కొన్నేళ్ళ క్రితం శ్రీను వైట్ల తన మార్క్ కామెడీ తో కమర్షియల్ మూవీస్ తీసి వరుస హిట్లు కొట్టాడు. ఇప్పటికీ శ్రీను వైట్ల కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ వీడియోస్ , మీమ్స్ లో కనిపిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం శ్రీను వైట్ల కి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన ప్రీవీయస్ మూవీస్ పెద్దగా ఆడలేదు. వరుస ఫ్లాప్స్ , పైగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా డిజాస్టర్ శ్రీను వైట్లను కుదేలు చేసేసింది. ఈ నేపథ్యంలో విష్ణు మంచుతో ‘డీ’ కి సీక్వెల్ ప్లాన్ చేసుకున్న శ్రీను వైట్ల కి ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం మరింత నిరాశ పరిచింది.
తాజాగా గోపీచంద్ కి ఒక కథ చెప్పి ప్రాజెక్ట్ లాక్ చేసుకున్నాడు వైట్ల. ఈ సినిమా లొకేషన్ స్కవుటింగ్ కోసం శ్రీను వైట్ల టీంతో వెళ్లారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇటలీలో జరగనుంది. దీని కోసం శ్రీను వైట్ల ది బెస్ట్ లొకేషన్స్ చూసుకొని వచ్చాడు. ఈ నెల 9న ఈ కాంబో సినిమా హైదరాబాద్ లో లాంచ్ కానుంది. ఇరవై తర్వాత ఇటలీలో రెగ్యులర్ ఘాట్ మొదలవుతుంది.
అక్కడ మేజర్ సీన్స్ , యాక్షన్ తీసుకొని వచ్చాక హైదరాబాద్లో నెక్స్ట్ షెడ్యూల్ ఉండబోతుంది. ప్రస్తుతం గోపీచంద్ కూడా హిట్ ట్రాక్ లో లేడు. తాజాగా ‘రామబాణం’ ప్రేక్షకులను బాగా నిరాశ పరిచి డిజాస్టర్ అనిపించుకుంది. మరి ఇటు శ్రీను వైట్ల కి అటు గోపీచంద్ కి ఈ సినిమా సక్సెస్ చాలా అవసరమనే చెప్పాలి. మరి వైట్ల మునుపటిలా మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసి సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…