నిన్న సన్ పిక్చర్స్ అధినేత దయానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి చెక్ ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఎంత సొమ్ము ఉండొచ్చనే దాని మీద రకరకాల అంచనాలు వేసుకున్నారు కానీ పిక్ లో ఉన్నది సీల్డ్ కవర్ కావడంతో ఎవరూ ఖచ్చితంగా ఎంతనేది గెస్ చేయలేకపోయారు. అయితే అంతర్గతవర్గాల నుంచి వస్తున్న సమాచారం చూస్తే మాత్రం ఫిగర్ మతిపోయేలా ఉంది. చెక్కు మీద పేర్కొన్న మొత్తం అక్షరాలా వంద కోట్లని అంటున్నారు. పారితోషికం కాకుండా జైలర్ మీద లాభాల్లో వాటాగా దీన్ని అందించినట్టు తెలిసింది.
షూటింగ్ సమయంలో ఇచ్చిన రెమ్యునరేషన్ వంద కోట్లు కాకుండా ఇది అదనంగా ఇచ్చి ఉండొచ్చనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా ఉంది. ఇది నిజమైతే ఇంత లేట్ ఏజ్ లో అంత మొత్తం అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ గా రజని కాంత్ కొత్త రికార్డు సృష్టించినట్టే. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రజిని, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందబోయే భారీ చిత్రానికి అడ్వాన్స్ కూడా ఇందులోనే ఉండొచ్చనే టాక్ తిరుగుతోంది. చెక్కు మీద ఉన్న ఫిగర్ దయానిధి మారన్, రజని, ఆయన ఆడిటర్, బ్యాంక్ అధికారులకు తప్ప ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ లేదు.
అయినా సరే ఏదో ఒక లీకు రూపంలో తెలిసే ఛాన్స్ లేకపోలేదు. జైలర్ ఇండస్ట్రీ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్ త్వరలో కూతురు ఐశ్వర్య తీసిన లాల్ సలాంలో స్పెషల్ క్యామియో రూపంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, శర్వానంద్, ఫహద్ ఫాసిల్ కాంబోలో నటించబోయే మల్టీస్టారర్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్నే మొదలుపెట్టారట. తగినంత విశ్రాంతి దొరకడంతో రజని త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెడతారని తెలిసింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో ఇంకో రెండు ప్రాజెక్టులు సైన్ చేయబోతున్నారు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…