అసలెలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం రేపిన కాంతారకు ప్రీక్వెల్ రూపొందబోయే సంగతి తెలిసిందే. అంటే ఫస్ట్ పార్ట్ లో చూసిన కథకు ముందు ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి ఫార్ములా అన్న మాట. కొడుకు బిగినింగ్ నడిపించాక తండ్రి ఫ్లాష్ బ్యాక్ ని కంక్లూజన్ లో రివీల్ చేసినట్టు ఇక్కడ కూడా అదే ఫార్మాట్ వాడబోతున్నారు. కాంతారకు 16 కోట్లు ఖర్చు పెట్టిన హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు ఏకంగా 125 కోట్లకు ఓకే చెప్పిందట. కేవలం ప్రీ ప్రొడక్షన్ కే ఇరవై పైగానే ఖర్చు పెట్టాల్సి వస్తోందని బెంగళూరు టాక్.
ఈ లెక్కన కాంతార 2 ఊహలకు మించి ఉంటుంది. బహు భాషల్లో ఇది సాధించిన విజయం చూసి హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. మొదటి వెర్షన్ లో స్టార్ క్యాస్టింగ్ ఉండదు. మొత్తం ఇతని మీదే నడిచింది. పేరున్న ఆర్టిస్టు ఒక్క కిషోర్ మాత్రమే కనిపించాడు. ఈసారి అలా కాకుండా సీనియర్ నటీనటులతో పాటు ఊహించని తారాగణాన్ని రిషబ్ సెట్ చేసుకోబోతున్నట్టు తెలిసింది. 2024 వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే సంకల్పంతో ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ లో దేవర, పుష్ప 2 లాంటివి ఉన్నాయి కాబట్టి క్లాష్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
కాంతార షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుతుంది. ఆరు నెలల్లో పూర్తి చేసి మరో అరవై రోజులు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ కి కేటాయించబోతున్నారు. సహజంగానే దీని మీద అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి కాబట్టి రిషబ్ శెట్టి దానికి అనుగుణంగానే సిద్ధమవుతున్నాడు. ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది. దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి ప్రశ్నలకు సమాధానం ఇందులో చూపించబోతున్నారు. కెజిఎఫ్, సలార్ తర్వాత హోంబాలే బ్యానర్ కి సీక్వెల్ సిరీస్ లో రాబోతున్న మూడో సినిమా కాంతారనే.
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…