Movie News

స్టార్ హీరోయిన్స్ తో కుర్ర హీరోల పాట్లు

ఏ సినిమా కాయినా గ్లామర్ హీరోయినే. ప్రమోషన్స్ లో కూడా హీరో ఎంత తిరిగినా అందరి చూపు హీరోయిన్ మీదే ఉంటుంది. తాజాగా ఓ రెండు సినిమాలకు సంబంధించి ఆ హీరోలకి ఒకే ఇబ్బంది ఎదురైంది. విషయంలోకెళ్తే, విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1 న థియేటర్స్ లోకి వస్తుంది. ఇందులో విజయ్ జంటగా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో సామ్ అనారోగ్యానికి గురైంది. వింత వ్యాధితో ఇబ్బంది పడుతూ షూటింగ్ బ్రేక్ తీసుకుంది. ఆమె కోసం కొన్ని నెలలు ఘాట్ ఆపేసి సామ్ రికవరీ అయ్యాక మళ్ళీ ఘాట్ మొదలు పెట్టారు. 

అయితే ఈ సినిమాకు సాంగ్స్ మంచి బజ్ తెచ్చాయి. ఇక విజయ్ కూడా గట్టిగా టూర్లు తిరుగుతూ పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నాడు. కానీ ఈ ప్రమోషన్స్ కి సమంత స్కిప్ కొట్టేసింది. హెల్త్ కారణంగా ప్రమోషన్స్ కి దూరంగా ఉంది. కాకపోతే ఒకటి రెండు రోజులు ఇంటర్వ్యూల్లో విజయ్ తో పాల్గొంది. అక్కడితో చేయి దులిపేసుకుంది. సమంత ప్రమోషన్స్ కి రాకపోవడంతో విజయ్ కూడా మెల్లగా సైలెంట్ అయిపోయాడు. తాజాగా ఓ ఫోన్ వీడియో కాల్ తో విజయ్ , సామ్ చివరి ప్రమోషన్ చేసుకున్నారు. 

మరో వైపు నవీన్ పోలిశెట్టి ది కూడా ఇదే పరిస్థితి. మిస్ శెట్టి , మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కి తను హాజరు కానని ముందే టీం కి చెప్పేసిందట స్వీటీ. దీంతో సినిమా ప్రమోషన్ భాద్యత అంతా నవీన్ మీదే పడింది. విజయ్ కి కనీసం సమంత కొంతైనా సపోర్ట్ చేసింది. అనుష్క మాత్రం మొత్తానికి చేతులెత్తేసింది. అధిక బరువు కారణం చేత అనుష్క మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరిస్తుందని సమాచారం. దీంతో సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండదని తెలుస్తుంది. ఏదేమైనా విజయ్ , నవీన్ పోలిశెట్టి ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేసి వారిని  ప్రమోషన్స్ రప్పించలేక పడరాని పాట్లు పడుతున్నారు.

This post was last modified on August 28, 2023 11:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago