తాజాగా జరిగిన ఎన్టీఆర్ వంద రూపాయల స్మారక నాణెం వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం గురించి సినీ సర్కిల్స్, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరికి తమకు అనుకూలమైన వెర్షన్లు ప్రచారంలోకి తెస్తున్నారు. కళ్యాణ్ రామ్ కూడా రాకపోవడం కొన్ని అనుమానాలు రేపినప్పటికీ అసలేం జరిగిందనేది కేవలం ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఇటీవలే నందమూరి సుహాసిని కొడుకు వివాహానికి బాలయ్య, మోక్షజ్ఞ, తారక్ తో సహా అందరూ హాజరైనా దానికన్నా ఎక్కువగా ఇప్పుడీ కాయిన్ ఈవెంట్ నే హైలైట్ చేయడం గమనించాల్సిన విషయం.
అభిమానుల్లో సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు జూనియర్ ఎన్టీఆర్ దృష్టికి రాకుండా ఉండవు. కానీ స్పందించకుండా ప్రస్తుతానికి మౌనంగా ఉండటమే తనిస్తున్న అత్యుత్తమ సమాధానం. ఎందుకంటే ఇప్పుడే వివరణ ఇచ్చినా దానికి రకరకాల అర్థాలు తీస్తారు. దేవర షూటింగ్ ఉందంటే మరి కొరటాల శివ బన్నీ ఇంటికి ఎలా వెళ్లాడంటారు. లేదూ తనకు కుదరలేదన్నా ఇష్టం లేదన్నా చిలవలు పలవలుగా రాసేస్తారు. ఆ మధ్య చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి మీద అధికార పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు తారక్ ఖండిస్తూ వీడియో చేస్తే దాని గురించీ శల్యపరీక్ష చేయడం గుర్తేగా
సున్నితమైన ఇలాంటి విషయాల పట్ల కొంత కాలం సైలెంట్ గా ఉండటమే మంచిది. ఎన్నికలు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థులకు సంబంధించిన ఏ అంశమైనా సరే రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే శక్తులు పొంచి ఉన్నాయి. దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీతో మార్కెట్ ని విస్తృతపరుచుకునే పనిలో ఉన్న తారక్ కి ఇప్పుడివి అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన ఇంటర్నేషనల్ ఫేమ్ ని నిలబెట్టుకోవాలి. అలాంటప్పుడు ఫోకస్ దాని మీదే ఉంచడం వల్ల ఎలాంటి డీవియేషన్లు ఉండవు. అందుకే కొన్ని సందర్భాల్లో మౌనాన్ని మించిన గొప్ప పరిష్కారం లేదని పెద్దలు ఊరికే అనలేదు.
This post was last modified on August 30, 2023 1:05 pm
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…
నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…
సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…