అసలెలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం రేపిన కాంతారకు ప్రీక్వెల్ రూపొందబోయే సంగతి తెలిసిందే. అంటే ఫస్ట్ పార్ట్ లో చూసిన కథకు ముందు ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే బాహుబలి ఫార్ములా అన్న మాట. కొడుకు బిగినింగ్ నడిపించాక తండ్రి ఫ్లాష్ బ్యాక్ ని కంక్లూజన్ లో రివీల్ చేసినట్టు ఇక్కడ కూడా అదే ఫార్మాట్ వాడబోతున్నారు. కాంతారకు 16 కోట్లు ఖర్చు పెట్టిన హోంబాలే ఫిలిమ్స్ ఇప్పుడు ఏకంగా 125 కోట్లకు ఓకే చెప్పిందట. కేవలం ప్రీ ప్రొడక్షన్ కే ఇరవై పైగానే ఖర్చు పెట్టాల్సి వస్తోందని బెంగళూరు టాక్.
ఈ లెక్కన కాంతార 2 ఊహలకు మించి ఉంటుంది. బహు భాషల్లో ఇది సాధించిన విజయం చూసి హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. మొదటి వెర్షన్ లో స్టార్ క్యాస్టింగ్ ఉండదు. మొత్తం ఇతని మీదే నడిచింది. పేరున్న ఆర్టిస్టు ఒక్క కిషోర్ మాత్రమే కనిపించాడు. ఈసారి అలా కాకుండా సీనియర్ నటీనటులతో పాటు ఊహించని తారాగణాన్ని రిషబ్ సెట్ చేసుకోబోతున్నట్టు తెలిసింది. 2024 వేసవిలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే సంకల్పంతో ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ లో దేవర, పుష్ప 2 లాంటివి ఉన్నాయి కాబట్టి క్లాష్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
కాంతార షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుతుంది. ఆరు నెలల్లో పూర్తి చేసి మరో అరవై రోజులు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫెక్స్ కి కేటాయించబోతున్నారు. సహజంగానే దీని మీద అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి కాబట్టి రిషబ్ శెట్టి దానికి అనుగుణంగానే సిద్ధమవుతున్నాడు. ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ మొదలయ్యింది. దేవుడు ప్రత్యేకంగా ఒక తెగవాళ్లనే ఎందుకు పూనుతాడు లాంటి ప్రశ్నలకు సమాధానం ఇందులో చూపించబోతున్నారు. కెజిఎఫ్, సలార్ తర్వాత హోంబాలే బ్యానర్ కి సీక్వెల్ సిరీస్ లో రాబోతున్న మూడో సినిమా కాంతారనే.
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…