టాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో గోపీచంద్ ఒకడు. తన సినిమాల రిలీజ్ టైంలో తప్ప అతను బయటెక్కడా కనిపించడు. ఇప్పటిదాకా ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా వివాదాస్పదంగా మాట్లాడింది లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా గోపీకి చాలా మంచి పేరుంది. అతడికి సంబంధించి ఏ కాంట్రవర్శీ లేదు. అలాంటి హీరో మీద దర్శకుడు రవికుమార్ చౌదరి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. గోపీ పేరెత్తలేదు కానీ.. అతణ్ని ఉద్దేశించే రవికుమార్ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టం. రవికుమార్ డైరెక్ట్ చేసిన యజ్ఞం మూవీతోనే గోపీచంద్ హీరోగా నిలదొక్కుకున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన మరో చిత్రం సౌఖ్యం డిజాస్టర్ అయింది. ఐతే యజ్ఞం సక్సెస్ తర్వాత గోపీ తనను పట్టించుకోలేదన్నట్లుగా రవికుమార్ మాట్లాడాడు.
ఒక రోజు ఆ హీరో కోసం వెళ్తే కొంతసేపు వెయిట్ చేయమను అన్నాడు. ఒరేయ్ అంత బలిసిందా రా మీకు? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారు మందిని దాటుకుని రావాలా? విలన్గా నటించేవాడిని హీరోగా నేనే చేశాను. నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. తర్వాతి సినిమాకు వాడి పారితోషికం కన్నా నాదే ఎక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.
వాడు ఇప్పుడు ఎదురుపడినా నేను ఇలాగే మాట్లాడతా. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు ఈ రోజు పూర్తిగా మారిపోయాడు. రారాజు’ సినిమా షూటింగ్ కోఠిలో జరుగుతుంటే వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా తీసి ఫ్లాప్లో ఉన్నాను. అప్పుడు మనిద్దరం కలిసి ఇంకో సినిమా చేద్దాం అంటే నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఆ సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నారు. నా దగ్గర ఆధారాలున్నాయి.
ఒక సినిమా హిట్ కాగానే అంత బలిసిపోయిందా? అంత ఈగో ఏంటి నీకు? చిరంజీవి, బాలకృష్ణ పవన్కల్యాణ్ కంటే గొప్పోడివా? నువ్వు. జీవితంలో వాళ్లు ఎన్నో రకాల సినిమాలు చేశారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మరి నువ్వేంటి అని రవికుమార్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం రవికుమార్ తిరగబడరా స్వామి అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో హీరోయిన్ మన్నారా చోప్రాను స్టేజ్ మీద రవికుమార్ ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
This post was last modified on September 1, 2023 11:14 am
తెలుగులో పెద్ద స్టార్ల సినిమాలను పక్కన పెడితే.. ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేలా చేసే…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై దాదాపు 500 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో విలాసవంతంగా నిర్మించిన ప్యాలెస్ను ఏం చేయాలన్న…
కేరళం ఎన్నికల సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీనియర్…
అన్ని రసాల్లోకి హాస్య రసం పండించడం చాలా కష్టమంటారు. అందులో అతిశయోక్తి ఏమీ కాదు. నవ్వించడం అన్నది అత్యంత కష్టమైన…
ఒకప్పుడు ఒక పెద్ద సినిమాకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే.. చివరి దాకా దానికి కట్టుబడే ఉండేవారు. చెప్పిన డేటుకే…
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…