అదేంటి కలిసి నటించని వీళ్లిద్దరికీ లింక్ ఏంటనుకుంటున్నారా. అక్కడే ఉంది మతలబు. శ్రీలీల ఇండస్ట్రీకి రాక ముందు నుంచే యష్ భార్య రాధికా పండిట్ కుటుంబంతో స్నేహం ఉంది. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్లని కూడా కొందరు పొరపడుతూ ఉంటారు. రాధికా రెండు డెలివరీలు శ్రీలీల తల్లే చేయడం వల్ల వీళ్ళ ఫ్రెండ్ షిప్ బలపడింది. కెజిఎఫ్ కెమెరామెన్ భువన గౌడ శ్రీలీల ఫ్యామిలీకి స్నేహితుడు కావడంతో ఆమె పది తరగతి వయసులో ఒక ఫోటో షూట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవకాశాలు మొదలయ్యాయి. కిస్ రూపంలో ఫస్ట్ ఆఫర్ తలుపు తట్టింది.
యష్, రాధికా ఇద్దరూ శ్రీలీలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అలా ఈ బాండింగ్ బలపడింది. రాఖీ భాయ్ ని జీజూ అని పిలవడం టాలీవుడ్ టాప్ చైర్ కు పోటీ పడుతున్న ఫ్యూచర్ డాక్టర్ అలవాటు. నిజానికి హలో గురు ప్రేమ కోసమే సినిమాకే శ్రీలీలని దర్శకుడు త్రినాథరావు నక్కిన అడిగారు. కానీ అప్పుడు కుదరలేదు. కట్ చేస్తే అదే డైరెక్టర్ తో ధమాకా పెద్ద బ్రేక్ గా నిలిచింది. ఆ తర్వాత రామ్ తో మిస్ చేసుకున్న ఛాన్స్ స్కంద రూపంలో నెరవేరింది. లింకులన్నీ కలిసి వచ్చినట్టు ఇలా ఇండస్ట్రీకి రావడానికి శ్రీలీల వెనుక ఎన్నో అడుగులు ఉన్నాయి.
ఈ ముచ్చట్లన్నీ ఓ పత్రికతో పంచుకున్న శ్రీలీల ప్రస్తుతం కొత్త రిలీజుల కోసం ఎదురు చూస్తోంది. స్కందతో పాటు భగవంత్ కేసరి, ఆదికేశవ అన్నీ తక్కువ గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం మీద ఎలాంటి అంచనాలున్నాయో తెలిసిందే. డిసెంబర్ లో నితిన్ తో జోడికట్టిన ఎక్స్ ట్రాడినరి మెన్ రిలీజ్ కానుంది. త్వరలో ఎంబిబిఎస్ పరీక్షల కోసం షూటింగుల కోసం బ్రేక్ తీసుకోబోతున్న శ్రీలీలతో చివరి స్టేజిలో బ్యాలన్స్ ఉన్న దర్శకులందరూ ఫాస్ట్ ప్లానింగ్ లో ఉన్నారు. ఇవి కాకుండా అమ్మడి చేతిలో ఇంకో అరడజను ప్రాజెక్టులున్నాయి.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…