వచ్చే నెల 15న విడుదల కాబోతున్న స్కంద ఫీవర్ మెల్లగా పెరుగుతోంది. దీనికన్నా ముందు వచ్చే రిలీజుల ప్రమోషన్లు జోరుగా ఉండటంతో ప్రస్తుతానికి రామ్ బృందం కొంచెం నెమ్మదిగా ఉంది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ బిజినెస్ 45 కోట్ల దాకా చేశారనే వార్త ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడీ స్కందకు బాలయ్య అండ దొరకనుంది. త్వరలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయన్నే ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు టాక్. దర్శకుడు బోయపాటి శీనుతో బాలకృష్ణకున్న స్నేహం, అనుబంధం అందరికీ తెలిసిందే. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సాధించిన జంట ఇది.
ఆ బాండింగ్ తోనే బాలయ్య ఎస్ చెప్పినట్టు తెలిసింది. ఇరవై ఆరున శిల్ప కళా వేదికలో జరిగే ఈవెంట్ కి ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. ట్రైలర్ కూడా అదే రోజు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా స్కంద కంటెంట్ కి సంబంధించి చిన్న టీజర్ తప్ప ఎలాంటి అప్డేట్ లేదు. రిలీజ్ చేసిన రెండు పాటలు నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్ అంచనాలను పూర్తిగా కాకపోయినా మాస్ కి తగ్గట్టు స్లోగా పబ్లిక్ లోకి వెళ్తున్నాయి. అసలు కథేంటి, యాక్షన్ డ్రామాని ముందే తెలిసినా ఎలాంటి నేపధ్యాన్ని బోయపాటి తీసుకున్నాడనే ప్రశ్నలకు సమాధానం ట్రైలర్ చూశాక కొంతవరకు దొరకొచ్చు.
ముందు వెనుకా తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో స్కందకు చాలా సవాళ్లు ఎదురు కానున్నాయి. వారం ముందు షారుఖ్ ఖాన్ జవాన్ వచ్చి ఉంటుంది. సెప్టెంబర్ 15నే చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీలు ఉన్నాయి. డబ్బింగ్ హక్కులకు బాగానే డిమాండ్ ఉంది. కాబట్టి థియేటర్ల సమస్యను అధిగమిస్తూనే అదిరిపోయే టాక్ తెచ్చుకుంటే స్కందని ఈ కాంపిటీషన్ ఏమీ చేయలేదు. శ్రీలీల నృత్యాలు, గ్లామర్ పబ్లిసిటీ పరంగా బాగానే ప్లస్ అవుతోంది. ది వారియర్ డిజాస్టర్ తర్వాత రామ్ ఎంతో నమ్మకంతో చేస్తున్న స్కంద సక్సెస్ అయితే డబుల్ ఇస్మార్ట్ బిజినెస్ కి మరింత హెల్ప్ అవుతుంది. చూడాలి మరి.
This post was last modified on August 23, 2023 3:13 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…