టాలీవుడ్లో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో గోపీచంద్ ఒకడు. తన సినిమాల రిలీజ్ టైంలో తప్ప అతను బయటెక్కడా కనిపించడు. ఇప్పటిదాకా ఎన్నడూ కూడా ఒక్క మాట కూడా వివాదాస్పదంగా మాట్లాడింది లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో కూడా గోపీకి చాలా మంచి పేరుంది. అతడికి సంబంధించి ఏ కాంట్రవర్శీ లేదు. అలాంటి హీరో మీద దర్శకుడు రవికుమార్ చౌదరి తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేయడం చర్చనీయాంశమవుతోంది. గోపీ పేరెత్తలేదు కానీ.. అతణ్ని ఉద్దేశించే రవికుమార్ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టం. రవికుమార్ డైరెక్ట్ చేసిన యజ్ఞం మూవీతోనే గోపీచంద్ హీరోగా నిలదొక్కుకున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన మరో చిత్రం సౌఖ్యం డిజాస్టర్ అయింది. ఐతే యజ్ఞం సక్సెస్ తర్వాత గోపీ తనను పట్టించుకోలేదన్నట్లుగా రవికుమార్ మాట్లాడాడు.
ఒక రోజు ఆ హీరో కోసం వెళ్తే కొంతసేపు వెయిట్ చేయమను అన్నాడు. ఒరేయ్ అంత బలిసిందా రా మీకు? గతంలో నా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వచ్చావ్.. ఇప్పుడు నీ దగ్గరకు నేను రావాలంటే ఐయిదారు మందిని దాటుకుని రావాలా? విలన్గా నటించేవాడిని హీరోగా నేనే చేశాను. నా సినిమాతో వాడు హీరోగా గుర్తింపు పొందాడు. తర్వాతి సినిమాకు వాడి పారితోషికం కన్నా నాదే ఎక్కువ. అలాంటప్పుడు ఆ బలుపు ఎందుకో అర్థం కాదు.
వాడు ఇప్పుడు ఎదురుపడినా నేను ఇలాగే మాట్లాడతా. ఒకప్పుడు నా సినిమాతో హీరోగా ఎదిగినవాడు ఈ రోజు పూర్తిగా మారిపోయాడు. రారాజు’ సినిమా షూటింగ్ కోఠిలో జరుగుతుంటే వెళ్లాను. అప్పటికే నేను బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా తీసి ఫ్లాప్లో ఉన్నాను. అప్పుడు మనిద్దరం కలిసి ఇంకో సినిమా చేద్దాం అంటే నన్ను దూరం పెట్టాడు. మంచి కథ చేసి రండి చూద్దాం అని అవమానించాడు. ఆ సమయంలో ఫైట్ మాస్టర్ విజయ్ కూడా అక్కడే ఉన్నారు. నా దగ్గర ఆధారాలున్నాయి.
ఒక సినిమా హిట్ కాగానే అంత బలిసిపోయిందా? అంత ఈగో ఏంటి నీకు? చిరంజీవి, బాలకృష్ణ పవన్కల్యాణ్ కంటే గొప్పోడివా? నువ్వు. జీవితంలో వాళ్లు ఎన్నో రకాల సినిమాలు చేశారు. సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. మరి నువ్వేంటి అని రవికుమార్ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం రవికుమార్ తిరగబడరా స్వామి అనే సినిమా తీశాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో హీరోయిన్ మన్నారా చోప్రాను స్టేజ్ మీద రవికుమార్ ముద్దు పెట్టుకోవడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
This post was last modified on September 1, 2023 11:14 am
దాదాపు 55 రోజుల పాటు అవిశ్రాంతంగా పార్లమెంటు ఎన్నికల ప్రచారం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పీసీసీచీఫ్ ఎనుముల రేవంత్…
జనసేనాని పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేయడానికి వైసీపీ నేతలు ఎంచుకునే అంశం.. ఆయన పెళ్లిళ్ల వ్యవహారం. కార్లను మార్చినట్లు భార్యలను…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొక్క రోజే సమయం ఉండగా.. ఈ టైంలో ప్రముఖ రాజకీయ నాయకులతో సమానంగా సినీ హీరో…
టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్.. ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారు అన్న సంగతి తెలిసిందే. ఆయన…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది పలు పొలిటికల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా యాత్ర-2,వ్యూహం,…
140 కోట్ల ప్రజలున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం అంటే కత్తి మీద…