సినిమా ఓపెనింగ్ తో , లేదా ఎనౌన్స్ మెంట్ వీడియోతో షూట్ కి ముందే సినిమాపై హైప్ తీసుకురావడం సహజమే. కానీ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేయబోయే నెక్స్ట్ సినిమాకి కొత్త రకంగా హైప్ క్రియేట్ చేశాడు. ప్రతీ సినిమాకు ఓ ఆఫీస్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ నుండే ఆ ఆఫీస్ లో వర్క్ మొదలవుతుంది. అయితే ఎంత పెద్ద సినిమా అయినా సైలెంట్ గా ఆఫీస్ తీసుకొని పనులు మొదలు పెడతారు. కానీ తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఆఫీస్ ఓపెనింగ్ తోనే ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేశారు.
జూబ్లీహిల్స్ లో ఈ సినిమా ఆఫీస్ కోసం ఓ బిల్డింగ్ మొత్తం రెంట్ కి తీసుకున్నారు. అందులో పూజా కార్యక్రమాలు , హోమాలు నిర్వహించారు. బుచ్చి బాబు, నిర్మాతలు పట్టు వస్త్రాలతో పంచే కట్టుతో కనిపించారు. సుకుమార్ కూడా అదే గెటప్ లో కనిపించడం విశేషం. దీంతో ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ ఫ్యాన్స్ ఆఫీస్ ఓపెనింగే ఇలా ఉంటే సినిమా ఓపెనింగ్ అలాగే ఈవెంట్స్ ఎలా ఉంటాయో అని ఇప్పటి నుండే భారీగా ఊహించుకోవడం మొదలెట్టారు.
ఏదేమైనా ఆఫీస్ ఓపెనింగ్ తోనే దర్శకుడు బుచ్చి బాబు సినిమాపై మంచి హైప్ తెచ్చాడు. ఓపెనింగ్ కూడా లేకుండా ఇలా సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆఫీస్ ఓపెనింగ్ కి ఈ రేంజ్ పూజలు , హోమాలు చేయడం ఇదే మొదటి సారేమో అంటూ ఫోటోస్ చూసి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ లేదా జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ శంకర్ తో గేమ్ చేంజర్ పూర్తి చేసి బుచ్చి బాబు సినిమాను మొదలు పెడతాడు. ఈ లోపు బుచ్చిబాబు రెహ్మాన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్, లోకేషన్స్ స్కౌటింగ్ చూసుకుంటాడు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…