నిన్న సన్ పిక్చర్స్ అధినేత దయానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి చెక్ ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఎంత సొమ్ము ఉండొచ్చనే దాని మీద రకరకాల అంచనాలు వేసుకున్నారు కానీ పిక్ లో ఉన్నది సీల్డ్ కవర్ కావడంతో ఎవరూ ఖచ్చితంగా ఎంతనేది గెస్ చేయలేకపోయారు. అయితే అంతర్గతవర్గాల నుంచి వస్తున్న సమాచారం చూస్తే మాత్రం ఫిగర్ మతిపోయేలా ఉంది. చెక్కు మీద పేర్కొన్న మొత్తం అక్షరాలా వంద కోట్లని అంటున్నారు. పారితోషికం కాకుండా జైలర్ మీద లాభాల్లో వాటాగా దీన్ని అందించినట్టు తెలిసింది.
షూటింగ్ సమయంలో ఇచ్చిన రెమ్యునరేషన్ వంద కోట్లు కాకుండా ఇది అదనంగా ఇచ్చి ఉండొచ్చనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా ఉంది. ఇది నిజమైతే ఇంత లేట్ ఏజ్ లో అంత మొత్తం అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ గా రజని కాంత్ కొత్త రికార్డు సృష్టించినట్టే. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రజిని, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందబోయే భారీ చిత్రానికి అడ్వాన్స్ కూడా ఇందులోనే ఉండొచ్చనే టాక్ తిరుగుతోంది. చెక్కు మీద ఉన్న ఫిగర్ దయానిధి మారన్, రజని, ఆయన ఆడిటర్, బ్యాంక్ అధికారులకు తప్ప ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ లేదు.
అయినా సరే ఏదో ఒక లీకు రూపంలో తెలిసే ఛాన్స్ లేకపోలేదు. జైలర్ ఇండస్ట్రీ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్ త్వరలో కూతురు ఐశ్వర్య తీసిన లాల్ సలాంలో స్పెషల్ క్యామియో రూపంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, శర్వానంద్, ఫహద్ ఫాసిల్ కాంబోలో నటించబోయే మల్టీస్టారర్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్నే మొదలుపెట్టారట. తగినంత విశ్రాంతి దొరకడంతో రజని త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెడతారని తెలిసింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో ఇంకో రెండు ప్రాజెక్టులు సైన్ చేయబోతున్నారు.
This post was last modified on September 1, 2023 11:16 am
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…