ఆగస్టు నెల మీద టాలీవుడ్ పెట్టుకున్న ఆశలు ఏమాత్రం నిలబడలేదు. ముందు నెలల్లో బేబి, సామజవరగమన లాంటి చిన్న సినిమాలు మంచి వసూళ్లు సాధించి ఆగస్టు మీద ఆశలు రేపగా.. ఈ నెల నిరాశనే మిగిల్చింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’ టాలీవుడ్కు మామూలు షాకివ్వలేదు. చిరు కెరీర్లోనే ఇది అతి పెద్ద డిజాస్టర్గా నిలిచింది. ఈ నెలలో అనువాద చిత్రం ‘జైలర్’ వసూళ్ల పంట పండించుకుంది. కానీ దాని ముందు ‘భోళా శంకర్’ ఏమాత్రం నిలవలేకపోయింది.
ఇదే నెలలో వచ్చిన మరో మెగా హీరో సినిమా ‘గాండీవధారి అర్జున’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఉస్తాద్, ప్రేమ్ కుమార్, మిస్టర్ ప్రెగ్నెంట్ లాంటి చిన్న సినిమాలూ నిరాశపరిచాయి. నెల చివరి వారంలో వచ్చిన ‘బెదురులంక 2012’ పర్వాలేదనిపించింది. మొత్తంగా ఆగస్టు నెల సెప్టెంబరుకు నిరాశనే మిగిల్చింది.
ఐతే తర్వాతి నెల సెప్టెంబరులో మాత్రం బాక్సాఫీస్ కళకళలాడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల ‘ఖుషి’ లాంటి క్రేజీ మూవీతో మొదలు కాబోతోంది. ఈ సినిమా వీకెండ్కు థియేటర్లలో సందడి తీసుకురావడం గ్యారెంటీ. టాక్ బాగుంటే సినిమా పెద్ద హిట్టవడం ఖాయం. తర్వాతి వారంలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మీద కూడా మంచి అంచనాలే ఉన్నాయి. అదే వీకెండ్లో డబ్బింగ్ మూవీ ‘జవాన్’ కూడా బాగానే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఉంది. నెల మధ్యలో మరో అనువాద చిత్రం ‘చంద్రముఖి-2’ సందడి చేస్తుంది.
అదే సమయంలో రిలీజయ్యే ‘స్కంద’ మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా మాస్కు మంచి విందుగా భావిస్తున్నారు. ఇక నెల చివర్లో డైనోసర్ ఎంట్రీ ఉంటుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలయికలో రానున్న ‘సలార్’కు ఉన్న హైప్ అలాంటిలాంటిది కాదు. నెల మొత్తం సందడి ఖాయంగా కనిపిస్తుండగా.. చివర్లో అయితే బాక్సాఫీస్ షేక్ అయిపోవడం ఖాయం. అందుకే సెప్టెంబరు కోసం ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
This post was last modified on August 29, 2023 8:02 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…