తెలుగులో ఒకప్పుడు కమెడియన్లు హీరో అవతారం ఎత్తాలంటే భయపడేవాళ్లు. మనం హీరోయిజం చేస్తే ఎవడు చూస్తాడనే భావన ఉండేది. బ్రహ్మానందం, బాబూ మోహన్ లాంటి వాళ్లు హీరోలుగా నటించినప్పటికీ.. అవి వాళ్ల ఇమేజ్కు తగ్గ సినిమాలు. అందులో వాళ్లేమీ హీరోల్లా విన్యాసాలు చేయలేదు.
ఆ ఒకటీ అరా సినిమాలకు లీడ్ క్యారెక్టర్లను పరిమితం చేసి.. ఆ తర్వాత మామూలుగా కామెడీ రోల్స్ చేసుకుంటూ పోయారు. కానీ ఇప్పటి కమెడియన్ల తీరు వేరు. కాస్త పేరు రాగానే హీరోలైపోతున్నారు.
వాటిలో వీర లెవెల్లో ఎలివేషన్లు.. మాస్ హీరోల్లా ఫైట్లు, డ్యాన్సులు.. ఇంకా ఎన్నో విన్యాసాలు. భరించడం చాలా చాలా కష్టమైపోయి.. కమెడియన్లు హీరోలంటేనే భయపడిపోయే పరిస్థితి వచ్చేసింది. సునీల్తో మొదలుపెడితే షకలక శంకర్ వరకు ఇదే పరిస్థితి.
ఇలాంటి తరుణంలో మరో కమెడియన్ హీరో కాబోతుండటం విశేషం. అతనెవరో కాదు.. సత్య. ‘స్వామిరారా’ నుంచి ‘మత్తు వదలరా’ వరకు అనేక సినిమాల్లో కమెడియన్గా సత్తా చాటాడు సత్య. అతడి కామెడీ టైమింగ్ భలేగా ఉంటుంది. చూడగానే నవ్వు తెప్పించే అతి కొద్దిమంది కమెడియన్లలో సత్య ఒకడు.
అతనిప్పుడు హీరో అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. యువ కథానాయకుడు సందీప్ కిషన్.. నిర్మాతగా ‘వివాహ భోజనంబు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకెంతగానో నచ్చిన ఓ ప్రముఖ నటుడు ఇందులో హీరో అని అతను పేర్కొన్నాడు. ఆ పేరును గెస్ చేసే పనిలో ఉన్నారు నెటిజన్లు.
సందీప్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఆ వ్యక్తి సత్యనే అట. అతడి బాడీ లాంగ్వేజ్కు తగ్గ కామెడీ సబ్జెక్ట్ ఇదని.. కచ్చితంగా క్లిక్ అవుతుందని అంటున్నారు. రామ్ అబ్బరాజు అనే యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
This post was last modified on August 20, 2020 2:09 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…