దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక అరుదైన మైలురాయి అందుకున్నాడు. స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా ఎన్నో తరాలు, ఎందరో హీరోలకు సాధ్యం కాని గొప్ప ఘనతను అందుకున్నాడు. ఇవాళ ప్రకటించిన 69వ జాతీయ అవార్డుల్లో పుష్ప 1 ది రైజ్ లో నటనకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డు అనౌన్స్ చేయడం ఆలస్యం బన్నీ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఇది లీకు రూపంలో కొన్ని నిమిషాల ముందే వచ్చినప్పటికీ ఏదైనా చివరి క్షణం ట్విస్టు ఉంటుందేమోననే అనుమానంతో మీడియాతో సహా అన్ని వర్గాలు సంయమనం పాటించాయి
ప్యాన్ ఇండియా ఇమేజ్ ని పుష్పతోనే సాధించుకున్న అల్లు అర్జున్ సక్సెస్ లో ఇదో మేలి ముత్యంగా నిలిచిపోతుంది. చాలా సంవత్సరాలుగా తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాలు, మరపురాని పెర్ఫార్మన్స్ ఇచ్చిన నటులున్నా టాలీవుడ్ కు ఈ విభాగం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. కమల్ హాసన్, అక్కినేని, చిరంజీవి, బాలకృష్ణ లాంటి ఎందరో గొప్ప క్లాసిక్స్ లో నటించినా ఎప్పటికప్పుడు ఆ ఏడాది పోటీ వల్ల ఇది కలగానే నెరవేరకుండా వస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప ది రైజ్ పార్ట్ 1 అడవి దుంగల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా తగ్గేదేలే అంటూ చిత్తూరు యాసలో బన్నీ చూపించిన నటన, హావభావాలు జ్యురి సభ్యులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రెండో భాగం షూటింగ్ జరుగుతుండగా ఈ శుభవార్త వినడం కన్నా గొప్ప క్షణం ఇంకేముంటుంది. ప్రకటనకు కొద్దిసమయం ముందే సుకుమార్ అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలిసి ఆ ఘట్టాన్ని ఆస్వాదించాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప ఇప్పుడీ అవార్డు వల్ల సీక్వెల్ కి ఆల్రెడీ ఉన్న బజ్ అమాంతం మరింత పెరిగిపోవడం ఖాయం. ఏది ఏమైనా టాలీవుడ్డే కాదు యావత్ సౌత్ పరిశ్రమ గర్వపడేలా చేశాడు బన్నీ అలియాస్ అల్లు అర్జున్.
This post was last modified on August 24, 2023 6:54 pm
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…
వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోషల్ మీడియా ఊదర గొడుతోంది. అంతేకాదు.. గత…
సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…