రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఫీలయ్యే సినిమా ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ రీమేక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అప్పట్లో మంచి విజయం నమోదు చేసుకుంది. డిసెంబర్ సెంటిమెంట్ కి ఎదురీది మరీ హిట్టు కొట్టింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు దాటేసింది. ఒరిజినల్ వెర్షన్ జయం రవి హీరోగా 2015లో వచ్చింది. ధృవ 2కి కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు సృష్టికర్త మోహన్ రాజా దీని సీక్వెల్ కోసం చేసిన కసరత్తు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి ఇవాళ అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు.
ఇక్కడే ఉంది అసలు మతలబు. అనౌన్స్ మెంట్ వస్తోంది తమిళ కొనసాగింపు గురించి. ఈ రోజు చెన్నైలోని ఏజిఎస్ థియేటర్ లో తని ఒరువన్ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు . అందులోనే 2కి సంబంధించిన వీడియో టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. దర్శకుడిగా మోహన్ రాజానే వ్యవహరిస్తారు. అక్కడ తీస్తున్నారంటే సహజంగా ఇక్కడ రామ్ చరణ్ తోనూ చర్చలు జరిగే ఉంటాయి. చిరంజీవితో గాడ్ ఫాదర్ చేస్తున్న టైంలో మోహన్ రాజా మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్ అయ్యారు. ఆ సందర్భంగానే తనకు చరణ్ కు మధ్య ధృవ 2కి సంబంధించిన చర్చలు జరిగాయి.
కథ పూర్తికాగానే చెప్తానని అన్నారట. సో ఇప్పుడు కన్ఫర్మ్ గా సిద్ధమయ్యింది కాబట్టి శంకర్, బుచ్చిబాబుల సినిమాల తర్వాత రామ్ చరణ్ ధృవ 2 చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఛాన్స్ సూరికి కాకుండా నేరుగా మోహన్ రాజాకే ఇవ్వొచ్చు. షూటింగ్ వివరాలు, విడుదల ఎప్పుడు ఉండొచ్చు లాంటి వివరాలేమీ ఇంకా తెలియలేదు. ఫస్ట్ టీమ్ నే దాదాపు కొనసాగించబోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత జయం రవి మార్కెట్ పెరగడంతో తని ఒరువన్ 2కి అది కూడా ప్లస్ కానుంది. ధృవ 2 నిజంగా డిసైడ్ అయితే మాత్రం లేట్ చేయకుండా వీలైనంత త్వరగా కమిటవ్వడం బెటర్. సమాంతరంగా చేస్తే ఇంకా మంచిది.
This post was last modified on August 28, 2023 2:44 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…