ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందనే అంచనాలు ‘సలార్’ మీద ఉన్నాయి. ఇది సగటు మాస్ సినిమాలాగే కనిపిస్తున్నప్పటికీ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బిగ్ కాన్వాస్ సినిమాలకు దీటుగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయగలదని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. అందుక్కారణం.. ప్రభాస్ కటౌట్కు తగ్గ మాస్ మసాలా సినిమా కావడం, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దీన్ని డైరెక్ట్ చేస్తుండటమే.
కొన్ని నెలల కిందట హీరోను డైనోసర్తో పోలుస్తూ సాగిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ప్రమోషనల్ కంటెంట్ ఏదీ రిలీజ్ చేయకపోయినా.. సినిమాకు హైప్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఐతే రిలీజ్కు నెల రోజుల ముందు వరకు కూడా ఈ చిత్రానికి బిజినెస్ పూర్తి కాకపోవడంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అలా అని ‘సలార్’కు బయ్యర్లు లేక కాదు.
‘సలార్’ బాక్సాఫీస్ దగ్గర ఊహించని నంబర్స్ నమోదు చేస్తుందని నమ్ముతున్న నిర్మాతలు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లు అడుగుతున్నారు. బయ్యర్లు కొంచెం తగ్గించి కోట్ చేస్తున్నారు. ఇలా చర్చోప చర్చలు జరుగుతూ బిజినెస్ కొంత ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం ‘సలార్’ నైజాం డీల్ పూర్తయినట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏకంగా రూ.65 కోట్లు పెట్టి ‘సలార్’ నైజాం రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఇది మరీ ఎక్కువ రేటేమో అన్న డిస్కషన్ నడుస్తోంది.
కానీ ఐదేళ్ల ముందు ‘బాహుబలి-2’ మీద ఏకంగా రూ.50 కోట్లు పెట్టారు రాజు. అప్పుడు అది చాలా పెద్ద రిస్క్ అన్నారు. కానీ రాజు ఆ రేటు మీద మంచి లాభాలు చూశాడు. ఇప్పుడు పెరిగిన టికెట్ రేట్లు, అదనపు ధరలు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉండటం… ‘సలార్’కు ఉన్న హైప్ దృష్ట్యా ఇదేం పెద్ద రిస్క్ కాదని రాజు భావిస్తున్నాడు. సినిమాకు టాక్ వస్తే రూ.80 కోట్ల మేర షేర్ రాబడుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 29, 2023 10:23 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…