పుష్ప సినిమా రిలీజైనపుడు వచ్చిన టాక్ చూసి చిత్ర బృందం కంగారు పడే ఉంటుంది. సుకుమార్ చివరి సినిమా రంగస్థలంతో పోల్చి చూసుకుని ఈ సినిమా పట్ల పెదవి విరిచారు చాలామంది. రివ్యూలు, రేటింగ్స్ అన్నీ యావరేజ్ అన్నట్లే ఉన్నాయి. టాక్ కూడా డివైడ్గానే వచ్చింది. దీంతో రిజల్ట్ తేడా కొడుతుందేమో అన్న భయాలు కలిగాయి. కానీ ఆ టాక్ను తట్టుకుని సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఐతే కరోనా ప్రభావం, ఏపీలో టికెట్ల రేట్లు తక్కువగా ఉండటం వల్ల అంతిమంగా సంతృప్తికర ఫలితం మాత్రం రాలేదు.
కానీ పుష్ప ఇతర భాషల్లో అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా హిందీలో ఆ సినిమా పెద్ద బ్లాక్బస్టరే అయింది. రిలీజ్ తర్వాత ఒక యుఫోరియా సృష్టించింది. అది పుష్ప-2కు బాగా కలిసొచ్చింది. పుష్ప పాటలు.. హీరో డైలాగులు, మేనరిజమ్స్ అన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. దీంతో సినిమా షూట్ మొదలు కావడానికి ముందే హైప్ వచ్చేసింది.. ఆ హైప్ ఇప్పుడు ఇంకా పెరిగిపోయి పుష్ప-2 విడుదలకు ముందే ప్రకంపనలు రేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జాతీయ అవార్డుల్లో పుష్ప సినిమాకు రెండు పురస్కారాలు దక్కిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డు గెలిచాడు. దీంతో పుష్ప గురించి మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినిమా మీద అంచనాలను ఇది మరింత పెంచే పరిణామమే అనడంలో సందేహం లేదు. అదే సమయంలో అంచనాల ఒత్తడి చిత్ర బృందానికి ఇబ్బందికరం కూడా. అసలే సుకుమార్ సినిమాను మామూలుగా చెక్కట్లేదని అంటున్నారు. ఇప్పుడు అంచనాలు ఇంకా పెరిగిపోవడంతో ఆయన పర్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుందేమో. రిలీజ్ కూడా ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు.
This post was last modified on August 26, 2023 5:43 pm
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్…
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం…
టాలీవుడ్ టాప్ హీరోల్లో అత్యధిక డిమాండ్ ఉన్నది ఎవరికయ్యా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్. తెలుగులోనే కాదు హిందీలోనూ…
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా…
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు…