దసరా, విరూపాక్ష, బలగం, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లు ఈ ఏడాదే వచ్చాయన్న ఆనందం ఉంది కానీ మరోపక్క చాలా దారుణమైన డిజాస్టర్లు వరసపెట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి పరిస్థితి ఎంత దారుణమంటే మొదటి వీకెండ్ లోనే బోల్తా కొట్టేసి కనీసం సగం థియేటర్ కూడా నింపలేనంత వీక్ గా పల్టీ కొట్టాయి. మొన్నొచ్చిన ‘గాండీవధారి అర్జున’తో వరుణ్ తేజ్ కు మరో మర్చిపోలేని పరాజయం ఖాతాలో పడింది. దీనికన్నా ముందు పెదనాన్న ‘భోళా శంకర్’ ఇంకా అన్యాయంగా టపా కట్టింది. రెండో వారంలోపే గల్లంతయ్యే రేంజ్ లో మెగాస్టార్ ని అవమానం పాలు చేసింది.
‘శాకుంతలం’తో దిల్ రాజు, గుణశేఖర్ లు ఎంత నష్టపోయారో వాళ్ళిద్దరికే తెలిసిన రహస్యం. మాస్ రాజా బ్రాండ్ ఒకటే సరిపోదని ‘రావణాసుర’ ఫలితం ఋజువు చేసింది. ‘ఏజెంట్’ ఏకంగా ఓటిటిలో రావడానికి కూడా జంకేంత ఘోరంగా పోయింది. కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సైతం బ్రేక్ ఈవెన్ లో సగాన్ని టచ్ చేయలేకపోయింది. నాగ చైతన్య కస్టడీ, గోపీచంద్ రామబాణం, నిఖిల్ స్పై, సందీప్ కిషన్ మైఖేల్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే అవుతుంది. బ్రో ఏదో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ పుణ్యామాని లాస్ తగ్గించుకుందే తప్ప హిట్టు ముద్ర వేయించుకోని మాట వాస్తవం.
ఇవన్నీ హీరోలు లేదా దర్శకుల ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బ తిన్నవే. మొత్తం కలుపుకుంటే డిస్ట్రిబ్యూటర్ల వైపు నుంచి కలిగిన నష్టం ఎంత లేదన్నా మూడు వందల కోట్లు దాటేసింది. వీటిలో కొన్నింటికి కనీసం డిజిటల్, శాటిలైట్ బిజినెస్ కూడా జరగలేదు. పరిస్థితి అంత అన్యాయంగా ఉంది. ఇంతకు ముందులా డబ్బింగులు కాపాడేస్తాయనే రోజులు పోయాయి. టీవీ ఛానల్స్ కొనడం తగ్గించి ఆ పెట్టుబడులు సీరియల్స్ మీద పెడుతున్నాయి. ప్రాక్టికల్ గా ఆలోచించకుండా కేవలం హంగులనే నమ్ముకుంటే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో పైన సినిమాలు ప్రత్యక్షంగా నిరూపించాయి. నేర్చుకోవడమే బాకీ.
This post was last modified on August 27, 2023 5:35 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…