తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద హిట్లలో ‘ఇంద్ర’ ఒకటి. 2002 సమయానికి తెలుగు సినిమాల్లో రూ.20 కోట్ల షేర్ మార్కు కూడా ఏ సినిమా అందుకోలేదు. అలాంటిది ఆ చిత్రం ఆ రోజుల్లోనే ‘ఇంద్ర’ రూ.28 కోట్ల దాకా షేర్ సాధించి ట్రేడ్ పండిట్లను ఆశ్చర్యపరిచింది. అప్పటిదాకా ఉన్న అన్ని రికార్డులనూ ఈ చిత్రం బద్దలు కొట్టేసింది. చిరంజీవితో అప్పటికే ‘జగదేకవీరుడు’, ‘చూడాలని ఉంది’ లాంటి బ్లాక్బస్టర్లు తీసిన సీనియర్ నిర్మాత అశ్వినీదత్.. ఈ చిత్రంతో మరింత పెద్ద విజయాన్నందుకున్నారు.
ఊహించని స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లో రేపిన సంచలనం గురించి.. దాని క్రేజ్ గురించి తాజాగా అశ్వినీదత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఇంద్ర’ సినిమా థియేటర్ల దగ్గర జన సందోహం చూసి కంగారు పడ్డ పోలీసు ఉన్నతాధికారులు.. చిరంజీవికి నేరుగా ఫోన్ చేసి అభిమానులను కొంచెం కంట్రోల్ చేయాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.
‘‘చిరంజీవితో నేను ప్రొడ్యూస్ చేసిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ నెమ్మదిగా మొదలై.. ఆ తర్వాత పెద్ద రేంజికి వెళ్లి 25 వారాల పాటు ఆడింది. ఆ తర్వాత మా కలయికలో వచ్చిన ‘చూడాలని ఉంది’ కూడా బాగా ఆడింది. ఐతే ‘ఇంద్ర’ పరిస్థితి వేరు. నెమ్మదిగా పుంజుకోవడం లాంటిదేమీ లేదు. తొలి రోజు ఉదయం నుంచే అది పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ఆ సినిమా థియేటర్ల దగ్గర జనం, చిరంజీవి గారి అభిమానులు ఏ స్థాయిలో ఉండేవారంటే చాలామంది పోలీస్ కమిషనర్లు భయపడి నేరుగా చిరంజీవి గారికి ఫోన్ చేశారు.
ఈ సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్తుంది.. అభిమానులను కంట్రోల్ చేయడం కష్టమని.. టికెట్ల కోసం గొడవలు జరుగుతాయని.. కాబట్టి అభిమానులు కొంచెం కుదురుగా ఉండాలని. పోలీసులకు సహకరించాలని.. వారిని మీరే ఒక మాట చెప్పి కంట్రోల్ చేయాలని చెప్పారు. ముందుగా విజయవాడ కమిషనర్ చిరంజీవి గారికి ఫోన్ చేశారు’’ అని అప్పటి యుఫోరియాను గుర్తు చేసుకున్నారు అశ్వినీదత్.
This post was last modified on August 31, 2023 10:37 am
మార్చి ముగిసిపోయింది. వేసవికి ముందొచ్చే నెలగా బాక్సాఫీస్ దీన్ని కీలకంగా పరిగణిస్తుంది. ముఖ్యంగా పిల్లల పరీక్షలు అయిపోయి సెలవులు ప్రారంభమవుతాయి…
ఆంధ్రుల హక్కుగా సంక్రమించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంటూ సాగుతున్న ప్రచారం ఇక దుష్ప్రచారం కిందే పరిగణించక తప్పదు. ఇకపై ఈ…
మురుగదాస్.. ఒకప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడు. రమణ, గజిని, గజిని (హిందీ), తుపాకి, కత్తి లాంటి బ్లాక్…
అయిదారు నెలల క్రితం చిన్నగా మొదలై ఇప్పుడు శరీరమంతా పాకిన వ్యాధిగా మారిపోయిన హెచ్డి పైరసీ సికందర్ తో పతాక…
విద్యాబాలన్.. బాలీవుడ్లో మంచి స్థాయి ఉన్న కథానాయిక. ఆమె కథానాయికగా మంచి ఫాంలో ఉన్న టైంలో తెలుగులో నటింపజేయడానికి ప్రయత్నాలు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ ఏడాది సెప్టెంబరు 17తో 75 ఏళ్లు వస్తాయి. ప్రస్తుతం ఆయన వయసు 74…