సక్సెస్ రేట్, కలెక్షన్ల రేంజ్ పరంగా చూస్తే టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకడు. కానీ ఆయనకు మొదట్నుంచి యుఎస్లో పెద్దగా మార్కెట్ లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ లాంటి అగ్ర దర్శకుల సినిమాలు అంటే.. హీరో ఎవరన్నది పట్టించుకోకుండా మినిమం 2 మిలియన్ డాలర్ల రేటు ఇచ్చేస్తారు. కానీ బోయపాటి తీసే ఊర మాస్ సినిమాలకు అక్కడ పెద్దగా డిమాండ్ ఉండదు. మిలియన్ డాలర్ల రేటు పలకడం కూడా కష్టమే.
నందమూరి బాలకృష్ణతో బోయపాటి తీసిన సినిమాలన్నీ బ్లాక్బస్టర్లే అయినప్పటికీ.. వాటికి కూడా ఓవర్సీస్లో పెద్దగా డిమాండ్ కనిపించలేదు. ‘అఖండ’ ఓవర్సీస్లో కూడా బాగా ఆడినా సరే.. బోయపాటి కొత్త చిత్రం ‘స్కంద’కు మాత్రం అక్కడ క్రేజ్ రాలేదు. అందులోనూ ఈ మధ్యే రిలీజైన ట్రైలర్ చూశాక ఈ సినిమాపై యుఎస్ ఆడియన్స్ పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి మైండ్ లెస్ మాస్ వాళ్లకు రుచించదు. ‘స్కంద’కు గతంలో మంచి రేటే వచ్చినా.. నిర్మాత ఇంత కావాలి అని పట్టుబట్టి ఆ రేటు కోసమే ఎదురు చూశాడట.
కానీ ఇంతకుముందు బయ్యర్లు ఆఫర్ చేసిన రేటు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదట. రిలీజ్ దగ్గర పడుతుండగా.. సినిమాకు ఓవర్సీస్లో బిజినెస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రేటుకు సినిమాను అమ్మిన నిర్మాత.. ఓవర్సీస్ రైట్స్ అమ్మడం కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సినిమాలకు ఓవర్సీస్లో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో ఉండవు. ఓపెనింగ్స్ మీద ఆధారపడే సినిమాను కొనే బయ్యర్లు ఈ సినిమా మీద నిర్మాతలు అడిగినంత రేటు పెట్టడం చాలా రిస్క్ అని వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 31, 2023 11:09 am
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…