Movie News

శివోహం చుట్టూ సందేహాల వలయం

ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా అవకాశాలు పడుతున్న వాళ్లలో దర్శకుడు రమేష్ వర్మ ఒకరు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో రాక్షసుడు ఒక్కటే ఈయనకు చెప్పుకోదగ్గ హిట్టు. ఆ తర్వాత రవితేజకు ఖిలాడీ రూపంలో ఎంత పెద్ద షాక్ ఇచ్చారో తెలిసిందే. దీని ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే నిర్మాతను ఉద్దేశించి అప్పుడప్పుడు సెట్స్ కి రమ్మని మాస్ మహారాజా చెప్పడం వీడియో రూపంలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు శివోహం అనే మరో పెద్ద ప్రాజెక్టు పట్టారు. తమిళ హీరో సూర్య బంధువు టి జ్ఞానవేల్ రాజా నిర్మాతగా మల్టీ లాంగ్వేజెస్ లో ఇది రూపొందనుంది. ఇవాళే టైటిల్ పోస్టర్ వదిలారు.

చెన్నై టాక్ ప్రకారం ఇది భూల్ భులాయ్యా 2 రీమేకట. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా వచ్చిన ఈ హారర్ థ్రిల్లర్ బాలీవుడ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఒరిజినల్ వెర్షన్ లో హీరో, హీరోయిన్ తో సమానంగా ప్రాధాన్యం కలిగిన పాత్రను టబు పోషించారు. ఆవిడది అందులో డ్యూయల్ రోల్. ఒకటి దెయ్యంగా నెగటివ్, మరొకటి సాత్వికంగా పాజిటివ్ ఉంటుంది. కానీ తమిళ తెలుగు కోసం అడిగినప్పుడు టబు నో చెప్పారట. మరి అంతే ఇంటెన్స్ తో అదే స్థాయిలో మెప్పించడం సీనియర్ నటీమణుల్లో ఆమె కాకుంటే ఒక్క నీలాంబరి అలియాస్ రమ్యకృష్ణ వల్లే సాధ్యమవుతుంది.

అందుకే దర్శక నిర్మాతలు ఆ ప్రయత్నంలో ఉన్నట్టు తెలిసింది. శివోహం హీరో ఎవరో ఇంకా రివీల్ కాలేదు. వరుణ్ తేజ్ ని ట్రై చేశారు కానీ తను సానుకూలంగా స్పందించలేదట. సాయి తేజ్ హెల్త్ కోసం ఆరు నెలలు రెస్ట్ లో ఉండటంతో అదీ సాధ్యం కాలేదు. ఇంకో మీడియం రేంజ్ హీరోని ఒప్పించారనే టాక్ ఉంది కానీ అగ్రిమెంట్ మీద సంతకం అయ్యాకే అఫీషియల్ గా ప్రకటిస్తారు. ఇంకో న్యూస్ ఏంటంటే టబు పాత్రను మగాడిగా మార్పు చేసి ఆ స్థానంలో విజయ్ సేతుపతితో చేయించే ప్లానింగ్ కూడా ఉందట. అసలింతకీ ఇది భూల్ భులాయ్యా 2కి మరో రూపమో కాదో తెలియాల్సి ఉంది.

This post was last modified on August 22, 2023 6:21 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

57 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

2 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

2 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

3 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

3 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 hours ago