తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ‘ఇంద్ర’ ఒకటి. 2002 సమయానికి తెలుగు సినిమాల్లో రూ.20 కోట్ల షేర్ మార్కు కూడా ఏ సినిమా అందుకోలేదు. అలాంటిది ఆ చిత్రం ఆ రోజుల్లోనే ‘ఇంద్ర’ రూ.28 కోట్ల దాకా షేర్ సాధించి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. అప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. చిరంజీవితో అప్పటికే ‘జగదేకవీరుడు’, ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్బస్టర్లు తీసిన సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఈ చిత్రంతో మరింత పెద్ద విజయాన్నందుకున్నారు.
ఊహించని స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లో రేపిన సంచలనం గురించి.. దాని క్రేజ్ గురించి తాజాగా అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇంద్ర’ సినిమా థియేటర్ల దగ్గర జన సందోహం చూసి కంగారు పడ్డ పోలీసు ఉన్నతాధికారులు.. చిరంజీవికి నేరుగా ఫోన్ చేసి అభిమానులను కొంచెం కంట్రోల్ చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
‘‘చిరంజీవితో నేను ప్రొడ్యూస్ చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత పెద్ద రేంజికి వెళ్లి 25 వారాల పాటు ఆడింది. ఆ తర్వాత మా కలయికలో వచ్చిన ‘చూడాలని ఉంది’ కూడా బాగా ఆడింది. ఐతే ‘ఇంద్ర’ పరిస్థితి వేరు. నెమ్మదిగా పుంజుకోవడం లాంటిదేమీ లేదు. తొలి రోజు ఉదయం నుంచే అది పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ఆ సినిమా థియేటర్ల దగ్గర జనం, చిరంజీవి గారి అభిమానులు ఏ స్థాయిలో ఉండేవారంటే చాలామంది పోలీస్ కమిషనర్లు భయపడి నేరుగా చిరంజీవి గారికి ఫోన్ చేశారు.
ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది.. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని.. టికెట్ల కోసం గొడవలు జరుగుతాయని.. కాబట్టి అభిమానులు కొంచెం కుదురుగా ఉండాలని. పోలీసులకు సహకరించాలని.. వారిని మీరే ఒక మాట చెప్పి కంట్రోల్ చేయాలని చెప్పారు. ముందుగా విజయవాడ కమిషనర్ చిరంజీవి గారికి ఫోన్ చేశారు’’ అని అప్పటి యుఫోరియాను గుర్తు చేసుకున్నారు అశ్వినీదత్.
రెండు వారాల క్రితం రణ్వీర్ సింగ్ ని మూడేళ్ళ పాటు బ్యాన్ చేస్తున్నట్టు ఫెడరేషన్ అఫ్ వెస్ట్రన్ సినీ ఎంప్లొయీస్…
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం…
అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీరోయిన్ శ్రీదేవి. కాలం చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఆవిడ వేసిన…
అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని సందర్శించిన అనంతరం జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక…
పవన్ వ్యాఖ్యలపై అందరూ మాట్లాడేశారు.. ఇక మిగిలింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంతే! రెండు రోజుల నుంచి తెలుగు…
టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో సిటీ హాల్ బయట ఒక అమెరికన్ భారత జాతీయ జెండాను చించివేయడం ఇప్పుడు తీవ్ర దుమారం…