పుష్ప సినిమా రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి చిత్ర బృందం కంగారు పడే ఉంటుంది. సుకుమార్ చివరి సినిమా రంగస్థలంతో పోల్చి చూసుకుని ఈ సినిమా పట్ల పెదవి విరిచారు చాలామంది. రివ్యూలు, రేటింగ్స్ అన్నీ యావరేజ్ అన్నట్లే ఉన్నాయి. టాక్ కూడా డివైడ్గానే వచ్చింది. దీంతో రిజల్ట్ తేడా కొడుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ ఆ టాక్ను తట్టుకుని సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే కరోనా ప్రభావం, ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల అంతిమంగా సంతృప్తికర ఫలితం మాత్రం రాలేదు.
కానీ పుష్ప ఇతర భాషల్లో అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా పెద్ద బ్లాక్బస్టరే అయింది. రిలీజ్ తర్వాత ఒక యుఫోరియా సృష్టించింది. అది పుష్ప-2కు బాగా కలిసొచ్చింది. పుష్ప పాటలు.. హీరో డైలాగులు, మేనరిజమ్స్ అన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. దీంతో సినిమా షూట్ మొదలు కావడానికి ముందే హైప్ వచ్చేసింది.. ఆ హైప్ ఇప్పుడు ఇంకా పెరిగిపోయి పుష్ప-2 విడుదలకు ముందే ప్రకంపనలు రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జాతీయ అవార్డుల్లో పుష్ప సినిమాకు రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు గెలిచాడు. దీంతో పుష్ప గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా మీద అంచనాలను ఇది మరింత పెంచే పరిణామమే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో అంచనాల ఒత్తడి చిత్ర బృందానికి ఇబ్బందికరం కూడా. అసలే సుకుమార్ సినిమాను మామూలుగా చెక్కట్లేదని అంటున్నారు. ఇప్పుడు అంచనాలు ఇంకా పెరిగిపోవడంతో ఆయన పర్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుందేమో. రిలీజ్ కూడా ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 26, 2023 5:43 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…