బాలకృష్ణ అత్యుత్తమ సినిమాల్లో భైరవ ద్వీపంది ప్రత్యేక స్థానం. గ్రాఫిక్స్ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ జానపదాన్ని ఆవిష్కరించిన తీరు అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అందుకే రీ రిలీజ్ అనగానే ప్రత్యేకమైన ఎగ్జైట్ మెంట్ అభిమానులకు కలగడం సహజం. అయితే ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ ఆల్ టైం క్లాసిక్ కి సరైన థియేటర్లు దొరక్క, షోలు సర్దుబాటు కాక హడావిడి పడుతోంది. చాలా చోట్ల అసలిది వస్తోందన్న సంగతే గుర్తు లేనంత వీక్ గా ప్రమోషన్లు చేపట్టడం విచారకరం.
కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాలయ్య సైతం వీడియో బైట్స్ ఇవ్వడం, సినిమా చూడమని ప్రోత్సహించడం చేసేవాళ్ళు. కానీ డిస్ట్రిబ్యూటర్ కు ఆ ధ్యాస కానీ, ఆలోచన కానీ లేదు. కేవలం రెండు రోజుల ముందు ప్రకటన ఇవ్వడం వల్ల జనానికి ఇది రీచ్ కావడం లేదు. పైగా విజయ్ దేవరకొండ ఖుషి ముంగిట్లో ఉండగా భైరవ ద్వీపంని నెలాఖరులో తీసుకురావడం కూడా సరైన స్ట్రాటజీ కాదు. మంత్ ఎండింగ్ లో జనాలు థియేటర్లకు వెళ్లి ఖర్చు పెట్టుకుని సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. ఇవన్నీ విశ్లేషించుకుని కనీసం మూడు నాలుగు వారాల ముందు ప్లానింగ్ చేసుకోవాలి.
ఇదే తరహాలో ఆ మధ్య నరసింహనాయుడుని కిల్ చేశారు. గొప్పగా రీ మాస్టర్ చేయించినా సరైన ప్లానింగ్ లేక అంత శ్రమపడిన టెక్నికల్ టీమ్ కు తగిన ఫలితం దక్కలేదు. భైరవద్వీపంలో నటించిన ఎందరో ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నారు. రోజా, విజయ్ కుమార్, బాబు మోహన్, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, రంభ చాలా మందిని కలిసే అవకాశం ఉంది. సింగీతం వారు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇంత అవకాశం ఉండి ఇప్పటి తరానికి గొప్పగా పరిచయం చేయాల్సిన ఒక క్లాసిక్ మూవీని 4కెకి మార్చిన ప్రయోజనం పూర్తిగా దక్కనివ్వకుండా చేస్తున్నారు.
This post was last modified on August 28, 2023 10:46 pm
విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జరిగినా పరిస్థితి…
తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ హఠాత్తుగా కన్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండరీ…
ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
టీనేజీలోనే తన ప్రతిభను చాటుకుని చాలా వేగంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగాడు దేవిశ్రీ ప్రసాద్. ఎంత ఎదిగినా ఒదిగి…