ఓన్లీ తెలుగు కంటెంట్ నినాదంతో సాగుతున్న ఆహా ఓటిటికి ఆ మధ్య కొంచెం గ్యాప్ వచ్చి స్పీడ్ తగ్గింది కానీ ఈ సీజన్ లో వచ్చిన రెండు పెద్ద బ్లాక్ బస్టర్లు బేబీ, సామజవరగమన రెండూ దానికే దక్కడంతో మళ్ళీ ఊపందుకుంది. దీన్ని ఇలాగే కొనసాగించాలనే ఉద్దేశంతో సినిమాలతో పాటు టాక్ షోల మీద కూడా సీరియస్ ఫోకస్ పెట్టింది. గతంలో సమంతా హోస్ట్ గా సామ్ జామ్ ప్రోగ్రాంని బాగానే నడిపించిన తీరు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. చిరంజీవి, బన్నీ, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి ఎందరో సెలబ్రిటీలు ఆ షోకు గెస్టులుగా వచ్చి వినోదంతో మెప్పించారు.
బాలయ్య అన్ స్టాపబుల్ టాక్ షో ఆహాని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడూ చూడని సరికొత్త యాంకర్ కోణంలో ఆయన్ను ఆవిష్కరించిన తీరు బ్లాక్ బస్టర్స్ ఎపిసోడ్స్ తెచ్చి పెట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో చేసినవి ఏ రేంజ్ లో పేలాయో మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడీ ఫామ్ ని కొనసాగించేందుకు ఆహా తాజాగా విశ్వక్ సేన్ ని తీసుకొచ్చి ఫ్యామిలీ ధమాకా అనే గేమ్ షో షురూ చేయబోతోంది. ఇప్పటికే కొన్ని భాగాల షూటింగ్ అయిపోతుంది. సామాన్య కుటుంబాలతో పాటు పరిశ్రమ ప్రముఖుల ఫామిలీస్ ని ఇందులో భాగం చేశారు.
ట్రైలర్ గట్రా చూస్తుంటే ఫన్నీగా, ఆసక్తికరంగా అనిపిస్తోంది. విశ్వక్ సేన్ కొత్త ఎనర్జీతో షోని నడిపించిన తీరు కనెక్ట్ అయ్యేలానే ఉంది. ఈ మధ్య స్టార్ హీరోలు టీవీ షోల మీద మక్కువ చూపించడం ఊపందుకునేలా ఉంది. గతంలో నాని, జూనియర్ ఎన్టీఆర్ లు బిగ్ బాస్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. ఆ తర్వాత నాగార్జున కొనసాగిస్తున్నారు. రానా, మంచు లక్ష్మిలు ఎప్పటి నుంచో ఇవి చేస్తున్న వాళ్ళే. ఇప్పుడు విశ్వక్ కూడా అదే బాటలో పడ్డాడు. సినిమాల కంటే ఎక్కువగా రియాలిటీ షోల మీద దృష్టి పెడుతున్న ఆహాకు ఈ ఫ్యామిలి ధమాకా ఎలాంటి మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి.
This post was last modified on August 29, 2023 4:29 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…