రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ మూవీస్ లో ఒకటిగా ఫీలయ్యే సినిమా ధృవ. తమిళ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ రీమేక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అప్పట్లో మంచి విజయం నమోదు చేసుకుంది. డిసెంబర్ సెంటిమెంట్ కి ఎదురీది మరీ హిట్టు కొట్టింది. ఇది జరిగి ఎనిమిదేళ్లు దాటేసింది. ఒరిజినల్ వెర్షన్ జయం రవి హీరోగా 2015లో వచ్చింది. ధృవ 2కి కొనసాగింపు కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే అసలు సృష్టికర్త మోహన్ రాజా దీని సీక్వెల్ కోసం చేసిన కసరత్తు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి ఇవాళ అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు.
ఇక్కడే ఉంది అసలు మతలబు. అనౌన్స్ మెంట్ వస్తోంది తమిళ కొనసాగింపు గురించి. ఈ రోజు చెన్నైలోని ఏజిఎస్ థియేటర్ లో తని ఒరువన్ స్పెషల్ స్క్రీనింగ్ వేస్తున్నారు . అందులోనే 2కి సంబంధించిన వీడియో టీజర్ ని లాంచ్ చేయబోతున్నారు. దర్శకుడిగా మోహన్ రాజానే వ్యవహరిస్తారు. అక్కడ తీస్తున్నారంటే సహజంగా ఇక్కడ రామ్ చరణ్ తోనూ చర్చలు జరిగే ఉంటాయి. చిరంజీవితో గాడ్ ఫాదర్ చేస్తున్న టైంలో మోహన్ రాజా మెగా ఫ్యామిలీతో చాలా క్లోజ్ అయ్యారు. ఆ సందర్భంగానే తనకు చరణ్ కు మధ్య ధృవ 2కి సంబంధించిన చర్చలు జరిగాయి.
కథ పూర్తికాగానే చెప్తానని అన్నారట. సో ఇప్పుడు కన్ఫర్మ్ గా సిద్ధమయ్యింది కాబట్టి శంకర్, బుచ్చిబాబుల సినిమాల తర్వాత రామ్ చరణ్ ధృవ 2 చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఛాన్స్ సూరికి కాకుండా నేరుగా మోహన్ రాజాకే ఇవ్వొచ్చు. షూటింగ్ వివరాలు, విడుదల ఎప్పుడు ఉండొచ్చు లాంటి వివరాలేమీ ఇంకా తెలియలేదు. ఫస్ట్ టీమ్ నే దాదాపు కొనసాగించబోతున్నారు. పొన్నియిన్ సెల్వన్ తర్వాత జయం రవి మార్కెట్ పెరగడంతో తని ఒరువన్ 2కి అది కూడా ప్లస్ కానుంది. ధృవ 2 నిజంగా డిసైడ్ అయితే మాత్రం లేట్ చేయకుండా వీలైనంత త్వరగా కమిటవ్వడం బెటర్. సమాంతరంగా చేస్తే ఇంకా మంచిది.
This post was last modified on August 28, 2023 2:44 pm
టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ నుంచి వస్తున్న అఖండ 2 తాండవం కౌంట్ డౌన్ రోజుల నుంచి గంటల్లోకి…
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…