సెప్టెంబరు నెలలో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవడం గ్యారెంటీ అని.. ఈ నెల ఆరంభంలో, చివర్లో రిలీజ్ కానున్న రెండు చిత్రాలు గట్టిగా సంకేతాలు ఇస్తున్నాయి. తొలి వారంలో రాబోతున్న షారుఖ్ ఖాన్ మూవీ ‘జవాన్’కు మంచి హైప్ ఉంది. నార్త్ ఇండియాలో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం. ఇక నెల చివర్లో వచ్చే ‘సలార్’ అయితే మొత్తం ఇండియానే షేక్ చేస్తుందనడంలో సందేహం లేదు.
ఈ సినిమా నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేస్తేనే హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ట్రైలర్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. దాని కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగస్టులోనే ట్రైలర్ లాంచ్ అన్నారు కానీ.. అలా జరగలేదు. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 6న ‘సలార్’ ట్రైలర్ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.
విడుదలకు 22 రోజుల ముందే ‘సలార్’ ట్రైలర్ లాంచ్ కాబోతోంది. ముందు 7వ తారీఖున ట్రైలర్ లాంచ్ అనుకున్నారు కానీ.. ఆ రోజున ‘జవాన్’ రిలీజ్ ఉంటుంది కాబట్టి ఫోకస్ ‘సలార్’ మీద ఉండదని ఒక రోజు ముందుకు జరిపారు. ఆ రోజు సోషల్ మీడియాను షేక్ చేశాక ‘సలార్’ ట్రైలర్ తర్వాతి రోజు థియేటర్లలోకి కూడా వస్తుందని సమాచారం. ‘జవాన్’ సినిమాతో ఈ ట్రైలర్ను ఎటాచ్ చేయనున్నారట.
ఇంటర్వెల్లో ట్రైలర్ను ప్రదర్శిస్తారట. ట్రైలర్ బాగుంటే జవాన్ థియేటర్లు మోతెక్కిపోవడం ఖాయం. సెప్టెంబరు 28న ‘సలార్’ వరల్డ్ వైడ్ రికార్డు స్క్రీన్లలో రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ చివరి మూడు చిత్రాలు నిరాశ పరిచినప్పటికీ.. ప్రభాస్ ఇమేజ్కు తగ్గ మాస్ మూవీ కావడం, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన చిత్రం కావడంతో ‘సలార్’ మీద అంచనాలు మామూలుగా లేవు. ‘కేజీఎఫ్’ నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది.
This post was last modified on August 30, 2023 4:06 pm
ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…
టాలీవుడ్లో ఘన చరిత్ర ఉన్న బేనర్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఒకటి. ఈ బేనర్ మీద పదుల సంఖ్యలో సినిమాలు తీశారు…
‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…
ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…
మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…
24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…