అదేంటి కలిసి నటించని వీళ్లిద్దరికీ లింక్ ఏంటనుకుంటున్నారా. అక్కడే ఉంది మతలబు. శ్రీలీల ఇండస్ట్రీకి రాక ముందు నుంచే యష్ భార్య రాధికా పండిట్ కుటుంబంతో స్నేహం ఉంది. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్లని కూడా కొందరు పొరపడుతూ ఉంటారు. రాధికా రెండు డెలివరీలు శ్రీలీల తల్లే చేయడం వల్ల వీళ్ళ ఫ్రెండ్ షిప్ బలపడింది. కెజిఎఫ్ కెమెరామెన్ భువన గౌడ శ్రీలీల ఫ్యామిలీకి స్నేహితుడు కావడంతో ఆమె పది తరగతి వయసులో ఒక ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవకాశాలు మొదలయ్యాయి. కిస్ రూపంలో ఫస్ట్ ఆఫర్ తలుపు తట్టింది.
యష్, రాధికా ఇద్దరూ శ్రీలీలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా ఈ బాండింగ్ బలపడింది. రాఖీ భాయ్ ని జీజూ అని పిలవడం టాలీవుడ్ టాప్ చైర్ కు పోటీ పడుతున్న ఫ్యూచర్ డాక్టర్ అలవాటు. నిజానికి హలో గురు ప్రేమ కోసమే సినిమాకే శ్రీలీలని దర్శకుడు త్రినాథరావు నక్కిన అడిగారు. కానీ అప్పుడు కుదరలేదు. కట్ చేస్తే అదే డైరెక్టర్ తో ధమాకా పెద్ద బ్రేక్ గా నిలిచింది. ఆ తర్వాత రామ్ తో మిస్ చేసుకున్న ఛాన్స్ స్కంద రూపంలో నెరవేరింది. లింకులన్నీ కలిసి వచ్చినట్టు ఇలా ఇండస్ట్రీకి రావడానికి శ్రీలీల వెనుక ఎన్నో అడుగులు ఉన్నాయి.
ఈ ముచ్చట్లన్నీ ఓ పత్రికతో పంచుకున్న శ్రీలీల ప్రస్తుతం కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తోంది. స్కందతో పాటు భగవంత్ కేసరి, ఆదికేశవ అన్నీ తక్కువ గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం మీద ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. డిసెంబర్ లో నితిన్ తో జోడికట్టిన ఎక్స్ ట్రాడినరి మెన్ రిలీజ్ కానుంది. త్వరలో ఎంబిబిఎస్ పరీక్షల కోసం షూటింగుల కోసం బ్రేక్ తీసుకోబోతున్న శ్రీలీలతో చివరి స్టేజిలో బ్యాలన్స్ ఉన్న దర్శకులందరూ ఫాస్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. ఇవి కాకుండా అమ్మడి చేతిలో ఇంకో అరడజను ప్రాజెక్టులున్నాయి.
This post was last modified on August 27, 2023 5:13 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…