సినిమా ఓపెనింగ్ తో , లేదా ఎనౌన్స్ మెంట్ వీడియోతో షూట్ కి ముందే సినిమాపై హైప్ తీసుకురావడం సహజమే. కానీ యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేయబోయే నెక్స్ట్ సినిమాకి కొత్త రకంగా హైప్ క్రియేట్ చేశాడు. ప్రతీ సినిమాకు ఓ ఆఫీస్ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ నుండే ఆ ఆఫీస్ లో వర్క్ మొదలవుతుంది. అయితే ఎంత పెద్ద సినిమా అయినా సైలెంట్ గా ఆఫీస్ తీసుకొని పనులు మొదలు పెడతారు. కానీ తాజాగా రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఆఫీస్ ఓపెనింగ్ తోనే ఫ్యాన్స్ లో జోష్ తీసుకొచ్చి హైప్ క్రియేట్ చేశారు.
జూబ్లీహిల్స్ లో ఈ సినిమా ఆఫీస్ కోసం ఓ బిల్డింగ్ మొత్తం రెంట్ కి తీసుకున్నారు. అందులో పూజా కార్యక్రమాలు , హోమాలు నిర్వహించారు. బుచ్చి బాబు, నిర్మాతలు పట్టు వస్త్రాలతో పంచే కట్టుతో కనిపించారు. సుకుమార్ కూడా అదే గెటప్ లో కనిపించడం విశేషం. దీంతో ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చరణ్ ఫ్యాన్స్ ఆఫీస్ ఓపెనింగే ఇలా ఉంటే సినిమా ఓపెనింగ్ అలాగే ఈవెంట్స్ ఎలా ఉంటాయో అని ఇప్పటి నుండే భారీగా ఊహించుకోవడం మొదలెట్టారు.
ఏదేమైనా ఆఫీస్ ఓపెనింగ్ తోనే దర్శకుడు బుచ్చి బాబు సినిమాపై మంచి హైప్ తెచ్చాడు. ఓపెనింగ్ కూడా లేకుండా ఇలా సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆఫీస్ ఓపెనింగ్ కి ఈ రేంజ్ పూజలు , హోమాలు చేయడం ఇదే మొదటి సారేమో అంటూ ఫోటోస్ చూసి ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. డిసెంబర్ లేదా జనవరి నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ శంకర్ తో గేమ్ చేంజర్ పూర్తి చేసి బుచ్చి బాబు సినిమాను మొదలు పెడతాడు. ఈ లోపు బుచ్చిబాబు రెహ్మాన్ తో మ్యూజిక్ సిట్టింగ్స్, లోకేషన్స్ స్కౌటింగ్ చూసుకుంటాడు.
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…