స్టేజ్ మీద కొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు తమను తాము నియంత్రించుకోలేక విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. మాటలతో పాటు చేతలు కూడా తడబడుతుంటాయి. ప్రవర్తన హద్దులు దాటిపోతుంటుంది. చాలా ఏళ్ల కిందట హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె.. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిని ముద్దాడటమే కాక ఘాటు రొమాన్స్ చేయాలని చూడటం ఎంత దుమారం రేపిందో తెలిసిందే.
టాలీవుడ్ విషయానికి వస్తే కొన్నేళ్ల కిందట ఒక సినిమా వేడుకలో సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కే నాయుడు.. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్కు ముద్దివ్వడం తీవ్ర వివాదాస్పదం అయింది. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ‘యజ్ఞం’ ఫేమ్ రవికుమార్ చౌదరి.. తన కొత్త చిత్రం ‘తిరగబడరా సామి’కి సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో హద్దులు దాటి ప్రవర్తించాడు.
ఈవెంట్ చివర్లో స్టేజ్ మీద ఫొటోలకు పోజులిస్తూ ముందుగా అతను హీరోయిన్ మన్నారా చోప్రా మీద చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. కొన్ని క్షణాలకే ఆమె బుగ్గ మీద ముద్దు కూడా పెట్టేశాడు. ఆ సమయంలో మన్నారా ఇబ్బంది పడుతూనే.. పైకి మాత్రం నవ్వేసింది. ఒక దర్శకుడు అంటే ఎవ్వరైనా ఉన్నత స్థాయిలో ఊహించుకుంటారు. అలాంటి వ్యక్తి తనను తాను నియంత్రించుకోలేక కథానాయికకు ముద్దు పెట్టడం తీవ్ర అభ్యంతరకరంగా అనిపిస్తోంది.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేరే ఇండస్ట్రీల వాళ్లు ఈ వీడియో పట్టుకుని టాలీవుడ్ పేరెత్తి విమర్శలు చేస్తున్నారు. ‘యజ్ఞం’ సినిమా తర్వాత చాలా ఏళ్లు ఫెయిల్యూర్స్లో ఉన్న రవికుమార్ చౌదరి ‘పిల్లా నువ్వు లేని జీవితం’తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. కానీ తర్వాత మళ్లీ ట్రాక్ తప్పాడు. కొన్నేళ్లు కనిపించకుండా పోయిన అతను.. రాజ్ తరుణ్ హీరోగా ‘తిరగబడరా సామి’ తీశాడు. మీడియా దృష్టిలో పడటానికి, ఈ సినిమాకు పబ్లిసిటీ తేవడానికేమైనా ఇలా చేశాడేమో తెలియదు కానీ.. రవికుమార్ మీద సోషల్ మీడియాలో మాత్రం ఒక రేంజిలో ట్రోలింగ్ జరుగుతోంది.
This post was last modified on August 29, 2023 1:44 pm
యానిమల్ విడుదలైన టైంలో, అంతకు ముందు కబీర్ సింగ్ సమయంలో బాలీవుడ్ విమర్శకులు, కొందరు నటీనటులు అదే పనిగా దర్శకుడు…
ఎన్నికల ప్రచారంలో ఎండనక.. వాననక.. నానా కష్టాలూ పడిన రాజకీయ ప్రముఖులు, పోలింగ్ తర్వాత, కౌంటింగ్కి ముందు.. కొంత ఉపశమనం…
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి…
ఏపీలో రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఎన్నికల పోలింగ్ జరిగిన ఈ నెల 13న, ఆ రోజు తర్వాత కూడా..…
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 6…
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు…