రెండేళ్లకో సినిమాతో వస్తున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇకపై పెద్ద గ్యాప్ లేకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన అప్ కమింగ్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కి ముందే ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాను మొదలు పెట్టాడు. టైటిల్ టీజర్ తో ఈ సినిమాపై మంచి బజ్ తెచ్చాడు నవీన్. అయితే షూటింగ్ కొంత జరుపుకున్న ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో హీరో సంతోషంగా లేడని, అందుకే దర్శకుడు మారాడని తెలుస్తుంది.
ముందు ఈ సినిమాకి దర్శకుడు కళ్యాణ్ శంకర్. కానీ ఇప్పుడు అతని చేతిలో ఈ ప్రాజెక్ట్ లేదని సమాచారం. సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలోనే ఈ దర్శకుడు ‘మ్యాడ్’ అంటూ మరో యూత్ ఫుల్ సినిమా తీశాడు. ఆ సినిమా ఆగిపోయినందుకే నిర్మాత నాగ వంశీ అతనితో ఈ సినిమా నిర్మించారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందనే వార్తకి మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఉందని మరో దర్శకుడి చేతిలో పెట్టేందుకు హీరో గట్టిగాట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మరి కథ , కథనం పరంగా మొదటి దర్శకుడికి క్రెడిట్ ఇస్తారా ? లేదా చూడాలి. ఏదేమైనా నవీన్ పోలిశెట్టి స్పీడుకి ఈ సినిమా మళ్ళీ గ్యాప్ ఇచ్చేలా ఉంది. దర్శకుడు సెట్ అవ్వాలి. మళ్ళీ రీ వర్క్ చేసుకోవాలి చాలా తతంగం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేయబోయే దర్శకుడిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on September 1, 2023 12:51 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…