రెండేళ్లకో సినిమాతో వస్తున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇకపై పెద్ద గ్యాప్ లేకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన అప్ కమింగ్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కి ముందే ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాను మొదలు పెట్టాడు. టైటిల్ టీజర్ తో ఈ సినిమాపై మంచి బజ్ తెచ్చాడు నవీన్. అయితే షూటింగ్ కొంత జరుపుకున్న ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో హీరో సంతోషంగా లేడని, అందుకే దర్శకుడు మారాడని తెలుస్తుంది.
ముందు ఈ సినిమాకి దర్శకుడు కళ్యాణ్ శంకర్. కానీ ఇప్పుడు అతని చేతిలో ఈ ప్రాజెక్ట్ లేదని సమాచారం. సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలోనే ఈ దర్శకుడు ‘మ్యాడ్’ అంటూ మరో యూత్ ఫుల్ సినిమా తీశాడు. ఆ సినిమా ఆగిపోయినందుకే నిర్మాత నాగ వంశీ అతనితో ఈ సినిమా నిర్మించారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందనే వార్తకి మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఉందని మరో దర్శకుడి చేతిలో పెట్టేందుకు హీరో గట్టిగాట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మరి కథ , కథనం పరంగా మొదటి దర్శకుడికి క్రెడిట్ ఇస్తారా ? లేదా చూడాలి. ఏదేమైనా నవీన్ పోలిశెట్టి స్పీడుకి ఈ సినిమా మళ్ళీ గ్యాప్ ఇచ్చేలా ఉంది. దర్శకుడు సెట్ అవ్వాలి. మళ్ళీ రీ వర్క్ చేసుకోవాలి చాలా తతంగం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేయబోయే దర్శకుడిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on September 1, 2023 12:51 am
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…