Movie News

చంద్రబోస్‌.. శెహబాష్‌

తెలుగు సినిమా పాటకు మరోమారు పట్టాభిషేకం జరగనుంది. తాజాగా జాతీయ సినిమా అవార్డుకు ఎంపికై తెలుగు పాట సత్తా చాటింది. ఆ ఘనత సాధించి పెట్టినది చంద్రబోస్‌..! తెలుగు సినిమా పాటకు నేడు ఆయనే బాస్‌..! మొన్న విశ్వవేదిక పై నాటు… నాటు అంటూ తెలుగు పదాలను అందరి పెదాలపై నాట్యమాడిరచారాయన. నేడు అడవిని మించిన బడి లేదంటూ వన దేవతను అందంగా వర్ణించాడు..
పచ్చ పచ్చని చెట్టు చేమ
పట్టు చీరలంటా..
నల్ల నల్ల ముళ్ల కంప
నల్లపూసలంటా.. అంటూ
కొండపొలం చిత్రానికి ఆయన రాసిన పాట నేడు ఉత్తమ గీతంగా ఎంపికైంది.

చిన్న చిన్న పదాలు.. ఆ పదాలలో మట్టి వాసనలు పరిమళింపజేయడం చంద్రబోస్‌ సొంతం. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఆయన రాసిన పాట నాటు.. నాటు ప్రపంచ స్థాయిలో అత్యున్నత సినిమా పురస్కారంగా భావించే ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకుంది. కిర్రుసెప్పు, కర్రసాము, మర్రిసెట్టు, కుర్రగుంపు, ఎర్రజొన్న, మిరపతొక్కు.. ఇలాంటి జనపదాలను ఏర్చి, పాటగా కూర్చి.. అద్భుత సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్‌. ఈ పాట చరణంలో చెప్పినట్లుగానే.. ఒల్లు సెమట పట్టేలా.. ప్రతి ఒక్కరినీ వీరంగం చేయించింది.

మరోసారి చంద్రబోస్‌ తన కలాన్ని రaళింపించారు. క్రిష్‌ దర్శకత్వం వహించిన కొండపొలం చిత్రానికి ఓ అద్భుత గేయాన్ని రాసి అందరినీ మెప్పించడడే కాకుండా జాతీయ అవార్డు కైవశం చేసుకున్నారు. ఈ గీతం కూడా ఆయన కలానికి ఎంత పదునుందో నిరూపించింది. ఈ పాటలో అడవి ఒడిలో బతుకు పాఠాన్ని చెప్పడం చంద్రబోస్‌కే సాధ్యమైంది. గలగల పారే సెలలో నీళ్లు సనుబాలంటూ అద్భుత అభివర్ణణ చేస్తూనే.. సుక్క సుక్క దాచాలంటూ తేనెటీగ తెలిపెనంటా.. మెరుగైన జీవన విధానాన్ని సూత్రీకరించారు. తిన్న ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడికట్టొద్దు.. అంటూ వనాలను కాపాడుకోవాలనే సందేశాన్ని కూడా అందించారు. పెద్ద పులితో తలపడే ధైర్యం అడవి పందే నేర్పెనంటా.. కలసి ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటెనంటా.. ఈ వాక్యాలు ఏ స్ఫూర్తి పాఠాలలో దొరుకుతాయి.. ఒక్క చంద్రబోస్‌ పాటలో తప్ప…! అందుకే.. అంతా అంటున్నారు.. చంద్రబోస్‌.. శెహబాష్‌ అని..!

తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డు దక్కడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1974లో తెలుగు వీర లేవరా అనే గీతానికి గాను శ్రీరంగం శ్రీనివాసరావు ఉత్తమ గేయ రచయిత అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1993లో రాలిపోయే పువ్వా అనే ఆర్ధ్రత నిండిన గీతాన్ని రాసి వేటూరి సుందరరామమూర్తి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2003లో నేను సైతం అనే గీతానికి గాను సుద్దాల అశోక్‌ తేజ జాతీయ ఉత్తమ గేయ రచయిత పురస్కారానికి ఎంపికయ్యారు. మూడు దశాబ్డాల తర్వాత తెలుగు పాటకు మరోమారు జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. అది చంద్ర బోస్‌ రాసిన ధం.. ధం.. ధం.. అంటూ అడవిని వర్ణించే పాటతో సాధ్యమైంది.

  • అనిల్‌

This post was last modified on August 25, 2023 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సొంతూరి రూపురేఖలు మార్చేసిన పవన్

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాటిస్తే.. అది అమ‌లు కావాల్సిందే!. అది గిరిజ‌న ప్రాంత‌మైనా.. మైదాన ప్రాంత‌మైనా.. చెప్పిన‌ట్టు…

5 minutes ago

మార్కో అంద‌రినీ చెడగొట్టేసాడా?

గ‌త ఏడాది మ‌ల‌యాళంలో ఎవ్వ‌రూ ఊహించ‌ని స్థాయిలో భారీ హిట్ అయింది మార్కో మూవీ. తెలుగులో జ‌న‌తా గ్యారేజ్, భాగ‌మ‌తి…

1 hour ago

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

6 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

12 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

15 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

17 hours ago