బాలకృష్ణ అత్యుత్తమ సినిమాల్లో భైరవ ద్వీపంది ప్రత్యేక స్థానం. గ్రాఫిక్స్ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ జానపదాన్ని ఆవిష్కరించిన తీరు అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అందుకే రీ రిలీజ్ అనగానే ప్రత్యేకమైన ఎగ్జైట్ మెంట్ అభిమానులకు కలగడం సహజం. అయితే ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ ఆల్ టైం క్లాసిక్ కి సరైన థియేటర్లు దొరక్క, షోలు సర్దుబాటు కాక హడావిడి పడుతోంది. చాలా చోట్ల అసలిది వస్తోందన్న సంగతే గుర్తు లేనంత వీక్ గా ప్రమోషన్లు చేపట్టడం విచారకరం.
కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాలయ్య సైతం వీడియో బైట్స్ ఇవ్వడం, సినిమా చూడమని ప్రోత్సహించడం చేసేవాళ్ళు. కానీ డిస్ట్రిబ్యూటర్ కు ఆ ధ్యాస కానీ, ఆలోచన కానీ లేదు. కేవలం రెండు రోజుల ముందు ప్రకటన ఇవ్వడం వల్ల జనానికి ఇది రీచ్ కావడం లేదు. పైగా విజయ్ దేవరకొండ ఖుషి ముంగిట్లో ఉండగా భైరవ ద్వీపంని నెలాఖరులో తీసుకురావడం కూడా సరైన స్ట్రాటజీ కాదు. మంత్ ఎండింగ్ లో జనాలు థియేటర్లకు వెళ్లి ఖర్చు పెట్టుకుని సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. ఇవన్నీ విశ్లేషించుకుని కనీసం మూడు నాలుగు వారాల ముందు ప్లానింగ్ చేసుకోవాలి.
ఇదే తరహాలో ఆ మధ్య నరసింహనాయుడుని కిల్ చేశారు. గొప్పగా రీ మాస్టర్ చేయించినా సరైన ప్లానింగ్ లేక అంత శ్రమపడిన టెక్నికల్ టీమ్ కు తగిన ఫలితం దక్కలేదు. భైరవద్వీపంలో నటించిన ఎందరో ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నారు. రోజా, విజయ్ కుమార్, బాబు మోహన్, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, రంభ చాలా మందిని కలిసే అవకాశం ఉంది. సింగీతం వారు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇంత అవకాశం ఉండి ఇప్పటి తరానికి గొప్పగా పరిచయం చేయాల్సిన ఒక క్లాసిక్ మూవీని 4కెకి మార్చిన ప్రయోజనం పూర్తిగా దక్కనివ్వకుండా చేస్తున్నారు.
This post was last modified on August 28, 2023 10:46 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…