Movie News

ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు

ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో బిజీయెస్ట్ యంగ్ హీరోల్లో ఒకడిగా ఉండేవాడు మంచు మనోజ్. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసినప్పటి నుంచి 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ వరకు అతను దాదాపు 20 సినిమాల్లో నటించడం విశేషం. ఇంత స్పీడు చూపించిన హీరో నుంచి.. 2017 తర్వాత ఆరేళ్ల పాటు ఒక్క రిలీజ్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

వరుస ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకుల కారణంగా అతను సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశాడు. ఆ సినిమా ఎంతకీ మొదలు కాకపోగా.. సడెన్‌గా ‘వాట్ ద ఫిష్’ అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అప్పుడు కానీ ‘అహం బ్రహ్మాస్మి’ ఆగిపోయిన సంగతి జనాలకు అర్థం కాలేదు.

పోనీ కొత్త సినిమాను ప్రకటించాక అయినా మనోజ్ వెంటనే షూట్‌‌కు వెళ్లాడా అంటే అదీ లేదు. నెలలు గడుస్తున్నా ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. ఈ సినిమా సంగతి ఏమవుతుందో అని మనోజ్ ఫ్యాన్స్ కంగారు పడుతుండగా.. ఎట్టకేలకు మనోజ్ నుంచి షూట్ అప్‌డేట్ వచ్చింది. తాను తిరిగి కెమెరా ముందుకు వచ్చిన విషయాన్ని వెల్లడిస్తూ ఈ రోజు ఒక ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు మనోజ్.

మళ్లీ సినిమా అమ్మ దగ్గరికి వచ్చానంటూ కెమెరాకు దండం పెడుతున్న ఫొటోను అతను పోస్ట్ చేశాడు. ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో ఇలా ఆరేళ్ల పాటు కెరీర్లో గ్యాప్ తీసుకోవడం అన్నది అరుదైన విషయం. సరైన సినిమాలు ఎంచుకోక మనోజ్‌కు వరుసగా ఫ్లాపులు వచ్చి ఉండొచ్చు కానీ.. ఒకప్పుడు బిందాస్, కరెంటు తీగ, పోటుగాడు లాంటి సినిమాలతో అతను మంచి ఊపుమీదే ఉండేవాడు. ‘వాట్ ద ఫిష్’ టైటిల్, ప్రోమోలు చూస్తే.. మళ్లీ మనోజ్ ఒక క్రేజీ రైడ్‌కు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తన ఫ్యాన్స్‌ను అతను అలరిస్తాడని ఆశిద్దాం.

This post was last modified on August 22, 2023 10:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తొమ్మిది రోజులే ఉంది భగత్ గారూ !

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…

2 hours ago

తెలివైన స్ట్రాటజీతో ఎన్టీఆర్ & నీల్

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…

3 hours ago

మెడికో దీపిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…

4 hours ago

స‌భ్య‌త్వం సౌండ్ లేదు సైనికా

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న జ‌న‌సేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ స‌భ్య‌త్వాన్ని గత నెల‌లోనే ప్రారంభించిన…

8 hours ago

మార‌క‌పోతే మార్చేస్తా.. త‌మ్ముళ్ల‌కు బాబు హెచ్చరిక‌

పార్టీ విధానాల‌కు, సిద్ధాంతాల‌కు అనుగుణంగా నాయ‌కులు ప‌నిచేయాల‌ని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు టీడీపీ నాయ‌కుల‌కు సూచించారు. నంద్యాల…

10 hours ago