వచ్చే నెల 15న విడుదల కాబోతున్న స్కంద ఫీవర్ మెల్లగా పెరుగుతోంది. దీనికన్నా ముందు వచ్చే రిలీజుల ప్రమోషన్లు జోరుగా ఉండటంతో ప్రస్తుతానికి రామ్ బృందం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ 45 కోట్ల దాకా చేశారనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడీ స్కందకు బాలయ్య అండ దొరకనుంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన్నే ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు టాక్. దర్శకుడు బోయపాటి శీనుతో బాలకృష్ణకున్న స్నేహం, అనుబంధం అందరికీ తెలిసిందే. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సాధించిన జంట ఇది.
ఆ బాండింగ్ తోనే బాలయ్య ఎస్ చెప్పినట్టు తెలిసింది. ఇరవై ఆరున శిల్ప కళా వేదికలో జరిగే ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. ట్రైలర్ కూడా అదే రోజు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా స్కంద కంటెంట్ కి సంబంధించి చిన్న టీజర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. రిలీజ్ చేసిన రెండు పాటలు నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్ అంచనాలను పూర్తిగా కాకపోయినా మాస్ కి తగ్గట్టు స్లోగా పబ్లిక్ లోకి వెళ్తున్నాయి. అసలు కథేంటి, యాక్షన్ డ్రామాని ముందే తెలిసినా ఎలాంటి నేపధ్యాన్ని బోయపాటి తీసుకున్నాడనే ప్రశ్నలకు సమాధానం ట్రైలర్ చూశాక కొంతవరకు దొరకొచ్చు.
ముందు వెనుకా తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో స్కందకు చాలా సవాళ్లు ఎదురు కానున్నాయి. వారం ముందు షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చి ఉంటుంది. సెప్టెంబర్ 15నే చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు ఉన్నాయి. డబ్బింగ్ హక్కులకు బాగానే డిమాండ్ ఉంది. కాబట్టి థియేటర్ల సమస్యను అధిగమిస్తూనే అదిరిపోయే టాక్ తెచ్చుకుంటే స్కందని ఈ కాంపిటీషన్ ఏమీ చేయలేదు. శ్రీలీల నృత్యాలు, గ్లామర్ పబ్లిసిటీ పరంగా బాగానే ప్లస్ అవుతోంది. ది వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ ఎంతో నమ్మకంతో చేస్తున్న స్కంద సక్సెస్ అయితే డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ కి మరింత హెల్ప్ అవుతుంది. చూడాలి మరి.
This post was last modified on August 23, 2023 3:13 pm
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…
శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…