తెలుగు సినిమా పాటకు మరోమారు పట్టాభిషేకం జరగనుంది. తాజాగా జాతీయ సినిమా అవార్డుకు ఎంపికై తెలుగు పాట సత్తా చాటింది. ఆ ఘనత సాధించి పెట్టినది చంద్రబోస్..! తెలుగు సినిమా పాటకు నేడు ఆయనే బాస్..! మొన్న విశ్వవేదిక పై నాటు… నాటు అంటూ తెలుగు పదాలను అందరి పెదాలపై నాట్యమాడిరచారాయన. నేడు అడవిని మించిన బడి లేదంటూ వన దేవతను అందంగా వర్ణించాడు..
పచ్చ పచ్చని చెట్టు చేమ
పట్టు చీరలంటా..
నల్ల నల్ల ముళ్ల కంప
నల్లపూసలంటా.. అంటూ
కొండపొలం చిత్రానికి ఆయన రాసిన పాట నేడు ఉత్తమ గీతంగా ఎంపికైంది.
చిన్న చిన్న పదాలు.. ఆ పదాలలో మట్టి వాసనలు పరిమళింపజేయడం చంద్రబోస్ సొంతం. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆయన రాసిన పాట నాటు.. నాటు ప్రపంచ స్థాయిలో అత్యున్నత సినిమా పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. కిర్రుసెప్పు, కర్రసాము, మర్రిసెట్టు, కుర్రగుంపు, ఎర్రజొన్న, మిరపతొక్కు.. ఇలాంటి జనపదాలను ఏర్చి, పాటగా కూర్చి.. అద్భుత సాహిత్యాన్ని అందించారు చంద్రబోస్. ఈ పాట చరణంలో చెప్పినట్లుగానే.. ఒల్లు సెమట పట్టేలా.. ప్రతి ఒక్కరినీ వీరంగం చేయించింది.
మరోసారి చంద్రబోస్ తన కలాన్ని రaళింపించారు. క్రిష్ దర్శకత్వం వహించిన కొండపొలం చిత్రానికి ఓ అద్భుత గేయాన్ని రాసి అందరినీ మెప్పించడడే కాకుండా జాతీయ అవార్డు కైవశం చేసుకున్నారు. ఈ గీతం కూడా ఆయన కలానికి ఎంత పదునుందో నిరూపించింది. ఈ పాటలో అడవి ఒడిలో బతుకు పాఠాన్ని చెప్పడం చంద్రబోస్కే సాధ్యమైంది. గలగల పారే సెలలో నీళ్లు సనుబాలంటూ అద్భుత అభివర్ణణ చేస్తూనే.. సుక్క సుక్క దాచాలంటూ తేనెటీగ తెలిపెనంటా.. మెరుగైన జీవన విధానాన్ని సూత్రీకరించారు. తిన్న ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడికట్టొద్దు.. అంటూ వనాలను కాపాడుకోవాలనే సందేశాన్ని కూడా అందించారు. పెద్ద పులితో తలపడే ధైర్యం అడవి పందే నేర్పెనంటా.. కలసి ఉంటే బలముందంటూ రేసు కుక్కలు సాటెనంటా.. ఈ వాక్యాలు ఏ స్ఫూర్తి పాఠాలలో దొరుకుతాయి.. ఒక్క చంద్రబోస్ పాటలో తప్ప…! అందుకే.. అంతా అంటున్నారు.. చంద్రబోస్.. శెహబాష్ అని..!
తెలుగు సినిమా పాటకు జాతీయ అవార్డు దక్కడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1974లో తెలుగు వీర లేవరా అనే గీతానికి గాను శ్రీరంగం శ్రీనివాసరావు ఉత్తమ గేయ రచయిత అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత 1993లో రాలిపోయే పువ్వా అనే ఆర్ధ్రత నిండిన గీతాన్ని రాసి వేటూరి సుందరరామమూర్తి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2003లో నేను సైతం అనే గీతానికి గాను సుద్దాల అశోక్ తేజ జాతీయ ఉత్తమ గేయ రచయిత పురస్కారానికి ఎంపికయ్యారు. మూడు దశాబ్డాల తర్వాత తెలుగు పాటకు మరోమారు జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. అది చంద్ర బోస్ రాసిన ధం.. ధం.. ధం.. అంటూ అడవిని వర్ణించే పాటతో సాధ్యమైంది.
This post was last modified on August 25, 2023 12:27 pm
ఏపీ రాజధాని అమరావతిని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో…
'ప్రజల్లోకి ప్రభుత్వం' నినాదంతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన…
వచ్చే వారం విడుదల కాబోతున్న లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా రానున్న సంగతి తెలిసిందే.…
ఈ నెల 24వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025-26 వార్షిక బడ్జెట్ను…
ఇంకొద్ది గంటల్లో తండేల్ ప్రీమియర్ షోలు ప్రారంభం కాబోతున్నాయి. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమా…
విశ్వక్ సేన్ పూర్తి స్థాయి ఆడవేషం వేసిన లైలా ఫిబ్రవరి 14 విడుదల కాబోతోంది. ముందు వాయిదా అనే వార్తలు…