Movie News

సినిమాకు పబ్లిసిటీ ఎందుకన్న ఉపేంద్ర

ఎన్ని వందల కోట్లతో సినిమా తీసినా, ఎంత మంచి కంటెంట్ పెట్టినా ఈ రోజుల్లో హైప్ లేనిదే పెద్ద స్టార్ హీరో అయినా సరే ఓపెనింగ్స్ రావడం కష్టం. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం పబ్లిసిటీకే కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళను అన్ని భాషల్లోనూ చూడొచ్చు. కానీ ఉపేంద్ర మాత్రం నా రూటే వేరు అంటున్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో నామం సింబల్ తో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఏం అనాలో అర్థం కాక UI అని వ్యహరిస్తున్నారు. ఏడాదికి పైగా ఇది షూటింగ్ లోనే ఉంది. ఇప్పుడు చివరి దశకు వచ్చింది.

ఈ UIని ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే అభిమానులు ఎంత డిమాండ్ చేస్తున్నా ఇప్పటిదాకా ఒక టీజర్ కూడా రిలీజ్ చేయలేదు ఉపేంద్ర. నిర్మాతలు ఏదో ఒకటి చేస్తే హైప్ వస్తుందని అడిగితే అదేమీ అక్కర్లేదని అంటున్నారు. అబద్దాలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ కావాలి కానీ నిజాలకు అవసరం లేదని, అంతగా కావాలనిపిస్తే విడుదల తేదీ ప్రకటించుకోమని తేల్చి చెప్పేశారు. దీంతో అవాక్కయిన ప్రొడ్యూసర్లు చేసేదేమి లేక సరేనన్నారు. ఈ మొత్తం వీడియో కన్నడ బాషలో రూపొంది యూట్యూబ్ లో ఆల్రెడీ తిరిగేస్తోంది.

A, ఓం నుంచే దర్శకుడిగా తన విలక్షణ శైలిని బయట పెడుతూ వచ్చిన ఉపేంద్ర ఈ UI అన్నింటి కన్నా చాలా టఫ్ గా ఉంటుందని అంటున్నారు. ఆ మధ్య కబ్జా ప్రెస్ మీట్ లో ఓ తెలుగు ఫ్యాన్ ఏదైనా చెప్పమని అడిగితే, తన కొత్త సినిమాని అర్థం చేసుకుంటే చాలు మీలో గొప్ప జ్ఞాని ఉన్నాడని అర్థం చేసుకోవచ్చని చెప్పి షాక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ కాంటెంపరరీ సబ్జెక్టుతో రూపొందుతున్న UIలో ఇతర క్యాస్టింగ్ గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా ఉపేంద్ర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెజిఎఫ్, కాంతార రేంజ్ లో దీనికి అంచనాలు ఉంటాయని శాండల్ వుడ్ విశ్లేషకులు ఆశిస్తున్నారు.


This post was last modified on August 28, 2023 6:38 pm

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

1 hour ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

1 hour ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

2 hours ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

2 hours ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

4 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

4 hours ago