టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడైన రామ్ చరణ్, తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో అగ్ర నిర్మాత దిల్ రాజు సినిమాను అనౌన్స్ చేసినపుడు మెగా అభిమానులు మామూలుగా ఎగ్జైట్ కాలేదు. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ముందే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లడమే కాక.. చకచకా కొన్ని షెడ్యూళ్లు పూర్తి చేశారు. ఒకప్పుడు ఉన్న అంచనాల ప్రకారం అయితే ఈ ఏడాది సంక్రాంతికే ఈ చిత్రం విడుదల కావాల్సింది.
కానీ శంకర్ మధ్యలో ఆగిన ‘ఇండియన్-2’ను టేకప్ చేయాల్సి రావడంతో మొత్తం కథ మారిపోయింది. ‘గేమ్ చేంజర్’ వెనక్కి వెళ్లిపోయింది. ఈ రెండు చిత్రాలనూ సమాంతరంగా పూర్తి చేసేలా ముందు ప్లానింగ్ జరిగినా.. అలా సాధ్యపడలేదు. ‘ఇండియన్-2’ మీదే శంకర్ చాలా కాలంగా పని చేస్తున్నాడు. ‘గేమ్ చేంజర్’ను ఒక దశలో పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆ సినిమా సంగతి ఎటూ తేలకుండా పోయింది.
ఐతే చరణ్ అభిమానులేమో ఈ సినిమా గురించి అప్డేట్స్ ఏమీ లేవంటూ నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు చాలా కాలంగా. ఐతే ఈ సినిమా విషయంలో దిల్ రాజే పెద్ద బాధితుడు అనే విషయం అభిమానులు అర్థం చేసుకోలేకపోయారు. దాదాపు రెండొందల కోట్ల బడ్జెట్ పెట్టి తీస్తున్న సినిమా ఏళ్లకు ఏళ్లు ఆలస్యం అయితే నిర్మాతకు ఎంత నష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ చేసేదేమీ లేక శంకర్ కోసం ఎదురు చూస్తున్నాడు రాజు. ఇన్నేళ్ల కెరీర్లో రాజుకు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదు. కానీ అభిమానులేమో ఇప్పటికీ రాజును వదడం లేదు.
తాజాగా తన ఫ్యామిలీ హీరో అశిష్ కొత్త సినిమా మొదలైన సందర్భంగా ‘గేమ్ చేంజర్’ అప్డేట్స్ కోసం మీడియా వాళ్లు ఆయన్ని కదిపే ప్రయత్నం చేశారు. అభిమానుల డిమాండ్ గురించి ప్రస్తావించారు. దానికాయన బదులిస్తూ.. ‘‘మనమేం చేయలేం. డైరెక్టర్ గారి చేతుల్లోనే అంతా ఉంది. ఆయన ఇచ్చినపుడు మాత్రమే అప్డేట్స్ బయటికి వస్తాయి’’ అంటూ చేతులెత్తేశారు. రాజు ఎంతటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడో చెప్పడానికి ఈ మాటలు రుజువు. ఇప్పటికైనా ఫ్యాన్స్ పరిస్థితి అర్థం చేసుకుని రాజును టార్గెట్ చేయడం మానేస్తే బెటర్.
This post was last modified on August 22, 2023 3:19 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…