ఏ సినిమా కాయినా గ్లామర్ హీరోయినే. ప్రమోషన్స్ లో కూడా హీరో ఎంత తిరిగినా అందరి చూపు హీరోయిన్ మీదే ఉంటుంది. తాజాగా ఓ రెండు సినిమాలకు సంబంధించి ఆ హీరోలకి ఒకే ఇబ్బంది ఎదురైంది. విషయంలోకెళ్తే, విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1 న థియేటర్స్ లోకి వస్తుంది. ఇందులో విజయ్ జంటగా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో సామ్ అనారోగ్యానికి గురైంది. వింత వ్యాధితో ఇబ్బంది పడుతూ షూటింగ్ బ్రేక్ తీసుకుంది. ఆమె కోసం కొన్ని నెలలు ఘాట్ ఆపేసి సామ్ రికవరీ అయ్యాక మళ్ళీ ఘాట్ మొదలు పెట్టారు.
అయితే ఈ సినిమాకు సాంగ్స్ మంచి బజ్ తెచ్చాయి. ఇక విజయ్ కూడా గట్టిగా టూర్లు తిరుగుతూ పాన్ ఇండియా లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నాడు. కానీ ఈ ప్రమోషన్స్ కి సమంత స్కిప్ కొట్టేసింది. హెల్త్ కారణంగా ప్రమోషన్స్ కి దూరంగా ఉంది. కాకపోతే ఒకటి రెండు రోజులు ఇంటర్వ్యూల్లో విజయ్ తో పాల్గొంది. అక్కడితో చేయి దులిపేసుకుంది. సమంత ప్రమోషన్స్ కి రాకపోవడంతో విజయ్ కూడా మెల్లగా సైలెంట్ అయిపోయాడు. తాజాగా ఓ ఫోన్ వీడియో కాల్ తో విజయ్ , సామ్ చివరి ప్రమోషన్ చేసుకున్నారు.
మరో వైపు నవీన్ పోలిశెట్టి ది కూడా ఇదే పరిస్థితి. మిస్ శెట్టి , మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్స్ కి తను హాజరు కానని ముందే టీం కి చెప్పేసిందట స్వీటీ. దీంతో సినిమా ప్రమోషన్ భాద్యత అంతా నవీన్ మీదే పడింది. విజయ్ కి కనీసం సమంత కొంతైనా సపోర్ట్ చేసింది. అనుష్క మాత్రం మొత్తానికి చేతులెత్తేసింది. అధిక బరువు కారణం చేత అనుష్క మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరిస్తుందని సమాచారం. దీంతో సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండదని తెలుస్తుంది. ఏదేమైనా విజయ్ , నవీన్ పోలిశెట్టి ఇద్దరూ స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేసి వారిని ప్రమోషన్స్ రప్పించలేక పడరాని పాట్లు పడుతున్నారు.
This post was last modified on August 28, 2023 11:00 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…