మాములుగా స్టార్ హీరోల వారసులు నటన వైపే మొగ్గు చూపుతారు. తండ్రి నడిచిన బాటలో రెడీ మేడ్ గా ఉన్న ఫాలోయింగ్ ని వాడుకుని త్వరగా పైకి ఎక్కొచ్చని ప్లాన్ చేసుకుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దానికి భిన్నంగా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇతని మొదటి ప్రాజెక్టుని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు అధికారికంగా అగ్రిమెంట్ చేసుకుని ఆ కంపెనీ అధినేత సుభాస్కరన్ చేతుల మీదుగా ఒప్పందాల మీద సంతకాలు చేసుకుని ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టేశారు.
ఈ అనూహ్య నిర్ణయం పట్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నా జేసన్ సంజయ్ తన తాత ఎస్ఏ చంద్రశేఖర్ అడుగుజాడల్లో నడవాలనుకున్న విషయం అర్థమైపోయింది. ఆయన తమిళ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారు. చిరంజీవికి మంచి హిట్ మూవీగా నిలిచిన చట్టానికి కళ్ళు లేవు విజయ్ తండ్రిదే. రిటైర్ అయ్యేనాటికి కొడుకుని ఇండస్ట్రీలో సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు. పెద్ద బ్యానర్లతో మాట్లాడి మంచి కాంబినేషన్లు వచ్చేలా చూసుకున్నారు. కొంత కాలం తర్వాత వరస సక్సెస్ లు వచ్చి విజయ్ కోలీవుడ్ లోనే అతి పెద్ద స్టార్ గా ఎదిగి వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్నాడు.
షారుఖ్ ఖాన్ కొడుకు సైతం ఇదే తరహాలో ముందు డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జేసన్ సంజయ్ అదే బాట పట్టడం విశేషం. వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల వైపు వస్తున్నాడనే ప్రచారం నేపథ్యంలో అభిమానులు సంజయ్ ని తెరమీద చూసుకోవచ్చని ఎదురు చూశారు. కానీ ఈలోగా ట్విస్టు వచ్చింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ప్రూవ్ చేసుకున్నాకే హీరో కావాలా వద్దాని అతను డిసైడ్ అవుతాడట. హీరోగా ధృవ్ విక్రమ్, హీరోయిన్ గా అదితి శంకర్, సంగీత దర్శకుడిగా అమీన్ ని లాక్ చేసుకున్నారని లేటెస్ట్ అప్డేట్.
This post was last modified on August 28, 2023 6:50 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…