బాలకృష్ణ అత్యుత్తమ సినిమాల్లో భైరవ ద్వీపంది ప్రత్యేక స్థానం. గ్రాఫిక్స్ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ జానపదాన్ని ఆవిష్కరించిన తీరు అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అందుకే రీ రిలీజ్ అనగానే ప్రత్యేకమైన ఎగ్జైట్ మెంట్ అభిమానులకు కలగడం సహజం. అయితే ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ ఆల్ టైం క్లాసిక్ కి సరైన థియేటర్లు దొరక్క, షోలు సర్దుబాటు కాక హడావిడి పడుతోంది. చాలా చోట్ల అసలిది వస్తోందన్న సంగతే గుర్తు లేనంత వీక్ గా ప్రమోషన్లు చేపట్టడం విచారకరం.
కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాలయ్య సైతం వీడియో బైట్స్ ఇవ్వడం, సినిమా చూడమని ప్రోత్సహించడం చేసేవాళ్ళు. కానీ డిస్ట్రిబ్యూటర్ కు ఆ ధ్యాస కానీ, ఆలోచన కానీ లేదు. కేవలం రెండు రోజుల ముందు ప్రకటన ఇవ్వడం వల్ల జనానికి ఇది రీచ్ కావడం లేదు. పైగా విజయ్ దేవరకొండ ఖుషి ముంగిట్లో ఉండగా భైరవ ద్వీపంని నెలాఖరులో తీసుకురావడం కూడా సరైన స్ట్రాటజీ కాదు. మంత్ ఎండింగ్ లో జనాలు థియేటర్లకు వెళ్లి ఖర్చు పెట్టుకుని సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. ఇవన్నీ విశ్లేషించుకుని కనీసం మూడు నాలుగు వారాల ముందు ప్లానింగ్ చేసుకోవాలి.
ఇదే తరహాలో ఆ మధ్య నరసింహనాయుడుని కిల్ చేశారు. గొప్పగా రీ మాస్టర్ చేయించినా సరైన ప్లానింగ్ లేక అంత శ్రమపడిన టెక్నికల్ టీమ్ కు తగిన ఫలితం దక్కలేదు. భైరవద్వీపంలో నటించిన ఎందరో ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నారు. రోజా, విజయ్ కుమార్, బాబు మోహన్, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, రంభ చాలా మందిని కలిసే అవకాశం ఉంది. సింగీతం వారు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇంత అవకాశం ఉండి ఇప్పటి తరానికి గొప్పగా పరిచయం చేయాల్సిన ఒక క్లాసిక్ మూవీని 4కెకి మార్చిన ప్రయోజనం పూర్తిగా దక్కనివ్వకుండా చేస్తున్నారు.
This post was last modified on August 28, 2023 10:46 pm
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…