తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ‘ఇంద్ర’ ఒకటి. 2002 సమయానికి తెలుగు సినిమాల్లో రూ.20 కోట్ల షేర్ మార్కు కూడా ఏ సినిమా అందుకోలేదు. అలాంటిది ఆ చిత్రం ఆ రోజుల్లోనే ‘ఇంద్ర’ రూ.28 కోట్ల దాకా షేర్ సాధించి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. అప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. చిరంజీవితో అప్పటికే ‘జగదేకవీరుడు’, ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్బస్టర్లు తీసిన సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఈ చిత్రంతో మరింత పెద్ద విజయాన్నందుకున్నారు.
ఊహించని స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లో రేపిన సంచలనం గురించి.. దాని క్రేజ్ గురించి తాజాగా అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇంద్ర’ సినిమా థియేటర్ల దగ్గర జన సందోహం చూసి కంగారు పడ్డ పోలీసు ఉన్నతాధికారులు.. చిరంజీవికి నేరుగా ఫోన్ చేసి అభిమానులను కొంచెం కంట్రోల్ చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
‘‘చిరంజీవితో నేను ప్రొడ్యూస్ చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత పెద్ద రేంజికి వెళ్లి 25 వారాల పాటు ఆడింది. ఆ తర్వాత మా కలయికలో వచ్చిన ‘చూడాలని ఉంది’ కూడా బాగా ఆడింది. ఐతే ‘ఇంద్ర’ పరిస్థితి వేరు. నెమ్మదిగా పుంజుకోవడం లాంటిదేమీ లేదు. తొలి రోజు ఉదయం నుంచే అది పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ఆ సినిమా థియేటర్ల దగ్గర జనం, చిరంజీవి గారి అభిమానులు ఏ స్థాయిలో ఉండేవారంటే చాలామంది పోలీస్ కమిషనర్లు భయపడి నేరుగా చిరంజీవి గారికి ఫోన్ చేశారు.
ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది.. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని.. టికెట్ల కోసం గొడవలు జరుగుతాయని.. కాబట్టి అభిమానులు కొంచెం కుదురుగా ఉండాలని. పోలీసులకు సహకరించాలని.. వారిని మీరే ఒక మాట చెప్పి కంట్రోల్ చేయాలని చెప్పారు. ముందుగా విజయవాడ కమిషనర్ చిరంజీవి గారికి ఫోన్ చేశారు’’ అని అప్పటి యుఫోరియాను గుర్తు చేసుకున్నారు అశ్వినీదత్.
This post was last modified on August 31, 2023 10:37 am
అయేషా మీరా. ఉమ్మడి ఏపీలో 2007లో ఓ వ్యక్తి కామ దాహానికి బలి అయిపోయిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ కేసులో…
గత వారం విడుదలైన సినిమాల్లో మంచి టాక్, రివ్యూస్ తెచ్చుకుంది కపుల్ ఫ్రెండ్లీకి ఒకటే. అయితే ఆశించిన పెద్ద మొత్తంలో…
గత నలభై ఏడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సిల్వర్ స్క్రీన్ కాంబినేషన్ ఎట్టకేలకు ప్రారంభం కాబోతోంది. రజనీకాంత్, కమల్ హాసన్…
అంతా నా ఇష్టం…అంతా నా ఇష్టం…ఎడాపెడా ఏది చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం అంటూ కౌరవుడు సినిమాలో నాగబాబు మాదిరిగా…
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…