రాలతో బోయపాటి అంచనాలను అందుకోలేకపోతున్నాడు. తొలి చిత్రం ‘భద్ర’ను మినహాయిస్తే.. తులసి, దమ్ము, సరైనోడు, జయ జానకి నాయక, వినయ విధేయ రామ.. ఇలా దాదాపుగా అన్నీ అంచనాలను అందుకోని సినిమాలే. ‘వినయ విధేయ రామ’ రిజల్ట్ చూశాక ‘స్కందం’ మీద కూడా సందేహాలు నెలకొన్నాయి.
బోయపాటి మార్కు మైండ్ లెస్ మాస్.. ఓవర్ ఎలివేషన్లు బాలయ్యకు సెట్ అయినట్లు వేరే వాళ్లకు సెట్ కాదని.. ‘వినయ విధేయ రామ’ చూసినపుడే అర్థమైంది. అయినా సరే.. ఇప్పుడు రామ్తోనూ అలాంటి ప్రయత్నమే చేసినట్లున్నాడు బోయపాటి. ‘స్కంద’ ట్రైలర్లో కొన్ని షాట్లు.. సీన్లు.. డైలాగులు మరీ అతిగా అనిపించాయి. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలేంటి అనే కామెంట్లు పడ్డాయి. సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ కూడా జరిగింది.
దీన్ని దృష్టిలో ఉంచుకునే ‘స్కంద’కు యుఎస్ ప్రిమియర్లు క్యాన్సిల్ చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. యుఎస్ ఆడియన్స్కు ఈ తరహా మాస్ మూవీస్ రుచించవు. బోయపాటి శ్రీను సినిమాలకు ముందు నుంచి అక్కడ ఆదరణ తక్కువే. అందులోనూ నాన్ బాలయ్య సినిమాలకు మరీ కష్టం. ‘వినయ విధేయ రామ’లో బోయపాటి చూపించిన అతికి యుఎస్ ఆడియన్స్ బెంబేలెత్తిపోయారు.
ప్రిమియర్స్ నుంచి దారుణమైన రిపోర్ట్ వచ్చింది.రివ్యూలు కూడా బాగా డ్యామేజ్ చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షోలు పడే సమయానికే నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. సినిమా అనుకున్నదానికంటే పెద్ద డిజాస్టర్ అయింది. ‘స్కంద’ ట్రైలర్ చూడగానే ఈ సినిమాకు యుఎస్ ప్రిమియర్స్ వేస్తే ఎలాంటి టాక్, రివ్యూలు వస్తాయో అందరికీ అర్థమైపోయింది. ప్రిమియర్స్ ద్వారా వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అని ఫిక్సయి ఆ షోలు క్యాన్సిల్ చేయాలని డిసైడైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు యుఎస్లో సరైన బిజినెస్ కూడా జరగట్లేదని సమాచారం.
This post was last modified on September 1, 2023 10:16 pm
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…
కాంగ్రెస్ హైకమాండ్ ఎంత చెప్పినా తెలంగాణలోని ఆ పార్టీకి చెందిన కొంతమంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని తెలిసింది.…