Movie News

చంద్రబోస్‌.. శెహబాష్‌

తెలుగు సినిమా పాటకు మరోమారు పట్టాభిషేకం జరగనుంది. తాజాగా జాతీయ సినిమా అవార్డుకు ఎంపికై తెలుగు పాట సత్తా చాటింది. ఆ ఘనత సాధించి పెట్టినది చంద్రబోస్‌..! తెలుగు సినిమా పాటకు నేడు ఆయనే బాస్‌..! మొన్న విశ్వవేదిక పై నాటు… నాటు అంటూ తెలుగు పదాలను అందరి పెదాలపై నాట్యమాడిరచారాయన. నేడు అడవిని మించిన బడి లేదంటూ వన దేవతను అందంగా వర్ణించాడు..
పచ్చ పచ్చని చెట్టు చేమ
పట్టు చీరలంటా..
నల్ల నల్ల ముళ్ల కంప
నల్లపూసలంటా.. అంటూ
కొండపొలం చిత్రానికి ఆయన రాసిన పాట నేడు ఉత్తమ గీతంగా ఎంపికైంది.

చిన్న చిన్న పదాలు.. ఆ పదాలలో మట్టి వాసనలు పరిమళింపజేయడం చంద్రబోస్‌ సొంతం. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఆయన రాసిన పాట నాటు.. నాటు ప్రపంచ స్థాయిలో అత్యున్నత సినిమా పురస్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. కిర్రుసెప్పు, కర్రసాము, మర్రిసెట్టు, కుర్రగుంపు, ఎర్రజొన్న, మిరపతొక్కు.. ఇలాంటి జనపదాలను ఏర్చి, పాటగా కూర్చి.. అద్భుత సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్‌. ఈ పాట చరణంలో చెప్పినట్లుగానే.. ఒల్లు సెమట పట్టేలా.. ప్రతి ఒక్కరినీ వీరంగం చేయించింది.

మరోసారి చంద్రబోస్‌ తన కలాన్ని రaళింపించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన కొండపొలం చిత్రానికి ఓ అద్భుత గేయాన్ని రాసి అందరినీ మెప్పించడడే కాకుండా జాతీయ అవార్డు కైవశం చేసుకున్నారు. ఈ గీతం కూడా ఆయన కలానికి ఎంత పదునుందో నిరూపించింది. ఈ పాటలో అడవి ఒడిలో బతుకు పాఠాన్ని చెప్పడం చంద్రబోస్‌కే సాధ్యమైంది. గలగల పారే సెలలో నీళ్లు సనుబాలంటూ అద్భుత అభివర్ణణ చేస్తూనే.. సుక్క సుక్క దాచాలంటూ తేనెటీగ తెలిపెనంటా.. మెరుగైన జీవన విధానాన్ని సూత్రీకరించారు. తిన్న ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడికట్టొద్దు.. అంటూ వనాలను కాపాడుకోవాలనే సందేశాన్ని కూడా అందించారు. పెద్ద పులితో తలపడే ధైర్యం అడవి పందే నేర్పెనంటా.. కలసి ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటెనంటా.. ఈ వాక్యాలు ఏ స్ఫూర్తి పాఠాలలో దొరుకుతాయి.. ఒక్క చంద్రబోస్‌ పాటలో తప్ప…! అందుకే.. అంతా అంటున్నారు.. చంద్రబోస్‌.. శెహబాష్‌ అని..!

తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డు దక్కడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1974లో తెలుగు వీర లేవరా అనే గీతానికి గాను శ్రీరంగం శ్రీనివాసరావు ఉత్తమ గేయ రచయిత అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1993లో రాలిపోయే పువ్వా అనే ఆర్ధ్రత నిండిన గీతాన్ని రాసి వేటూరి సుందరరామమూర్తి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2003లో నేను సైతం అనే గీతానికి గాను సుద్దాల అశోక్‌ తేజ జాతీయ ఉత్తమ గేయ రచయిత పురస్కారానికి ఎంపికయ్యారు. మూడు దశాబ్డాల తర్వాత తెలుగు పాటకు మరోమారు జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. అది చంద్ర బోస్‌ రాసిన ధం.. ధం.. ధం.. అంటూ అడవిని వర్ణించే పాటతో సాధ్యమైంది.

  • అనిల్‌

This post was last modified on August 25, 2023 12:27 pm

Share

Recent Posts

పవన్ భార్యను అలా పిలవకండి

త‌ను స్వ‌త‌హాగా ర‌ష్య‌న్ అయినా.. పుట్టి పెరిగింది ర‌ష్యాలోనే అయినా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…

2 hours ago

ఆర్ఆర్ఆర్ హీరోలకు ప్రమాదాల పర్వం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…

2 hours ago

త్రివిక్ర‌మ్ మీద అంత అనుమాన‌మా?

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది క‌థ‌లు, స‌న్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…

2 hours ago

సుమంత్ ఈసారి బలంగా వస్తున్నాడు

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌న‌వ‌డు సుమంత్‌ను చూస్తే పెద్ద స్టార్ కావ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లే క‌నిపిస్తాడు. ఆర‌డుగుల ఆజానుబాహుడు,…

4 hours ago

విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌.. చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న.. ఏంటీ బంధం?

పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీనికి సంబంధించిన కార‌ణాలు…

4 hours ago

రంగ‌నాథ్‌ను తప్పించండి… హైడ్రాపై హైకోర్టు సీరియ‌స్‌!

తెలంగాణ‌లో ఆక్ర‌మ క‌ట్టడాల‌కు సింహ స్వ‌ప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌మ మాటంటే హైడ్రాకు…

6 hours ago