పుష్ప సినిమా రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి చిత్ర బృందం కంగారు పడే ఉంటుంది. సుకుమార్ చివరి సినిమా రంగస్థలంతో పోల్చి చూసుకుని ఈ సినిమా పట్ల పెదవి విరిచారు చాలామంది. రివ్యూలు, రేటింగ్స్ అన్నీ యావరేజ్ అన్నట్లే ఉన్నాయి. టాక్ కూడా డివైడ్గానే వచ్చింది. దీంతో రిజల్ట్ తేడా కొడుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ ఆ టాక్ను తట్టుకుని సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే కరోనా ప్రభావం, ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల అంతిమంగా సంతృప్తికర ఫలితం మాత్రం రాలేదు.
కానీ పుష్ప ఇతర భాషల్లో అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా పెద్ద బ్లాక్బస్టరే అయింది. రిలీజ్ తర్వాత ఒక యుఫోరియా సృష్టించింది. అది పుష్ప-2కు బాగా కలిసొచ్చింది. పుష్ప పాటలు.. హీరో డైలాగులు, మేనరిజమ్స్ అన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. దీంతో సినిమా షూట్ మొదలు కావడానికి ముందే హైప్ వచ్చేసింది.. ఆ హైప్ ఇప్పుడు ఇంకా పెరిగిపోయి పుష్ప-2 విడుదలకు ముందే ప్రకంపనలు రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జాతీయ అవార్డుల్లో పుష్ప సినిమాకు రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు గెలిచాడు. దీంతో పుష్ప గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా మీద అంచనాలను ఇది మరింత పెంచే పరిణామమే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో అంచనాల ఒత్తడి చిత్ర బృందానికి ఇబ్బందికరం కూడా. అసలే సుకుమార్ సినిమాను మామూలుగా చెక్కట్లేదని అంటున్నారు. ఇప్పుడు అంచనాలు ఇంకా పెరిగిపోవడంతో ఆయన పర్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుందేమో. రిలీజ్ కూడా ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 26, 2023 5:43 pm
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…