మాములుగా స్టార్ హీరోల వారసులు నటన వైపే మొగ్గు చూపుతారు. తండ్రి నడిచిన బాటలో రెడీ మేడ్ గా ఉన్న ఫాలోయింగ్ ని వాడుకుని త్వరగా పైకి ఎక్కొచ్చని ప్లాన్ చేసుకుంటారు. కానీ కోలీవుడ్ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దానికి భిన్నంగా దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇతని మొదటి ప్రాజెక్టుని సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు అధికారికంగా అగ్రిమెంట్ చేసుకుని ఆ కంపెనీ అధినేత సుభాస్కరన్ చేతుల మీదుగా ఒప్పందాల మీద సంతకాలు చేసుకుని ఫోటో కూడా సోషల్ మీడియాలో పెట్టేశారు.
ఈ అనూహ్య నిర్ణయం పట్ల ఫ్యాన్స్ షాక్ అవుతున్నా జేసన్ సంజయ్ తన తాత ఎస్ఏ చంద్రశేఖర్ అడుగుజాడల్లో నడవాలనుకున్న విషయం అర్థమైపోయింది. ఆయన తమిళ తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారు. చిరంజీవికి మంచి హిట్ మూవీగా నిలిచిన చట్టానికి కళ్ళు లేవు విజయ్ తండ్రిదే. రిటైర్ అయ్యేనాటికి కొడుకుని ఇండస్ట్రీలో సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు. పెద్ద బ్యానర్లతో మాట్లాడి మంచి కాంబినేషన్లు వచ్చేలా చూసుకున్నారు. కొంత కాలం తర్వాత వరస సక్సెస్ లు వచ్చి విజయ్ కోలీవుడ్ లోనే అతి పెద్ద స్టార్ గా ఎదిగి వందల కోట్ల మార్కెట్ సంపాదించుకున్నాడు.
షారుఖ్ ఖాన్ కొడుకు సైతం ఇదే తరహాలో ముందు డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జేసన్ సంజయ్ అదే బాట పట్టడం విశేషం. వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాల వైపు వస్తున్నాడనే ప్రచారం నేపథ్యంలో అభిమానులు సంజయ్ ని తెరమీద చూసుకోవచ్చని ఎదురు చూశారు. కానీ ఈలోగా ట్విస్టు వచ్చింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో ప్రూవ్ చేసుకున్నాకే హీరో కావాలా వద్దాని అతను డిసైడ్ అవుతాడట. హీరోగా ధృవ్ విక్రమ్, హీరోయిన్ గా అదితి శంకర్, సంగీత దర్శకుడిగా అమీన్ ని లాక్ చేసుకున్నారని లేటెస్ట్ అప్డేట్.
This post was last modified on August 28, 2023 6:50 pm
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…