Movie News

చంద్రబోస్‌.. శెహబాష్‌

తెలుగు సినిమా పాటకు మరోమారు పట్టాభిషేకం జరగనుంది. తాజాగా జాతీయ సినిమా అవార్డుకు ఎంపికై తెలుగు పాట సత్తా చాటింది. ఆ ఘనత సాధించి పెట్టినది చంద్రబోస్‌..! తెలుగు సినిమా పాటకు నేడు ఆయనే బాస్‌..! మొన్న విశ్వవేదిక పై నాటు… నాటు అంటూ తెలుగు పదాలను అందరి పెదాలపై నాట్యమాడిరచారాయన. నేడు అడవిని మించిన బడి లేదంటూ వన దేవతను అందంగా వర్ణించాడు..
పచ్చ పచ్చని చెట్టు చేమ
పట్టు చీరలంటా..
నల్ల నల్ల ముళ్ల కంప
నల్లపూసలంటా.. అంటూ
కొండపొలం చిత్రానికి ఆయన రాసిన పాట నేడు ఉత్తమ గీతంగా ఎంపికైంది.

చిన్న చిన్న పదాలు.. ఆ పదాలలో మట్టి వాసనలు పరిమళింపజేయడం చంద్రబోస్‌ సొంతం. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఆయన రాసిన పాట నాటు.. నాటు ప్రపంచ స్థాయిలో అత్యున్నత సినిమా పురస్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. కిర్రుసెప్పు, కర్రసాము, మర్రిసెట్టు, కుర్రగుంపు, ఎర్రజొన్న, మిరపతొక్కు.. ఇలాంటి జనపదాలను ఏర్చి, పాటగా కూర్చి.. అద్భుత సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్‌. ఈ పాట చరణంలో చెప్పినట్లుగానే.. ఒల్లు సెమట పట్టేలా.. ప్రతి ఒక్కరినీ వీరంగం చేయించింది.

మరోసారి చంద్రబోస్‌ తన కలాన్ని రaళింపించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన కొండపొలం చిత్రానికి ఓ అద్భుత గేయాన్ని రాసి అందరినీ మెప్పించడడే కాకుండా జాతీయ అవార్డు కైవశం చేసుకున్నారు. ఈ గీతం కూడా ఆయన కలానికి ఎంత పదునుందో నిరూపించింది. ఈ పాటలో అడవి ఒడిలో బతుకు పాఠాన్ని చెప్పడం చంద్రబోస్‌కే సాధ్యమైంది. గలగల పారే సెలలో నీళ్లు సనుబాలంటూ అద్భుత అభివర్ణణ చేస్తూనే.. సుక్క సుక్క దాచాలంటూ తేనెటీగ తెలిపెనంటా.. మెరుగైన జీవన విధానాన్ని సూత్రీకరించారు. తిన్న ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడికట్టొద్దు.. అంటూ వనాలను కాపాడుకోవాలనే సందేశాన్ని కూడా అందించారు. పెద్ద పులితో తలపడే ధైర్యం అడవి పందే నేర్పెనంటా.. కలసి ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటెనంటా.. ఈ వాక్యాలు ఏ స్ఫూర్తి పాఠాలలో దొరుకుతాయి.. ఒక్క చంద్రబోస్‌ పాటలో తప్ప…! అందుకే.. అంతా అంటున్నారు.. చంద్రబోస్‌.. శెహబాష్‌ అని..!

తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డు దక్కడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1974లో తెలుగు వీర లేవరా అనే గీతానికి గాను శ్రీరంగం శ్రీనివాసరావు ఉత్తమ గేయ రచయిత అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1993లో రాలిపోయే పువ్వా అనే ఆర్ధ్రత నిండిన గీతాన్ని రాసి వేటూరి సుందరరామమూర్తి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2003లో నేను సైతం అనే గీతానికి గాను సుద్దాల అశోక్‌ తేజ జాతీయ ఉత్తమ గేయ రచయిత పురస్కారానికి ఎంపికయ్యారు. మూడు దశాబ్డాల తర్వాత తెలుగు పాటకు మరోమారు జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. అది చంద్ర బోస్‌ రాసిన ధం.. ధం.. ధం.. అంటూ అడవిని వర్ణించే పాటతో సాధ్యమైంది.

  • అనిల్‌

This post was last modified on August 25, 2023 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సమంత చేతికి బంగారం లాంటి ఛాన్స్

బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…

4 hours ago

వైసీపీ మైన‌స్ `నాలుగు`?

ప్ర‌స్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజ‌క‌వ‌ర్గాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి 4 నియోజ‌క‌వ‌ర్గాలు చేజారి పోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.…

6 hours ago

దేవర 2 భవిష్యత్తు ఏంటి

బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…

11 hours ago

వైసీపీలో వ‌రుస అరెస్టులు.. అంతా రెడీనా?

వైసీపీ అధినేత జ‌గ‌న్ శుక్ర‌వారం నుంచి యూర‌ప్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. దాదాపు 20 రోజుల‌కు పైగానే ఆయ‌న రాష్ట్రానికి దూరంగా…

12 hours ago

కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…

12 hours ago

నిప్పురవ్వతో ఉస్తాద్ పోలిక చాలా బాగుంది

బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…

13 hours ago