ఈ ఏడాది అత్యంత భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన ఏజెంట్ ని అఖిల్ అభిమానులు ఇప్పట్లో మర్చిపోలేరు. దీన్ని స్ట్రీమింగ్ చేయడానికి ఓటిటి సంస్థనే ముందు వెనుకా ఆడుతోందంటే దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. నిర్మాత అనిల్ సుంకర పూర్తి స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ చేశామని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డి బయట ఎక్కడా కనిపించలేదు. మీడియా ముందుకొచ్చినా గత ఫలితం గురించిన ప్రశ్నలే ఉంటాయి కాబట్టి సైలెంట్ గా అజ్ఞాతంలో ఉంటూ వచ్చాడు. ఇప్పుడు దానికి సెలవు వచ్చేసింది.
ఇంతకు ముందే ఇచ్చిన కమిట్ మెంట్ కి కట్టుబడి పవన్ కళ్యాణ్ సినిమా సురేందర్ రెడ్డికే వచ్చింది. నిర్మాత రామ్ తాళ్ళూరి దీన్ని నిర్మించబోతున్నారు. అయితే రెండు రోజుల క్రితం ప్రచారం జరిగినట్టు ఇది విక్రమ్ వేదా రీమేక్ కాకపోవచ్చు. ఎందుకంటే ఇవాళ జరిపిన ఆఫీస్ పూజా కార్యక్రమాల్లో రచయిత వక్కంతం వంశీ వచ్చాడు కాబట్టి అతనిచ్చిన కథే తెరకెక్కొచ్చు. వీళ్ళ కాంబినేషన్ లో కిక్, రేసు గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ మంచి ర్యాపొ ఉంది. నిజానికీ ప్రాజెక్ట్ ఎప్పుడో అనౌన్స్ చేశారు కానీ ఫైనల్ గా ఇప్పుడు రూట్ క్లియరయ్యింది.
రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడానికి కొంత టైం పట్టొచ్చు. పవన్ కళ్యాణ్ ముందు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజిలు పూర్తి చేయాలి. ఆ తర్వాత హరిహర వీరమల్లుకి డేట్స్ ఇవ్వాలి. ఈ మూడు అయితే కానీ సూరి సెట్లో అడుగు పెట్టలేడు. సో ఇదంతా అవ్వడానికి అయిదారు నెలలు పట్టొచ్చు. ఎన్నికలు దగ్గరగా ఉన్న నేపథ్యంలో 2024 వేసవి కన్నా ముందు మొదలయ్యే ఛాన్స్ లేనట్టే. హీరోయిన్, ఇతర టెక్నికల్ టీమ్ కు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏజెంట్ గాయం మాన్పుకోవడానికి సురేందర్ రెడ్డికి ఇంతకన్నా గోల్డెన్ ఛాన్స్ దక్కదు. సరిగ్గా వాడుకుంటే అద్భుతమైన కంబ్యాక్ అవుతుంది
This post was last modified on September 1, 2023 9:56 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…