ఏ సినిమా కాయినా గ్లామర్ హీరోయినే. ప్రమోషన్స్ లో కూడా హీరో ఎంత తిరిగినా అందరి చూపు హీరోయిన్ మీదే ఉంటుంది. తాజాగా ఓ రెండు సినిమాలకు సంబంధించి ఆ హీరోలకి ఒకే ఇబ్బంది ఎదురైంది. విషయంలోకెళ్తే, విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1 న థియేటర్స్ లోకి వస్తుంది. ఇందులో విజయ్ జంటగా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో సామ్ అనారోగ్యానికి గురైంది. వింత వ్యాధితో ఇబ్బంది పడుతూ షూటింగ్ బ్రేక్ తీసుకుంది. ఆమె కోసం కొన్ని నెలలు ఘాట్ ఆపేసి సామ్ రికవరీ అయ్యాక మళ్ళీ ఘాట్ మొదలు పెట్టారు.
అయితే ఈ సినిమాకు సాంగ్స్ మంచి బజ్ తెచ్చాయి. ఇక విజయ్ కూడా గట్టిగా టూర్లు తిరుగుతూ పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నాడు. కానీ ఈ ప్రమోషన్స్ కి సమంత స్కిప్ కొట్టేసింది. హెల్త్ కారణంగా ప్రమోషన్స్ కి దూరంగా ఉంది. కాకపోతే ఒకటి రెండు రోజులు ఇంటర్వ్యూల్లో విజయ్ తో పాల్గొంది. అక్కడితో చేయి దులిపేసుకుంది. సమంత ప్రమోషన్స్ కి రాకపోవడంతో విజయ్ కూడా మెల్లగా సైలెంట్ అయిపోయాడు. తాజాగా ఓ ఫోన్ వీడియో కాల్ తో విజయ్ , సామ్ చివరి ప్రమోషన్ చేసుకున్నారు.
మరో వైపు నవీన్ పోలిశెట్టి ది కూడా ఇదే పరిస్థితి. మిస్ శెట్టి , మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కి తను హాజరు కానని ముందే టీం కి చెప్పేసిందట స్వీటీ. దీంతో సినిమా ప్రమోషన్ భాద్యత అంతా నవీన్ మీదే పడింది. విజయ్ కి కనీసం సమంత కొంతైనా సపోర్ట్ చేసింది. అనుష్క మాత్రం మొత్తానికి చేతులెత్తేసింది. అధిక బరువు కారణం చేత అనుష్క మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరిస్తుందని సమాచారం. దీంతో సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండదని తెలుస్తుంది. ఏదేమైనా విజయ్ , నవీన్ పోలిశెట్టి ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేసి వారిని ప్రమోషన్స్ రప్పించలేక పడరాని పాట్లు పడుతున్నారు.
This post was last modified on August 28, 2023 11:00 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…