దశాబ్దాల గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా మెగాస్టార్ 157 అఫీషియల్ గా ప్రకటించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై బింబిసార ఫేమ్ మల్లిడి వేణు(వశిష్ట) దర్శకత్వంలో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీకి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ తొందరపడి ఇప్పుడే ఎందుకు అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆగిపోయారు. పోస్టర్ లో ఓ పెద్ద శిల మీదన బంగారు నక్షత్రం గుర్తుపై పంచ భూతాలను సూచిస్తూ, అయిదు గళ్ళను నింపుతూ మధ్యలో త్రిశూలాన్ని పొందుపర్చడం చూస్తే ఇదేదో ఆషామాషీ ప్లానింగ్ లా కనిపించడం లేదు.
కాన్సెప్ట్ కు సంబంధించిన లుక్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయలేదు. ప్రచారంలో ఉన్న ఏ పేరూ పోస్టర్ లో లేదు. సంగీత దర్శకుడు కీరవాణి, కెమెరామెన్ చోటా కె నాయుడులతో సహా ఎవరినీ పొందుపరచలేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిని పరిచయం చేసే అవకాశం ఉంది. బింబిసార తర్వాత దాని సీక్వెల్ చేయాల్సి ఉన్నా ఊహించని విధంగా వశిష్ట మెగా 157 వైపు వచ్చేశాడు. ఈ లెక్కన సుష్మిత కొణిదెల నిర్మించబోయేది 156 అవుతుంది. విషెస్ చెప్పారు కానీ డైరెక్టర్ తో సహా ఎవరి నేమ్ లేకుండా గోల్డ్ బాక్స్ బ్యానర్ తరఫున శుభాకాంక్షలు చెప్పారు
పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి సరైన బహుమతే దక్కింది. రీమేకులతో విసుగొచ్చి భోళా శంకర్ డిజాస్టర్ తో అభిమానుల అసహనం పీక్స్ కి చేరిన తరుణంలో ఈ ప్రకటన చాలా ఊరటనిస్తోంది. అయితే బడ్జెట్ పరంగా చాలా భారీ చిత్రం కాబట్టి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు, రిలీజ్ ఎపుడు ఉంటుందనే వివరాలు ఇప్పుడప్పుడే బయట పడవు. అంజి తర్వాత ఈ జానర్ కి చిరంజీవి దూరంగా ఉన్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహా మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఫైనల్ గా మెగా 157 రూపంలో తీరబోతోంది. వశిష్ట ఎలాంటి విజువల్ వండర్ అందిస్తాడో చూడాలి.
This post was last modified on August 22, 2023 11:36 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…