Movie News

ధృవ 2 స్క్రిప్ట్ సిద్ధం చేసిన దర్శకుడు

రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఫీలయ్యే సినిమా ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ రీమేక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అప్పట్లో మంచి విజయం నమోదు చేసుకుంది. డిసెంబర్ సెంటిమెంట్ కి ఎదురీది మరీ హిట్టు కొట్టింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు దాటేసింది. ఒరిజినల్ వెర్షన్ జయం రవి హీరోగా 2015లో వచ్చింది. ధృవ 2కి కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు సృష్టికర్త మోహన్ రాజా దీని సీక్వెల్ కోసం చేసిన కసరత్తు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి ఇవాళ అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు.

ఇక్కడే ఉంది అసలు మతలబు. అనౌన్స్ మెంట్ వస్తోంది తమిళ కొనసాగింపు గురించి. ఈ రోజు చెన్నైలోని ఏజిఎస్ థియేటర్ లో తని ఒరువన్ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు . అందులోనే 2కి సంబంధించిన వీడియో టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. దర్శకుడిగా మోహన్ రాజానే వ్యవహరిస్తారు. అక్కడ తీస్తున్నారంటే సహజంగా ఇక్కడ రామ్ చరణ్ తోనూ చర్చలు జరిగే ఉంటాయి. చిరంజీవితో గాడ్ ఫాదర్ చేస్తున్న టైంలో మోహన్ రాజా మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్ అయ్యారు. ఆ సందర్భంగానే తనకు చరణ్ కు మధ్య ధృవ 2కి సంబంధించిన చర్చలు జరిగాయి.

కథ పూర్తికాగానే చెప్తానని అన్నారట. సో ఇప్పుడు కన్ఫర్మ్ గా సిద్ధమయ్యింది కాబట్టి శంకర్, బుచ్చిబాబుల సినిమాల తర్వాత రామ్ చరణ్ ధృవ 2 చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఛాన్స్ సూరికి కాకుండా నేరుగా మోహన్ రాజాకే ఇవ్వొచ్చు. షూటింగ్ వివరాలు, విడుదల ఎప్పుడు ఉండొచ్చు లాంటి వివరాలేమీ ఇంకా తెలియలేదు. ఫస్ట్ టీమ్ నే దాదాపు కొనసాగించబోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత జయం రవి మార్కెట్ పెరగడంతో తని ఒరువన్ 2కి అది కూడా ప్లస్ కానుంది. ధృవ 2 నిజంగా డిసైడ్ అయితే మాత్రం లేట్ చేయకుండా వీలైనంత త్వరగా కమిటవ్వడం బెటర్. సమాంతరంగా చేస్తే ఇంకా మంచిది.

This post was last modified on August 28, 2023 2:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగువారి మ‌న‌సు దోచిన‌ దురంధ‌ర్

రెండు నెల‌ల కింద‌ట రిలీజైన దురంధ‌ర్ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవ‌లం…

1 hour ago

యాటిట్యూడ్ స్టార్ కాన్ఫిడెన్స్ త‌గ్గ‌లేదు

బుల్లితెర‌పై ఘ‌న చ‌రిత్ర ఉన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ న‌ట‌ వార‌స‌త్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్ర‌హాస్.. త‌న…

5 hours ago

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

6 hours ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

7 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

7 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

8 hours ago