ఎన్ని వందల కోట్లతో సినిమా తీసినా, ఎంత మంచి కంటెంట్ పెట్టినా ఈ రోజుల్లో హైప్ లేనిదే పెద్ద స్టార్ హీరో అయినా సరే ఓపెనింగ్స్ రావడం కష్టం. అందుకే ఈ విషయంలో నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేవలం పబ్లిసిటీకే కోట్లు ఖర్చు పెడుతున్న వాళ్ళను అన్ని భాషల్లోనూ చూడొచ్చు. కానీ ఉపేంద్ర మాత్రం నా రూటే వేరు అంటున్నారు. ఈయన స్వీయ దర్శకత్వంలో నామం సింబల్ తో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఏం అనాలో అర్థం కాక UI అని వ్యహరిస్తున్నారు. ఏడాదికి పైగా ఇది షూటింగ్ లోనే ఉంది. ఇప్పుడు చివరి దశకు వచ్చింది.
ఈ UIని ప్యాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. అయితే అభిమానులు ఎంత డిమాండ్ చేస్తున్నా ఇప్పటిదాకా ఒక టీజర్ కూడా రిలీజ్ చేయలేదు ఉపేంద్ర. నిర్మాతలు ఏదో ఒకటి చేస్తే హైప్ వస్తుందని అడిగితే అదేమీ అక్కర్లేదని అంటున్నారు. అబద్దాలు అమ్ముకోవడానికి మార్కెటింగ్ కావాలి కానీ నిజాలకు అవసరం లేదని, అంతగా కావాలనిపిస్తే విడుదల తేదీ ప్రకటించుకోమని తేల్చి చెప్పేశారు. దీంతో అవాక్కయిన ప్రొడ్యూసర్లు చేసేదేమి లేక సరేనన్నారు. ఈ మొత్తం వీడియో కన్నడ బాషలో రూపొంది యూట్యూబ్ లో ఆల్రెడీ తిరిగేస్తోంది.
A, ఓం నుంచే దర్శకుడిగా తన విలక్షణ శైలిని బయట పెడుతూ వచ్చిన ఉపేంద్ర ఈ UI అన్నింటి కన్నా చాలా టఫ్ గా ఉంటుందని అంటున్నారు. ఆ మధ్య కబ్జా ప్రెస్ మీట్ లో ఓ తెలుగు ఫ్యాన్ ఏదైనా చెప్పమని అడిగితే, తన కొత్త సినిమాని అర్థం చేసుకుంటే చాలు మీలో గొప్ప జ్ఞాని ఉన్నాడని అర్థం చేసుకోవచ్చని చెప్పి షాక్ ఇచ్చారు. చాలా డిఫరెంట్ కాంటెంపరరీ సబ్జెక్టుతో రూపొందుతున్న UIలో ఇతర క్యాస్టింగ్ గురించి ఎలాంటి లీక్స్ బయటికి రాకుండా ఉపేంద్ర అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెజిఎఫ్, కాంతార రేంజ్ లో దీనికి అంచనాలు ఉంటాయని శాండల్ వుడ్ విశ్లేషకులు ఆశిస్తున్నారు.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…