ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తే.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో అయితే తెలుగు సినిమాకు చోటు దక్కుతుందా అని చూసేవాళ్లం. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం లాంటి విభాగాల్లో తెలుగు సినిమాలకు అవకాశం ఉంటుందని అసలు అంచనాలే పెట్టుకునేవాళ్లు కాదు. అలాంటిది ఈ రోజు ఏకంగా 11 విభాగాల్లో మనకు జాతీయ పురస్కారాలు దక్కాయి. అందులో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య సంగీతం.. సహా పలు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలిచి ఔరా అనిపించింది.
ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రమే ఆరు అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇది మన వాళ్లకు అమితానందాన్నిచ్చే విషయం. ఐతే అదే సమయంలో ఒకప్పుడు జాతీయ అవార్డుల్లో ఆధిపత్యాన్ని చాటిన వేరే ఇండస్ట్రీల వాళ్లకు ఈ పరిణామం అస్సలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా తమిళ జనాలకు తెలుగు సినిమాల హవా రుచించడం లేదన్నది వాస్తవం.
ఒకప్పుడు తమిళ సినిమాలకు జాతీయ పురస్కారాల్లో మంచి ప్రాధాన్యం ఉండేది. అక్కడి సినిమాల క్వాలిటీ కూడా అందుకు తగ్గట్లే ఉండేది. అప్పుడు మనవి రొడ్డ కొట్టుడు సినిమాలంటూ ఎగతాళి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో క్వాలిటీ పెరిగింది. కమర్షియల్గా భారీ విజయాలు సాధిస్తూనే కంటెంట్తోనూ మెప్పిస్తున్నాయి. ఇప్పుడు తమిళ చిత్రాల రేంజ్ అంతకంతకూ పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల్లో ఎక్కడలేని ప్రాధాన్యం దక్కడం.. తమిళ చిత్రాల ఊసే లేకపోవడం వారికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.
నిజానికి ఈసారి తమిళం నుంచి జై భీమ్, కర్ణన్, సార్పట్ట లాంటి మంచి చిత్రాలే పోటీలో నిలిచాయి. కానీ వీటికి అవార్డులు దక్కలేదు. అందుకే తెలుగు సినిమాల్లో అంత విషయం లేకున్నా అవార్డులు ఇస్తున్నారని.. మన వాళ్లు లాబీయింగ్ చేసి అవార్డులు సాధించుకున్నారని.. కంటెంట్ను బట్టి కాకుండా సక్సెస్ను బట్టి అవార్డులు ఇచ్చారని.. ఇలా రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు తమిళ నెటిజన్లు.
This post was last modified on August 26, 2023 11:07 am
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…
వైసీపీ అధినేత జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసు తీర్పు 4 వారాల్లో రానుంది.…