పుష్ప సినిమా రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి చిత్ర బృందం కంగారు పడే ఉంటుంది. సుకుమార్ చివరి సినిమా రంగస్థలంతో పోల్చి చూసుకుని ఈ సినిమా పట్ల పెదవి విరిచారు చాలామంది. రివ్యూలు, రేటింగ్స్ అన్నీ యావరేజ్ అన్నట్లే ఉన్నాయి. టాక్ కూడా డివైడ్గానే వచ్చింది. దీంతో రిజల్ట్ తేడా కొడుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ ఆ టాక్ను తట్టుకుని సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే కరోనా ప్రభావం, ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల అంతిమంగా సంతృప్తికర ఫలితం మాత్రం రాలేదు.
కానీ పుష్ప ఇతర భాషల్లో అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా పెద్ద బ్లాక్బస్టరే అయింది. రిలీజ్ తర్వాత ఒక యుఫోరియా సృష్టించింది. అది పుష్ప-2కు బాగా కలిసొచ్చింది. పుష్ప పాటలు.. హీరో డైలాగులు, మేనరిజమ్స్ అన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. దీంతో సినిమా షూట్ మొదలు కావడానికి ముందే హైప్ వచ్చేసింది.. ఆ హైప్ ఇప్పుడు ఇంకా పెరిగిపోయి పుష్ప-2 విడుదలకు ముందే ప్రకంపనలు రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జాతీయ అవార్డుల్లో పుష్ప సినిమాకు రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు గెలిచాడు. దీంతో పుష్ప గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా మీద అంచనాలను ఇది మరింత పెంచే పరిణామమే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో అంచనాల ఒత్తడి చిత్ర బృందానికి ఇబ్బందికరం కూడా. అసలే సుకుమార్ సినిమాను మామూలుగా చెక్కట్లేదని అంటున్నారు. ఇప్పుడు అంచనాలు ఇంకా పెరిగిపోవడంతో ఆయన పర్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుందేమో. రిలీజ్ కూడా ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 26, 2023 5:43 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…