ఎన్ని వందల కోట్లతో సినిమా తీసినా, ఎంత మంచి కంటెంట్ పెట్టినా ఈ రోజుల్లో హైప్ లేనిదే పెద్ద స్టార్ హీరో అయినా సరే ఓపెనింగ్స్ రావడం కష్టం. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం పబ్లిసిటీకే కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళను అన్ని భాషల్లోనూ చూడొచ్చు. కానీ ఉపేంద్ర మాత్రం నా రూటే వేరు అంటున్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో నామం సింబల్ తో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఏం అనాలో అర్థం కాక UI అని వ్యహరిస్తున్నారు. ఏడాదికి పైగా ఇది షూటింగ్ లోనే ఉంది. ఇప్పుడు చివరి దశకు వచ్చింది.
ఈ UIని ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే అభిమానులు ఎంత డిమాండ్ చేస్తున్నా ఇప్పటిదాకా ఒక టీజర్ కూడా రిలీజ్ చేయలేదు ఉపేంద్ర. నిర్మాతలు ఏదో ఒకటి చేస్తే హైప్ వస్తుందని అడిగితే అదేమీ అక్కర్లేదని అంటున్నారు. అబద్దాలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ కావాలి కానీ నిజాలకు అవసరం లేదని, అంతగా కావాలనిపిస్తే విడుదల తేదీ ప్రకటించుకోమని తేల్చి చెప్పేశారు. దీంతో అవాక్కయిన ప్రొడ్యూసర్లు చేసేదేమి లేక సరేనన్నారు. ఈ మొత్తం వీడియో కన్నడ బాషలో రూపొంది యూట్యూబ్ లో ఆల్రెడీ తిరిగేస్తోంది.
A, ఓం నుంచే దర్శకుడిగా తన విలక్షణ శైలిని బయట పెడుతూ వచ్చిన ఉపేంద్ర ఈ UI అన్నింటి కన్నా చాలా టఫ్ గా ఉంటుందని అంటున్నారు. ఆ మధ్య కబ్జా ప్రెస్ మీట్ లో ఓ తెలుగు ఫ్యాన్ ఏదైనా చెప్పమని అడిగితే, తన కొత్త సినిమాని అర్థం చేసుకుంటే చాలు మీలో గొప్ప జ్ఞాని ఉన్నాడని అర్థం చేసుకోవచ్చని చెప్పి షాక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ కాంటెంపరరీ సబ్జెక్టుతో రూపొందుతున్న UIలో ఇతర క్యాస్టింగ్ గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా ఉపేంద్ర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెజిఎఫ్, కాంతార రేంజ్ లో దీనికి అంచనాలు ఉంటాయని శాండల్ వుడ్ విశ్లేషకులు ఆశిస్తున్నారు.
This post was last modified on August 28, 2023 6:38 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…