Movie News

ఆరేళ్ల తర్వాత కెమెరా ముందుకు

ఒకప్పుడు విరామం లేకుండా సినిమాలు చేస్తూ టాలీవుడ్లో బిజీయెస్ట్ యంగ్ హీరోల్లో ఒకడిగా ఉండేవాడు మంచు మనోజ్. 2004లో ‘దొంగ దొంగది’ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేసినప్పటి నుంచి 2017లో ‘ఒక్కడు మిగిలాడు’ వరకు అతను దాదాపు 20 సినిమాల్లో నటించడం విశేషం. ఇంత స్పీడు చూపించిన హీరో నుంచి.. 2017 తర్వాత ఆరేళ్ల పాటు ఒక్క రిలీజ్ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

వరుస ఫ్లాపులు, వ్యక్తిగత జీవితంలో ఒడుదొడుకుల కారణంగా అతను సినిమాల నుంచి లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమాను మొదలుపెట్టినట్లే పెట్టి ఆపేశాడు. ఆ సినిమా ఎంతకీ మొదలు కాకపోగా.. సడెన్‌గా ‘వాట్ ద ఫిష్’ అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అప్పుడు కానీ ‘అహం బ్రహ్మాస్మి’ ఆగిపోయిన సంగతి జనాలకు అర్థం కాలేదు.

పోనీ కొత్త సినిమాను ప్రకటించాక అయినా మనోజ్ వెంటనే షూట్‌‌కు వెళ్లాడా అంటే అదీ లేదు. నెలలు గడుస్తున్నా ఈ సినిమా గురించి ఏ అప్‌డేట్ లేదు. ఈ సినిమా సంగతి ఏమవుతుందో అని మనోజ్ ఫ్యాన్స్ కంగారు పడుతుండగా.. ఎట్టకేలకు మనోజ్ నుంచి షూట్ అప్‌డేట్ వచ్చింది. తాను తిరిగి కెమెరా ముందుకు వచ్చిన విషయాన్ని వెల్లడిస్తూ ఈ రోజు ఒక ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకున్నాడు మనోజ్.

మళ్లీ సినిమా అమ్మ దగ్గరికి వచ్చానంటూ కెమెరాకు దండం పెడుతున్న ఫొటోను అతను పోస్ట్ చేశాడు. ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరో ఇలా ఆరేళ్ల పాటు కెరీర్లో గ్యాప్ తీసుకోవడం అన్నది అరుదైన విషయం. సరైన సినిమాలు ఎంచుకోక మనోజ్‌కు వరుసగా ఫ్లాపులు వచ్చి ఉండొచ్చు కానీ.. ఒకప్పుడు బిందాస్, కరెంటు తీగ, పోటుగాడు లాంటి సినిమాలతో అతను మంచి ఊపుమీదే ఉండేవాడు. ‘వాట్ ద ఫిష్’ టైటిల్, ప్రోమోలు చూస్తే.. మళ్లీ మనోజ్ ఒక క్రేజీ రైడ్‌కు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తన ఫ్యాన్స్‌ను అతను అలరిస్తాడని ఆశిద్దాం.

This post was last modified on August 22, 2023 10:15 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

2 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

3 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

3 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

4 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

4 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

5 hours ago