దసరా, విరూపాక్ష, బలగం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లు ఈ ఏడాదే వచ్చాయన్న ఆనందం ఉంది కానీ మరోపక్క చాలా దారుణమైన డిజాస్టర్లు వరసపెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి పరిస్థితి ఎంత దారుణమంటే మొదటి వీకెండ్ లోనే బోల్తా కొట్టేసి కనీసం సగం థియేటర్ కూడా నింపలేనంత వీక్ గా పల్టీ కొట్టాయి. మొన్నొచ్చిన ‘గాండీవధారి అర్జున’తో వరుణ్ తేజ్ కు మరో మర్చిపోలేని పరాజయం ఖాతాలో పడింది. దీనికన్నా ముందు పెదనాన్న ‘భోళా శంకర్’ ఇంకా అన్యాయంగా టపా కట్టింది. రెండో వారంలోపే గల్లంతయ్యే రేంజ్ లో మెగాస్టార్ ని అవమానం పాలు చేసింది.
‘శాకుంతలం’తో దిల్ రాజు, గుణశేఖర్ లు ఎంత నష్టపోయారో వాళ్ళిద్దరికే తెలిసిన రహస్యం. మాస్ రాజా బ్రాండ్ ఒకటే సరిపోదని ‘రావణాసుర’ ఫలితం ఋజువు చేసింది. ‘ఏజెంట్’ ఏకంగా ఓటిటిలో రావడానికి కూడా జంకేంత ఘోరంగా పోయింది. కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సైతం బ్రేక్ ఈవెన్ లో సగాన్ని టచ్ చేయలేకపోయింది. నాగ చైతన్య కస్టడీ, గోపీచంద్ రామబాణం, నిఖిల్ స్పై, సందీప్ కిషన్ మైఖేల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది. బ్రో ఏదో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ పుణ్యామాని లాస్ తగ్గించుకుందే తప్ప హిట్టు ముద్ర వేయించుకోని మాట వాస్తవం.
ఇవన్నీ హీరోలు లేదా దర్శకుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బ తిన్నవే. మొత్తం కలుపుకుంటే డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి కలిగిన నష్టం ఎంత లేదన్నా మూడు వందల కోట్లు దాటేసింది. వీటిలో కొన్నింటికి కనీసం డిజిటల్, శాటిలైట్ బిజినెస్ కూడా జరగలేదు. పరిస్థితి అంత అన్యాయంగా ఉంది. ఇంతకు ముందులా డబ్బింగులు కాపాడేస్తాయనే రోజులు పోయాయి. టీవీ ఛానల్స్ కొనడం తగ్గించి ఆ పెట్టుబడులు సీరియల్స్ మీద పెడుతున్నాయి. ప్రాక్టికల్ గా ఆలోచించకుండా కేవలం హంగులనే నమ్ముకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పైన సినిమాలు ప్రత్యక్షంగా నిరూపించాయి. నేర్చుకోవడమే బాకీ.
This post was last modified on August 27, 2023 5:35 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…