గత ఏడాది డీజే టిల్లు రూపంలో కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆశలన్నీ టిల్లు స్క్వేర్ మీదే ఉన్నాయి. దర్శకుడు, హీరోయిన్ మారాల్సి వచ్చినా సరే తగ్గేదేలే అనుకుంటూ తాను అనుకున్నదే చేస్తున్నాడు. స్క్రిప్ట్ పనులు, షూటింగు కలిపి ఇప్పటికే ఏడాదికి పైగా సమయం గడిచిపోయింది. అక్టోబర్ రిలీజ్ అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా వచ్చేది లేనిది యూనిట్ కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతోంది. ఇటీవలే వచ్చిన ఫస్ట్ లిరికల్ పాట జనంలోకి బాగానే వెళ్ళింది కానీ మొదటి భాగం టైటిల్ సాంగ్ తెచ్చినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయిన మాట వాస్తవం.
ఇక అసలు విషయానికి వస్తే టిల్లు స్క్వేర్ ఇప్పటిదాకా జరిగిన చిత్రీకరణకు సంబంధించిన ఫుటేజ్ పట్ల సిద్దు పూర్తి సంతృప్తిగా లేడట. కొంత భాగం రీ షూట్ చేయాల్సి రావొచ్చని దర్శకుడు మల్లిక్ రామ్ తో అన్నట్టుగా వచ్చిన లీక్ కొత్త చర్చకు దారి తీస్తోంది. ఆల్రెడీ సితార సంస్థ దీని మీద పెద్ద బడ్జెట్ పెడుతోంది. కంటెంట్ మీద నమ్మకం, యూత్ లో టిల్లు బ్రాండ్ కున్న ఫాలోయింగ్ ని ఆధారంగా చేసుకుని అనుపమ పరమేశ్వరన్ ని ఎక్కువ పారితోషికం ఇచ్చి మరీ తెచ్చుకున్నారు. తీరా చూస్తే ఇప్పుడీ స్టేజిలో మార్పులు చేర్పులు అంటే మళ్ళీ కొత్త భారం పడుతుంది.
ఇది నిజమో కాదో నిర్ధారణ లేకపోయినా ప్రస్తుతానికి బ్రేక్ పడిన మాట వాస్తవమేనని ఇన్ సైడ్ టాక్. సిద్దు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడేందుకు సిద్ధంగా లేడు. ఒకవేళ రిస్క్ అనిపిస్తే ప్రాజెక్టులు పెండింగ్ పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదు. నందిని రెడ్డితో చేయాల్సిన సినిమాని హోల్డ్ లో ఉంచేసి బొమ్మరిల్లు భాస్కర్ తో ఇటీవలే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. టిల్లు ద్వారా ఏర్పడ్డ మార్కెట్ ని కాపాడుకోవడానికి సిద్దులో హీరో కం రచయిత మధ్య పెద్ద సంఘర్షణ జరుగుతోంది. అందుకే డైరెక్టర్లు సైతం గట్టిగా చెప్పలేని సిచువేషన్ ఉందని అంతర్గతంగా వినిపిస్తున్న మాట.
This post was last modified on August 30, 2023 7:44 pm
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలకు వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో…
ఎన్నికల అంకం ముగింపుకొస్తున్న తరుణంలో అందరి దృష్టి క్రమంగా సినిమాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఎలా…
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు.…