బాలకృష్ణ అత్యుత్తమ సినిమాల్లో భైరవ ద్వీపంది ప్రత్యేక స్థానం. గ్రాఫిక్స్ టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ఈ జానపదాన్ని ఆవిష్కరించిన తీరు అప్పట్లో బ్లాక్ బస్టర్ సాధించి వసూళ్ల వర్షం కురిపించింది. అందుకే రీ రిలీజ్ అనగానే ప్రత్యేకమైన ఎగ్జైట్ మెంట్ అభిమానులకు కలగడం సహజం. అయితే ఎల్లుండి విడుదల కాబోతున్న ఈ ఆల్ టైం క్లాసిక్ కి సరైన థియేటర్లు దొరక్క, షోలు సర్దుబాటు కాక హడావిడి పడుతోంది. చాలా చోట్ల అసలిది వస్తోందన్న సంగతే గుర్తు లేనంత వీక్ గా ప్రమోషన్లు చేపట్టడం విచారకరం.
కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాలయ్య సైతం వీడియో బైట్స్ ఇవ్వడం, సినిమా చూడమని ప్రోత్సహించడం చేసేవాళ్ళు. కానీ డిస్ట్రిబ్యూటర్ కు ఆ ధ్యాస కానీ, ఆలోచన కానీ లేదు. కేవలం రెండు రోజుల ముందు ప్రకటన ఇవ్వడం వల్ల జనానికి ఇది రీచ్ కావడం లేదు. పైగా విజయ్ దేవరకొండ ఖుషి ముంగిట్లో ఉండగా భైరవ ద్వీపంని నెలాఖరులో తీసుకురావడం కూడా సరైన స్ట్రాటజీ కాదు. మంత్ ఎండింగ్ లో జనాలు థియేటర్లకు వెళ్లి ఖర్చు పెట్టుకుని సినిమాలు చూసే మూడ్ లో ఉండరు. ఇవన్నీ విశ్లేషించుకుని కనీసం మూడు నాలుగు వారాల ముందు ప్లానింగ్ చేసుకోవాలి.
ఇదే తరహాలో ఆ మధ్య నరసింహనాయుడుని కిల్ చేశారు. గొప్పగా రీ మాస్టర్ చేయించినా సరైన ప్లానింగ్ లేక అంత శ్రమపడిన టెక్నికల్ టీమ్ కు తగిన ఫలితం దక్కలేదు. భైరవద్వీపంలో నటించిన ఎందరో ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఉన్నారు. రోజా, విజయ్ కుమార్, బాబు మోహన్, గిరిబాబు, శుభలేఖ సుధాకర్, రంభ చాలా మందిని కలిసే అవకాశం ఉంది. సింగీతం వారు సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇంత అవకాశం ఉండి ఇప్పటి తరానికి గొప్పగా పరిచయం చేయాల్సిన ఒక క్లాసిక్ మూవీని 4కెకి మార్చిన ప్రయోజనం పూర్తిగా దక్కనివ్వకుండా చేస్తున్నారు.
This post was last modified on August 28, 2023 10:46 pm
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…