దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక అరుదైన మైలురాయి అందుకున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా ఎన్నో తరాలు, ఎందరో హీరోలకు సాధ్యం కాని గొప్ప ఘనతను అందుకున్నాడు. ఇవాళ ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో పుష్ప 1 ది రైజ్ లో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అనౌన్స్ చేయడం ఆలస్యం బన్నీ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇది లీకు రూపంలో కొన్ని నిమిషాల ముందే వచ్చినప్పటికీ ఏదైనా చివరి క్షణం ట్విస్టు ఉంటుందేమోననే అనుమానంతో మీడియాతో సహా అన్ని వర్గాలు సంయమనం పాటించాయి
ప్యాన్ ఇండియా ఇమేజ్ ని పుష్పతోనే సాధించుకున్న అల్లు అర్జున్ సక్సెస్ లో ఇదో మేలి ముత్యంగా నిలిచిపోతుంది. చాలా సంవత్సరాలుగా తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు, మరపురాని పెర్ఫార్మన్స్ ఇచ్చిన నటులున్నా టాలీవుడ్ కు ఈ విభాగం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కమల్ హాసన్, అక్కినేని, చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఎందరో గొప్ప క్లాసిక్స్ లో నటించినా ఎప్పటికప్పుడు ఆ ఏడాది పోటీ వల్ల ఇది కలగానే నెరవేరకుండా వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైజ్ పార్ట్ 1 అడవి దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా తగ్గేదేలే అంటూ చిత్తూరు యాసలో బన్నీ చూపించిన నటన, హావభావాలు జ్యురి సభ్యులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండో భాగం షూటింగ్ జరుగుతుండగా ఈ శుభవార్త వినడం కన్నా గొప్ప క్షణం ఇంకేముంటుంది. ప్రకటనకు కొద్దిసమయం ముందే సుకుమార్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలిసి ఆ ఘట్టాన్ని ఆస్వాదించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప ఇప్పుడీ అవార్డు వల్ల సీక్వెల్ కి ఆల్రెడీ ఉన్న బజ్ అమాంతం మరింత పెరిగిపోవడం ఖాయం. ఏది ఏమైనా టాలీవుడ్డే కాదు యావత్ సౌత్ పరిశ్రమ గర్వపడేలా చేశాడు బన్నీ అలియాస్ అల్లు అర్జున్.
This post was last modified on August 24, 2023 6:54 pm
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…
ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో కొన్న 681 గజాల స్థలం విషయంలో వివాదం నెలకొందని, ఆ స్థలం…
రాజకీయాల్లో సెంటిమెంటుకు ఛాన్స్ ఎక్కువ. ఉద్ధండ నాయకుల నుంచి చరిత్ర సొంతం చేసుకున్న పార్టీల వరక కూడా సెంటి మెంటుకు…
వైసీపీ నాయకులు సహా సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కళ్లలో భయం కనిపిస్తోందని ఆ పార్టీ రెబల్ ఎంపీ, ఉండి నుంచి…