టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రామ్ చరణ్, తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమాను అనౌన్స్ చేసినపుడు మెగా అభిమానులు మామూలుగా ఎగ్జైట్ కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడమే కాక.. చకచకా కొన్ని షెడ్యూళ్లు పూర్తి చేశారు. ఒకప్పుడు ఉన్న అంచనాల ప్రకారం అయితే ఈ ఏడాది సంక్రాంతికే ఈ చిత్రం విడుదల కావాల్సింది.
కానీ శంకర్ మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను టేకప్ చేయాల్సి రావడంతో మొత్తం కథ మారిపోయింది. ‘గేమ్ చేంజర్’ వెనక్కి వెళ్లిపోయింది. ఈ రెండు చిత్రాలనూ సమాంతరంగా పూర్తి చేసేలా ముందు ప్లానింగ్ జరిగినా.. అలా సాధ్యపడలేదు. ‘ఇండియన్-2’ మీదే శంకర్ చాలా కాలంగా పని చేస్తున్నాడు. ‘గేమ్ చేంజర్’ను ఒక దశలో పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆ సినిమా సంగతి ఎటూ తేలకుండా పోయింది.
ఐతే చరణ్ అభిమానులేమో ఈ సినిమా గురించి అప్డేట్స్ ఏమీ లేవంటూ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు చాలా కాలంగా. ఐతే ఈ సినిమా విషయంలో దిల్ రాజే పెద్ద బాధితుడు అనే విషయం అభిమానులు అర్థం చేసుకోలేకపోయారు. దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమా ఏళ్లకు ఏళ్లు ఆలస్యం అయితే నిర్మాతకు ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ చేసేదేమీ లేక శంకర్ కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇన్నేళ్ల కెరీర్లో రాజుకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. కానీ అభిమానులేమో ఇప్పటికీ రాజును వదడం లేదు.
తాజాగా తన ఫ్యామిలీ హీరో అశిష్ కొత్త సినిమా మొదలైన సందర్భంగా ‘గేమ్ చేంజర్’ అప్డేట్స్ కోసం మీడియా వాళ్లు ఆయన్ని కదిపే ప్రయత్నం చేశారు. అభిమానుల డిమాండ్ గురించి ప్రస్తావించారు. దానికాయన బదులిస్తూ.. ‘‘మనమేం చేయలేం. డైరెక్టర్ గారి చేతుల్లోనే అంతా ఉంది. ఆయన ఇచ్చినపుడు మాత్రమే అప్డేట్స్ బయటికి వస్తాయి’’ అంటూ చేతులెత్తేశారు. రాజు ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడో చెప్పడానికి ఈ మాటలు రుజువు. ఇప్పటికైనా ఫ్యాన్స్ పరిస్థితి అర్థం చేసుకుని రాజును టార్గెట్ చేయడం మానేస్తే బెటర్.
This post was last modified on August 22, 2023 3:19 pm
సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…
నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాస్తవానికి గతంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘటనలు జరిగేవి. తాజాగా…
80, 90 దశకాల్లో వైభవం చూసిన కథానాయకుల్లో రాజశేఖర్ ఒకరు. స్వతహాగా తమిళుడైనప్పటికీ.. తెలుగులోనే ఆయన పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…
గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్గా…
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…