రెండేళ్లకో సినిమాతో వస్తున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇకపై పెద్ద గ్యాప్ లేకుండా చూసుకోవాలని భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే తన అప్ కమింగ్ మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రిలీజ్ కి ముందే ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాను మొదలు పెట్టాడు. టైటిల్ టీజర్ తో ఈ సినిమాపై మంచి బజ్ తెచ్చాడు నవీన్. అయితే షూటింగ్ కొంత జరుపుకున్న ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో హీరో సంతోషంగా లేడని, అందుకే దర్శకుడు మారాడని తెలుస్తుంది.
ముందు ఈ సినిమాకి దర్శకుడు కళ్యాణ్ శంకర్. కానీ ఇప్పుడు అతని చేతిలో ఈ ప్రాజెక్ట్ లేదని సమాచారం. సితార ఎంటర్టైన్ మెంట్స్ సంస్థలోనే ఈ దర్శకుడు ‘మ్యాడ్’ అంటూ మరో యూత్ ఫుల్ సినిమా తీశాడు. ఆ సినిమా ఆగిపోయినందుకే నిర్మాత నాగ వంశీ అతనితో ఈ సినిమా నిర్మించారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయిందనే వార్తకి మేకర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు, కానీ ప్రాజెక్ట్ మాత్రం ఉందని మరో దర్శకుడి చేతిలో పెట్టేందుకు హీరో గట్టిగాట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. మరి కథ , కథనం పరంగా మొదటి దర్శకుడికి క్రెడిట్ ఇస్తారా ? లేదా చూడాలి. ఏదేమైనా నవీన్ పోలిశెట్టి స్పీడుకి ఈ సినిమా మళ్ళీ గ్యాప్ ఇచ్చేలా ఉంది. దర్శకుడు సెట్ అవ్వాలి. మళ్ళీ రీ వర్క్ చేసుకోవాలి చాలా తతంగం ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను డీల్ చేయబోయే దర్శకుడిని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు.
This post was last modified on September 1, 2023 12:51 am
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…