తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ‘ఇంద్ర’ ఒకటి. 2002 సమయానికి తెలుగు సినిమాల్లో రూ.20 కోట్ల షేర్ మార్కు కూడా ఏ సినిమా అందుకోలేదు. అలాంటిది ఆ చిత్రం ఆ రోజుల్లోనే ‘ఇంద్ర’ రూ.28 కోట్ల దాకా షేర్ సాధించి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. అప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. చిరంజీవితో అప్పటికే ‘జగదేకవీరుడు’, ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్బస్టర్లు తీసిన సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఈ చిత్రంతో మరింత పెద్ద విజయాన్నందుకున్నారు.
ఊహించని స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లో రేపిన సంచలనం గురించి.. దాని క్రేజ్ గురించి తాజాగా అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇంద్ర’ సినిమా థియేటర్ల దగ్గర జన సందోహం చూసి కంగారు పడ్డ పోలీసు ఉన్నతాధికారులు.. చిరంజీవికి నేరుగా ఫోన్ చేసి అభిమానులను కొంచెం కంట్రోల్ చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
‘‘చిరంజీవితో నేను ప్రొడ్యూస్ చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత పెద్ద రేంజికి వెళ్లి 25 వారాల పాటు ఆడింది. ఆ తర్వాత మా కలయికలో వచ్చిన ‘చూడాలని ఉంది’ కూడా బాగా ఆడింది. ఐతే ‘ఇంద్ర’ పరిస్థితి వేరు. నెమ్మదిగా పుంజుకోవడం లాంటిదేమీ లేదు. తొలి రోజు ఉదయం నుంచే అది పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ఆ సినిమా థియేటర్ల దగ్గర జనం, చిరంజీవి గారి అభిమానులు ఏ స్థాయిలో ఉండేవారంటే చాలామంది పోలీస్ కమిషనర్లు భయపడి నేరుగా చిరంజీవి గారికి ఫోన్ చేశారు.
ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది.. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని.. టికెట్ల కోసం గొడవలు జరుగుతాయని.. కాబట్టి అభిమానులు కొంచెం కుదురుగా ఉండాలని. పోలీసులకు సహకరించాలని.. వారిని మీరే ఒక మాట చెప్పి కంట్రోల్ చేయాలని చెప్పారు. ముందుగా విజయవాడ కమిషనర్ చిరంజీవి గారికి ఫోన్ చేశారు’’ అని అప్పటి యుఫోరియాను గుర్తు చేసుకున్నారు అశ్వినీదత్.
This post was last modified on August 31, 2023 10:37 am
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…