ఓన్లీ తెలుగు కంటెంట్ నినాదంతో సాగుతున్న ఆహా ఓటిటికి ఆ మధ్య కొంచెం గ్యాప్ వచ్చి స్పీడ్ తగ్గింది కానీ ఈ సీజన్ లో వచ్చిన రెండు పెద్ద బ్లాక్ బస్టర్లు బేబీ, సామజవరగమన రెండూ దానికే దక్కడంతో మళ్ళీ ఊపందుకుంది. దీన్ని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో సినిమాలతో పాటు టాక్ షోల మీద కూడా సీరియస్ ఫోకస్ పెట్టింది. గతంలో సమంతా హోస్ట్ గా సామ్ జామ్ ప్రోగ్రాంని బాగానే నడిపించిన తీరు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. చిరంజీవి, బన్నీ, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి ఎందరో సెలబ్రిటీలు ఆ షోకు గెస్టులుగా వచ్చి వినోదంతో మెప్పించారు.
బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ఆహాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడూ చూడని సరికొత్త యాంకర్ కోణంలో ఆయన్ను ఆవిష్కరించిన తీరు బ్లాక్ బస్టర్స్ ఎపిసోడ్స్ తెచ్చి పెట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో చేసినవి ఏ రేంజ్ లో పేలాయో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ఫామ్ ని కొనసాగించేందుకు ఆహా తాజాగా విశ్వక్ సేన్ ని తీసుకొచ్చి ఫ్యామిలీ ధమాకా అనే గేమ్ షో షురూ చేయబోతోంది. ఇప్పటికే కొన్ని భాగాల షూటింగ్ అయిపోతుంది. సామాన్య కుటుంబాలతో పాటు పరిశ్రమ ప్రముఖుల ఫామిలీస్ ని ఇందులో భాగం చేశారు.
ట్రైలర్ గట్రా చూస్తుంటే ఫన్నీగా, ఆసక్తికరంగా అనిపిస్తోంది. విశ్వక్ సేన్ కొత్త ఎనర్జీతో షోని నడిపించిన తీరు కనెక్ట్ అయ్యేలానే ఉంది. ఈ మధ్య స్టార్ హీరోలు టీవీ షోల మీద మక్కువ చూపించడం ఊపందుకునేలా ఉంది. గతంలో నాని, జూనియర్ ఎన్టీఆర్ లు బిగ్ బాస్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. ఆ తర్వాత నాగార్జున కొనసాగిస్తున్నారు. రానా, మంచు లక్ష్మిలు ఎప్పటి నుంచో ఇవి చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు విశ్వక్ కూడా అదే బాటలో పడ్డాడు. సినిమాల కంటే ఎక్కువగా రియాలిటీ షోల మీద దృష్టి పెడుతున్న ఆహాకు ఈ ఫ్యామిలి ధమాకా ఎలాంటి మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి.
This post was last modified on August 29, 2023 4:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…