దశాబ్దాల గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా మెగాస్టార్ 157 అఫీషియల్ గా ప్రకటించారు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై బింబిసార ఫేమ్ మల్లిడి వేణు(వశిష్ట) దర్శకత్వంలో రూపొందబోయే ఈ ప్యాన్ ఇండియా మూవీకి టైటిల్ ఇంకా నిర్ణయించలేదు. పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి కానీ తొందరపడి ఇప్పుడే ఎందుకు అనౌన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆగిపోయారు. పోస్టర్ లో ఓ పెద్ద శిల మీదన బంగారు నక్షత్రం గుర్తుపై పంచ భూతాలను సూచిస్తూ, అయిదు గళ్ళను నింపుతూ మధ్యలో త్రిశూలాన్ని పొందుపర్చడం చూస్తే ఇదేదో ఆషామాషీ ప్లానింగ్ లా కనిపించడం లేదు.
కాన్సెప్ట్ కు సంబంధించిన లుక్ కాబట్టి ఇంతకంటే ఎక్కువ రివీల్ చేయలేదు. ప్రచారంలో ఉన్న ఏ పేరూ పోస్టర్ లో లేదు. సంగీత దర్శకుడు కీరవాణి, కెమెరామెన్ చోటా కె నాయుడులతో సహా ఎవరినీ పొందుపరచలేదు. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరిని పరిచయం చేసే అవకాశం ఉంది. బింబిసార తర్వాత దాని సీక్వెల్ చేయాల్సి ఉన్నా ఊహించని విధంగా వశిష్ట మెగా 157 వైపు వచ్చేశాడు. ఈ లెక్కన సుష్మిత కొణిదెల నిర్మించబోయేది 156 అవుతుంది. విషెస్ చెప్పారు కానీ డైరెక్టర్ తో సహా ఎవరి నేమ్ లేకుండా గోల్డ్ బాక్స్ బ్యానర్ తరఫున శుభాకాంక్షలు చెప్పారు
పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ ఫ్యాన్స్ కి సరైన బహుమతే దక్కింది. రీమేకులతో విసుగొచ్చి భోళా శంకర్ డిజాస్టర్ తో అభిమానుల అసహనం పీక్స్ కి చేరిన తరుణంలో ఈ ప్రకటన చాలా ఊరటనిస్తోంది. అయితే బడ్జెట్ పరంగా చాలా భారీ చిత్రం కాబట్టి షూటింగ్ ఎప్పుడు మొదలుపెడతారు, రిలీజ్ ఎపుడు ఉంటుందనే వివరాలు ఇప్పుడప్పుడే బయట పడవు. అంజి తర్వాత ఈ జానర్ కి చిరంజీవి దూరంగా ఉన్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహా మూవీ చేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండ్ ఫైనల్ గా మెగా 157 రూపంలో తీరబోతోంది. వశిష్ట ఎలాంటి విజువల్ వండర్ అందిస్తాడో చూడాలి.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…