ఒకప్పుడు జాతీయ అవార్డులు ప్రకటిస్తే.. ఉత్తమ ప్రాంతీయ చిత్రం విభాగంలో అయితే తెలుగు సినిమాకు చోటు దక్కుతుందా అని చూసేవాళ్లం. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం లాంటి విభాగాల్లో తెలుగు సినిమాలకు అవకాశం ఉంటుందని అసలు అంచనాలే పెట్టుకునేవాళ్లు కాదు. అలాంటిది ఈ రోజు ఏకంగా 11 విభాగాల్లో మనకు జాతీయ పురస్కారాలు దక్కాయి. అందులో ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ నేపథ్య సంగీతం.. సహా పలు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలిచి ఔరా అనిపించింది.
ఒక్క ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మాత్రమే ఆరు అవార్డులను గెలుచుకోవడం విశేషం. ఇది మన వాళ్లకు అమితానందాన్నిచ్చే విషయం. ఐతే అదే సమయంలో ఒకప్పుడు జాతీయ అవార్డుల్లో ఆధిపత్యాన్ని చాటిన వేరే ఇండస్ట్రీల వాళ్లకు ఈ పరిణామం అస్సలు మింగుడు పడటం లేదు. ముఖ్యంగా తమిళ జనాలకు తెలుగు సినిమాల హవా రుచించడం లేదన్నది వాస్తవం.
ఒకప్పుడు తమిళ సినిమాలకు జాతీయ పురస్కారాల్లో మంచి ప్రాధాన్యం ఉండేది. అక్కడి సినిమాల క్వాలిటీ కూడా అందుకు తగ్గట్లే ఉండేది. అప్పుడు మనవి రొడ్డ కొట్టుడు సినిమాలంటూ ఎగతాళి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో క్వాలిటీ పెరిగింది. కమర్షియల్గా భారీ విజయాలు సాధిస్తూనే కంటెంట్తోనూ మెప్పిస్తున్నాయి. ఇప్పుడు తమిళ చిత్రాల రేంజ్ అంతకంతకూ పడిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల్లో ఎక్కడలేని ప్రాధాన్యం దక్కడం.. తమిళ చిత్రాల ఊసే లేకపోవడం వారికి చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.
నిజానికి ఈసారి తమిళం నుంచి జై భీమ్, కర్ణన్, సార్పట్ట లాంటి మంచి చిత్రాలే పోటీలో నిలిచాయి. కానీ వీటికి అవార్డులు దక్కలేదు. అందుకే తెలుగు సినిమాల్లో అంత విషయం లేకున్నా అవార్డులు ఇస్తున్నారని.. మన వాళ్లు లాబీయింగ్ చేసి అవార్డులు సాధించుకున్నారని.. కంటెంట్ను బట్టి కాకుండా సక్సెస్ను బట్టి అవార్డులు ఇచ్చారని.. ఇలా రకరకాలుగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు తమిళ నెటిజన్లు.
గొప్ప గొప్ప దర్శకులు కూడా తమ సినిమాలు ఆశించినంత ఆడకపోతే.. వాటి ఫలితాల విషయంలో చిత్రమైన కారణాలు చెబుతుంటారు. స్క్రిప్టు…
సుప్రీంకోర్టు హెచ్చరికలు, దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అందుతున్న వేలాది ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం కదిలింది. దేశంలో ఏదో ఒక రూపంలో…
వెనిజులాను వరుస భూకంపాలు వణికించాయి. దేశ రాజధాని కరాకస్తో పాటు ఉత్తర-మధ్య ప్రాంతాల్లో బుధవారం శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. తొలుత…
విదేశాలకు వెళ్లాలన్నా, మన జాతీయతను నిరూపించుకోవాలన్నా పాస్పోర్ట్ అత్యంత కీలకమైన పత్రం. అయితే ఇటీవల విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇచ్చిన…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినీ సందడి నెలకొంది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా, స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో…
వారణాసి మళ్ళీ వార్తల్లోకి వచ్చేసింది. ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో పృథ్విరాజ్ సుకుమారన్ చెప్పిన కొన్ని విషయాలు…