నిన్న సన్ పిక్చర్స్ అధినేత దయానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కి చెక్ ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందులో ఎంత సొమ్ము ఉండొచ్చనే దాని మీద రకరకాల అంచనాలు వేసుకున్నారు కానీ పిక్ లో ఉన్నది సీల్డ్ కవర్ కావడంతో ఎవరూ ఖచ్చితంగా ఎంతనేది గెస్ చేయలేకపోయారు. అయితే అంతర్గతవర్గాల నుంచి వస్తున్న సమాచారం చూస్తే మాత్రం ఫిగర్ మతిపోయేలా ఉంది. చెక్కు మీద పేర్కొన్న మొత్తం అక్షరాలా వంద కోట్లని అంటున్నారు. పారితోషికం కాకుండా జైలర్ మీద లాభాల్లో వాటాగా దీన్ని అందించినట్టు తెలిసింది.
షూటింగ్ సమయంలో ఇచ్చిన రెమ్యునరేషన్ వంద కోట్లు కాకుండా ఇది అదనంగా ఇచ్చి ఉండొచ్చనే ప్రచారం చెన్నై వర్గాల్లో జోరుగా ఉంది. ఇది నిజమైతే ఇంత లేట్ ఏజ్ లో అంత మొత్తం అందుకున్న ఒకే ఒక్క ఇండియన్ స్టార్ గా రజని కాంత్ కొత్త రికార్డు సృష్టించినట్టే. మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. రజిని, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందబోయే భారీ చిత్రానికి అడ్వాన్స్ కూడా ఇందులోనే ఉండొచ్చనే టాక్ తిరుగుతోంది. చెక్కు మీద ఉన్న ఫిగర్ దయానిధి మారన్, రజని, ఆయన ఆడిటర్, బ్యాంక్ అధికారులకు తప్ప ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ లేదు.
అయినా సరే ఏదో ఒక లీకు రూపంలో తెలిసే ఛాన్స్ లేకపోలేదు. జైలర్ ఇండస్ట్రీ హిట్ ని ఎంజాయ్ చేస్తున్న రజనీకాంత్ త్వరలో కూతురు ఐశ్వర్య తీసిన లాల్ సలాంలో స్పెషల్ క్యామియో రూపంలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టిజె జ్ఞానవేల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, శర్వానంద్, ఫహద్ ఫాసిల్ కాంబోలో నటించబోయే మల్టీస్టారర్ కు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిన్నే మొదలుపెట్టారట. తగినంత విశ్రాంతి దొరకడంతో రజని త్వరలోనే సెట్స్ లోకి అడుగు పెడతారని తెలిసింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో ఇంకో రెండు ప్రాజెక్టులు సైన్ చేయబోతున్నారు.
This post was last modified on September 1, 2023 11:16 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…