రెండేళ్లకో సినిమాతో వస్తున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇకపై పెద్ద గ్యాప్ లేకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన అప్ కమింగ్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కి ముందే ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాను మొదలు పెట్టాడు. టైటిల్ టీజర్ తో ఈ సినిమాపై మంచి బజ్ తెచ్చాడు నవీన్. అయితే షూటింగ్ కొంత జరుపుకున్న ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో హీరో సంతోషంగా లేడని, అందుకే దర్శకుడు మారాడని తెలుస్తుంది.
ముందు ఈ సినిమాకి దర్శకుడు కళ్యాణ్ శంకర్. కానీ ఇప్పుడు అతని చేతిలో ఈ ప్రాజెక్ట్ లేదని సమాచారం. సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలోనే ఈ దర్శకుడు ‘మ్యాడ్’ అంటూ మరో యూత్ ఫుల్ సినిమా తీశాడు. ఆ సినిమా ఆగిపోయినందుకే నిర్మాత నాగ వంశీ అతనితో ఈ సినిమా నిర్మించారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందనే వార్తకి మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఉందని మరో దర్శకుడి చేతిలో పెట్టేందుకు హీరో గట్టిగాట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మరి కథ , కథనం పరంగా మొదటి దర్శకుడికి క్రెడిట్ ఇస్తారా ? లేదా చూడాలి. ఏదేమైనా నవీన్ పోలిశెట్టి స్పీడుకి ఈ సినిమా మళ్ళీ గ్యాప్ ఇచ్చేలా ఉంది. దర్శకుడు సెట్ అవ్వాలి. మళ్ళీ రీ వర్క్ చేసుకోవాలి చాలా తతంగం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేయబోయే దర్శకుడిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…