ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బిగ్ థింగ్ అవుతుందనే అంచనాలు ‘సలార్’ మీద ఉన్నాయి. ఇది సగటు మాస్ సినిమాలాగే కనిపిస్తున్నప్పటికీ ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి బిగ్ కాన్వాస్ సినిమాలకు దీటుగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయగలదని ట్రేడ్ పండిట్లు అంచనా వేస్తున్నారు. అందుక్కారణం.. ప్రభాస్ కటౌట్కు తగ్గ మాస్ మసాలా సినిమా కావడం, ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ దీన్ని డైరెక్ట్ చేస్తుండటమే.
కొన్ని నెలల కిందట హీరోను డైనోసర్తో పోలుస్తూ సాగిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచింది. ఆ తర్వాత ఇప్పటిదాకా ప్రమోషనల్ కంటెంట్ ఏదీ రిలీజ్ చేయకపోయినా.. సినిమాకు హైప్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. ఐతే రిలీజ్కు నెల రోజుల ముందు వరకు కూడా ఈ చిత్రానికి బిజినెస్ పూర్తి కాకపోవడంపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అలా అని ‘సలార్’కు బయ్యర్లు లేక కాదు.
‘సలార్’ బాక్సాఫీస్ దగ్గర ఊహించని నంబర్స్ నమోదు చేస్తుందని నమ్ముతున్న నిర్మాతలు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో భారీ రేట్లు అడుగుతున్నారు. బయ్యర్లు కొంచెం తగ్గించి కోట్ చేస్తున్నారు. ఇలా చర్చోప చర్చలు జరుగుతూ బిజినెస్ కొంత ఆలస్యం అయింది. తాజా సమాచారం ప్రకారం ‘సలార్’ నైజాం డీల్ పూర్తయినట్లు సమాచారం. అగ్ర నిర్మాత దిల్ రాజే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఏకంగా రూ.65 కోట్లు పెట్టి ‘సలార్’ నైజాం రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాపై ఎంత నమ్మకం ఉన్నా సరే.. ఇది మరీ ఎక్కువ రేటేమో అన్న డిస్కషన్ నడుస్తోంది.
కానీ ఐదేళ్ల ముందు ‘బాహుబలి-2’ మీద ఏకంగా రూ.50 కోట్లు పెట్టారు రాజు. అప్పుడు అది చాలా పెద్ద రిస్క్ అన్నారు. కానీ రాజు ఆ రేటు మీద మంచి లాభాలు చూశాడు. ఇప్పుడు పెరిగిన టికెట్ రేట్లు, అదనపు ధరలు కూడా పెట్టుకునే ఛాన్స్ ఉండటం… ‘సలార్’కు ఉన్న హైప్ దృష్ట్యా ఇదేం పెద్ద రిస్క్ కాదని రాజు భావిస్తున్నాడు. సినిమాకు టాక్ వస్తే రూ.80 కోట్ల మేర షేర్ రాబడుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…