కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నదే నిజమని తేలిపోయింది. టాలీవుడ్లో తొలిసారిగా ఓ క్రేజీ మూవీ థియేట్రికల్ రిలీజ్ను స్కిప్ చేసి నేరుగా ఆన్ లైన్లో రిలీజ్ కాబోతోంది. ఈ విషయమై అధికారిక ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఇంకా డేట్ చెప్పలేదు కానీ.. ఇందులో విలన్ పాత్ర చేసిన నేచురల్ స్టార్ నాని ఒక వీడియో ద్వారా ఆ సంకేతాలు ఇచ్చేశాడు. ఆ వీడియో చూస్తే ‘వి’ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోందని స్పష్టం అయిపోయింది.
ఈ వీడియోలో ముందుగా థియేటర్లో కూర్చుని పాప్ కార్న్ చూస్తూ నాని సినిమా చూస్తుంటాడు. సినిమా పూర్తయి రోలింగ్ టైటిల్స్ అయిపోతుండగా.. అప్పుడే అయిపోయిందా సినిమా అని ఫీలవుతాడు. తర్వాత అయితేనేం.. మళ్లీ మళ్లీ ఎన్నిసార్లయినా చూసుకోవచ్చుగా అంటూ.. థియేటర్ నుంచి బయటికి వచ్చి తలుపు తీస్తే పక్కన ఇంట్లో వంటగది కనిపిస్తుంది. అంటే నాని సినిమా చూసింది హోం థియేటర్లో అనమాట.
ఆ తర్వాత మారుతున్న సినిమా వీక్షణం గురించి చిన్న ఉపోద్ఘాతం ఇచ్చి.. మిడ్ నైట్ షోలు, ఫస్ట్ డే ఫస్ట్ షోలు, విడుదలకు ముందుండే నెర్వస్నెస్.. ఇవన్నీ తాము మిస్సవుతున్నామని.. అలాగే ప్రేక్షకులూ ఆ స్థితిలోనే ఉన్నారని.. కానీ మళ్లీ ఆ సందడి మొదలు కాబోతోందని నాని అన్నాడు. ఆ తర్వాత ‘వి’ సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతోందని.. దాని గురించి గురువారం అప్ డేట్ ఇవ్వనున్నామని నాని వెల్లడించాడు. ఈ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూ.32 కోట్లకు కొన్నారని.. సెప్టెంబరు తొలి వారంలో ఈ చిత్రం నేరుగా ఆన్ లైన్లో రిలీజవుతుందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 19, 2020 9:05 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…